అన్వేషించండి

KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెటిజన్ల ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

KTR Chitchat With Netigens: తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని.. కానీ ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ కేటీఆర్' (#ASKKTR) పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని అన్నారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత ఆయన విస్తృతంగా ప్రజల్లోకి వస్తారు.

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయాం. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయి. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ వదిలిపెట్టం. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చేస్తాం. ప్రస్తుతం రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదు. పాలిటిక్స్‌లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదు.' అని పేర్కొన్నారు.

మూసీ పునరుజ్జీవం దేశంలోనే అతి పెద్ద స్కాం అని.. హైడ్రా అనేది ఓ బ్లాక్ మెయిలింగ్ టూల్ అని కేటీఆర్ ఆరోపించారు. వీటిపై నెటిజన్లు ప్రశ్నించగా సమాధానం ఇచ్చారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి వాళ్ల ఇళ్లు కూల్చుతున్నారని అన్నారు. అయితే, పెద్దవాళ్ల ఇళ్ల జోలికి వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని.. త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తామని అన్నారు. విలువలు లేని రాజకీయాలు తాము చేయలేమని.. అవి ఎక్కువ కాలం ఉండవని పేర్కొన్నారు.

 

Also Read: Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bus Accident: సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Advertisement

వీడియోలు

విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bus Accident: సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Snowfall Destinations in India : ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
Hyderabad Gold Seized: ఐరన్‌ బాక్స్‌లో రూ.1.55 కోట్ల బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్
ఐరన్‌ బాక్స్‌లో రూ.1.55 కోట్ల బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
Embed widget