అన్వేషించండి

Telangana Liberation Day : కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం!

Telangana Liberation Day : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక, హోంశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించనున్నారు.

Telangana Liberation Day : టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ మరో ప్లాన్ వేసింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక, హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శితో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష చేశారు.  

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్‌ ఉంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మై కూడా పాల్గొంటారని సమాచారం. మహారాష్ట్ర, కర్నాటకతో తెలంగాణ విమోచనానికి సంబంధం ఉండటంతో ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.  నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో కేంద్రం ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. నిజాం నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తైన  సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.  దీనిపై శనివారం జరిగే కేబినెట్ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. 

ప్రతిపక్షాల అస్త్రం 

తెలంగాణ ఏర్పాడినప్పటి నుంచి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. దీనిపై ప్రతిపక్షాల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మజ్లీస్ కు భయపడి టీఆర్ఎస్ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని ప్రతిపక్షాలు ముఖ్యమంగా బీజేపీ విమర్శలు చేస్తుంది. దిల్లీ నుంచి బీజేపీ పెద్దలు తెలంగాణ వచ్చినప్పుడల్లా విమోచన అంశం టచ్ చేయకుండా ఉండరు. దీంతో టీఆర్ఎస్ రివర్స్ ఎటాక్ కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణ విమోజన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణలో పోటీపోటీ 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించింది. జూన్ లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా ఉండటంతో ఆయన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో వేడుకలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ నిర్వహించేది. ఇటీవల కేంద్రం కూడా ఈ వేడుకలు నిర్వహించింది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణ త్యాగం చేసిన యువతను 'అన్ సంగ్ హీరోస్' పేరుతో ప్రస్తావించడం మొదలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ కట్టడాల గొప్పదనం, నిర్మాణ శైలి తదితరాలన్నింటినీ ఈ వేడుకల్లో ప్రస్తావించారు. 

Also Read : jagtial News : మలుపులు తిరుగుతున్న జగిత్యాల రాజకీయం - అభ్యర్థులెవరు ?

Also Read : Minister KTR : తెలంగాణపై వివక్షతో దేశప్రయోజనాలు తాకట్టు -మంత్రి కేటీఆర్

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget