అన్వేషించండి

KTR: 'కాంగ్రెస్ ప్రభుత్వంలో సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం' - సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి గురువారం బహిరంగ లేఖ రాశారు.

 Ktr Letter To CM Revanth Reddy: రాష్ట్రంలో నేతన్నలపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కక్ష కట్టిందని.. పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి (Cm Revanth Reddy) ఆయన గురువారం లేఖ రాశారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాలు చేనేత పరిశ్రమను నమ్ముకున్న వాళ్ల బతుకులు ఆగమయ్యేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు నిలిపేసిందని.. గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలి. 'చేనేతమిత్ర' వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్ట కొట్టొద్దు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకుంటే సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.' అంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

'రోడ్డున పడ్డా ఆదుకోరా.'

'రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా.?. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా.?. బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సమైక్య రాష్ట్రంలో నాటి సంక్షోభం నెలకొంది. గత ప్రభుత్వంలానే నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలి. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి. బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వడం సహా ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.' అని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.

'గతంలో ఇలా'

'బీఆర్ఎస్ హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చి చేతినిండా పని కల్పించాం. సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తూనే పోటీని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాం. మగ్గాల ఆధుకనికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్ తో అనుసంధానం వంటి ఆల్ రౌండ్ అప్రోచ్ తో ముందుకు సాగింది. ఈ విధానాలతో కార్మికులకు ఊరట లభించింది. చేనేతలకు బతుకమ్మ చీరల ఆర్డర్లతో వారికి చేతినిండా పని దొరికింది. వాటితో పాటు రంజాన్, క్రిస్మస్ వేడుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా ఇవ్వడంతో మరింత ఉపాధి పెరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలి' అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

కోతుల ఘటనపై ట్వీట్

మరోవైపు, నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని మంచి నీటి ట్యాంకులో పడి 30 కోతులు మృతి చెందిన ఘటనపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖలో ఇదో సిగ్గుమాలిన పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, సరిగా నిర్వహించడం ద్వారా ఇలాంటి ఇబ్బందులను తొలగించవచ్చని అన్నారు. కానీ ఈ తరహా చర్యలను అనుసరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్లే పాలన అస్తవ్యస్తంగా మారిందని ట్విట్టర్ లో కేటీఆర్ విమర్శించారు.

 

Also Read: Sangareddy News: ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత- కార్మికులపై లాఠీఛార్జ్‌- పరామర్శకు వెళ్లిన హరీష్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Embed widget