అన్వేషించండి

MLC Kavitha: ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు కానుక ఇద్దాం - ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

MLC Kavitha: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్సీని సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిశారు. తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి చుట్టు పక్కల ఉన్న ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నారు. అందుకే సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి కేసీఆర్ తప్పించారని పేర్కొన్నారు.  

తెలంగాణ రాక ముందు 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి వారసత్వం ఉద్యోగాలను కల్పించారన్నారు. సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. సీఎంతో సింగరేణి కార్మిక నాయకుల సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేస్ నాయకులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు వరాలు ప్రకటించిన కేసీఆర్
ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి కార్మికులకు సీఎం చంద్రశేఖర్‌రావు బొనాంజా ప్రకటించారు. దసరా, దీపావళి బోనస్‌గా రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. సింగరేణిని నిండా ముంచిందే కాంగ్రెస్‌ అని, సింగరేణి 100% తెలంగాణ కంపెనీ అన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో వీళ్లకు పరిపాలన చేతకాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చారని, అవి తిరిగి చెల్లించలేక 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టారని అన్నారు. 

కాంగ్రెస్‌ హయాంలో సింగరేణి టర్నోవర్‌ రూ.12 వేల కోట్లు ఉండేదని. ఇప్పుడు రూ.33 వేల కోట్లకు పెంచినట్లు కేసీఆర్ తెలిపారు. రూ.419 కోట్లు ఉండే సింగరేణి లాభాలను రూ.2,222 కోట్లకు పెంచినట్లు చెప్పారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ కింద రూ.వెయ్యికోట్ల ఇస్తామన్నారు. టీడీపీ హయాంలో వారసత్వ ఉద్యోగాలు తొలగించారని, కాంగ్రెస్‌ దానిని పునరుద్ధరించలేదన్నారు. గని ప్రమాదంలో కార్మికులు చనిపోతే రూ. లక్ష ఇచ్చేవారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రూ.10 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. 

వారసత్వ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షల ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులు  ఇళ్లు కట్టుకుంటామని అడిగితే వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సింగరేణి జాగల్లో గుడిసెలు వేసుకున్న 20 వేల మంది నాయీ బ్రాహ్మణులు, రజకులు, పేదలకు జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చి ఆదుకున్నట్లు చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
Embed widget