అన్వేషించండి

Kavitha: బిగ్ రిలీఫ్ - రేపు కవితను కలవనున్న భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు

Telangana BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను కుటుంబసభ్యులు కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.

BRS MLC Kavitha to meet her family members: ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కుటుంబసభ్యులు కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు కోర్టు సమయం కేటాయించింది. కస్టడీలో ఉండే వారం రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఆరుగురు వ్యక్తుల వరకు కవితను కలుసుకోవచ్చునని కోర్టు పేర్కొంది. కవిత కోరినట్లుగా భర్త అనిల్‌తో శరత్, శ్రీధర్, ప్రణీత్‌ను కలిసేందుకు అవకాశం కల్పించింది కోర్టు. కోర్టు నిర్దేశించిన సమయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కేటీఆర్, హరీష్ రావు.. కవితను కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

కోర్టు మార్చి 23 వరకు ఏడు రోజులపాటు కవితకు ఈడీ కస్టడీ విధించింది. ఆమె కోరినట్లుగా బుక్స్, స్టేషనరీతో పాటు ఆమె కళ్లద్దాలు అందించాలని కోర్టు సూచించింది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కవితను విచారించాలని కోర్టు ఆదేశాలలో పేర్కొంది. విచారణను వీడియో రూపంలో రికార్డ్ చేయాలని ఈడీ అధికారులను కోర్టు ఆదేశించింది. కవితకు ఇంటి నుంచి భోజనం పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. మార్చి 23న 12 గంటలకు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టైన కవితకు షాక్ తగిలింది. కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 23 వరకూ ఆమెకు కస్టడీ విధించారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 23 వరకూ కవితను ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ రోజూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు.. ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలిచ్చింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు విక్రమ్ చౌదరి, మోహిత్ రావులు వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్, ఎన్.కే మట్టా వాదనలు వినిపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget