అన్వేషించండి

Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?

Naini coal block: తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇద్దరు అధికారుల్ని నియమించింది.

Naini coal block tenders Central inquiry: ఒడిశాలోని  నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు  సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టనున్నారు. ముఖ్యంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ వంటి వివాదాస్పద నిబంధనలు ఎందుకు పెట్టారు? టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై వీరు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.          

దర్యాప్తునకు ఇద్దరు అధికారుల్ని  పంపుతున్న కిషన్ రెడ్డి                                    

ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క ఇప్పటికే స్పందిస్తూ.. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సింగరేణి బోర్డును ఆదేశించారు. అక్రమాలకు తావులేకుండా, పారదర్శకత కోసం పాత టెండర్లను రద్దు చేసి, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ నిబంధనలకు అనుగుణంగా కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ మంత్రుల మధ్య వాటాల వివాదం వల్లే ఈ టెండర్లు రద్దయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం కేవలం పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.                 

సింగేరణి దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపణలు                                         

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం  బంగారు బాతు లా వాడుకుంటోందని విమర్శించారు. టెండర్లలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని ఆయన సవాల్ విసిరారు. జాతీయ స్థాయిలో బొగ్గు టెండర్లలో ఎక్కడా లేని  సైట్ విజిట్ నిబంధనను కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రతినిధుల బృందం ఇప్పుడు సింగరేణి రికార్డులను పరిశీలించి, అధికారుల నుంచి వివరణ కోరనుంది.             

ఇప్పటికే టెండర్లు రద్దు చేసిన సింగరేణి                

ప్రస్తుతానికి సింగరేణి యాజమాన్యం అధికారికంగా ఈ టెండర్ ప్రక్రియను నిలిపివేసింది. జనవరి 22 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాలనాపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి పేర్కొన్నప్పటికీ, కేంద్రం పంపుతున్న విచారణ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ వ్యవహారం తదుపరి మలుపు తిరిగే అవకాశం ఉంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
Advertisement

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
BRS Vs Sajjanar: పొలిటికల్ స్పాట్‌లైట్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆయన కాంగ్రెస్ పోలీసా..?
పొలిటికల్ స్పాట్‌లైట్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆయన కాంగ్రెస్ పోలీసా..?
Aamir Khan Gauri Spratt : ప్రియురాలు గౌరీతో వివాహం - బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ రియాక్షన్
ప్రియురాలు గౌరీతో వివాహం - బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ రియాక్షన్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Border 2 First Day Collection Prediction: 'బోర్డర్ 2' దెబ్బకు 'రాజా సాబ్' గల్లంతు... 'ధురంధర్', 'ఛావా' రికార్డులను సన్నీ డియోల్ సినిమా బీట్ చేస్తుందా?
'బోర్డర్ 2' దెబ్బకు 'రాజా సాబ్' గల్లంతు... 'ధురంధర్', 'ఛావా' రికార్డులను సన్నీ డియోల్ సినిమా బీట్ చేస్తుందా?
Embed widget