అన్వేషించండి

Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం

Telangana News: తన భూమిని కొందరు కబ్జా చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం రేగగా.. పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు.

Brs Leader Argue With Police In Land Issue: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1.15 ఎకరాల భూమి తాము కొన్నామని అది తమదేనని ఓ వర్గానికి చెందిన 15 మంది చెబుతుండగా.. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని.. దాన్ని తొలగించాలని తన అనుచరులను ఆదేశించారు. తనది, తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అయితే, మల్లారెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులు బారికేడ్లు, ఫెన్సింగ్ లను తొలగిస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురికి సద్దిచెప్పేందుకు యత్నించారు.

పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం

వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని పోలీసులు మల్లారెడ్డి సహా, మరో వర్గానికి సద్దిచెప్పారు. అయితే, తన భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. 'నాపై కేసు పెడితే పెట్టుకోండి. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ తొలగించారు. కాగా, గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని.. కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. మాజీ మంత్రి అనుచరులు తమను బెదిరిస్తున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు. అయితే, ఈ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.

మల్లారెడ్డి ఏం చెప్పారంటే.?

14 ఏళ్ల కిందటే తాము ఈ ప్రాపర్టీ తీసుకున్నామని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. '2 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే, ఇదే సర్వే నెంబర్ లో తమకు భూమి ఉందంటూ కొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. 8 ఏళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. వారు 4 ఎకరాల 26 గుంటలు ఉన్నాయని చెబుతున్నారని.. డాక్యుమెంట్లు ఉంటే సర్వే చేయించుకోమని చెప్పాం. అయినా దౌర్జన్యంగా రాత్రికి రాత్రే మా భూమిలో షెడ్లు కూలగొట్టి ల్యాండ్ కబ్జా చేసేందుకు యత్నించారు. రౌడీలను పెట్టి దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా భూమిని కాపాడుకోవాలని ఇక్కడకు వచ్చాం. అన్నీ డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలని చెప్పాం. దీనిపై కమిషనర్ కు సైతం ఫిర్యాదు చేస్తాం.' అని మల్లారెడ్డి చెప్పారు. 

పోలీసుల అదుపులో మల్లారెడ్డి

అయితే, సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూ వివాదానికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకోగా.. పోలీసులు వారిని నిలువరించారు. 

Also Read: Khammam News: ఆస్తి కోసం దారుణం - తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Kavitha new party: శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
Petrol mess: పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Embed widget