అన్వేషించండి

KCR: 'ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే?' - రైతులు, చేనేతల్ని ప్రభుత్వం ఆదుకోకుంటే వెంట పడతామని గులాబీ బాస్ వార్నింగ్

Telangana News: తెలంగాణలో నీటి నిర్వహణ తెలియని వారు రాజ్యం ఏలుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే పంటలు ఎండిపోయాయని.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Kcr Slams Congress Government: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇది కాలం తెచ్చిన కరువా.?, కాంగ్రెస్ తెచ్చిన కరువా.? అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ఎండిన పంటలును పరిశీలించిన ఆయన.. సిరిసిల్లలోని (Siricilla) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు అన్ని పంటలు ఎండిపోయాయని.. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. నీటి నిర్వహణపై ఈ సర్కారుకు సరైన అవగాహన లేదు. నాణ్యమైన విద్యుత్ అందక మోటార్లు కాలిపోతున్నాయి. వర్షపాతం లేక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ, ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయి. హస్తం పాలనలో అన్న వస్త్రం కోసం పోతే.. ఉన్న వస్త్రం ఊడినట్లుగా ఉంది. నూతన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని 4 నెలలు ఆగాం. ఇక ఊరుకునేది లేదు. రైతులు, చేనేత కార్మికుల్ని ఆదుకోకుంటే ఊరుకునేది లేదు.' అంటూ ప్రభుత్వానికి గులాబీ బాస్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రభుత్వానికి డిమాండ్

రాష్ట్రంలో వంద రోజుల్లోనే 209 మంది రైతులు చనిపోయారని.. 48 గంటల్లో లిస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడిగితే 4 గంటల్లోనే సీఎస్ కు వివరాలు పంపామని కేసీఆర్ అన్నారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. పదేళ్ల క్రితం చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైంది. బీఆర్ఎస్ హయాంలో చేనేతే కార్మికుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. చేనేతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. కాంగ్రెస్ మోసపూరిత హామీలు చూసి ప్రజలు మోసపోయారు. గత వేసవిలో 14,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగింది. ఈసారి గతేడాది కంటే 700 యూనిట్లు మాత్రమే అదనంగా వచ్చింది. కాళేశ్వరం వీలైనంత త్వరగా పూర్తి చేసి నీళ్లివ్వాలని ఆరాటపడ్డాం. 6 నెలల్లో ప్రాజెక్ట్ రూపకల్పన చేశాం. అందులో 3 పిల్లర్లు కుంగిపోతే.. మొత్తం మునిగిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం డిజైన్ల విషయంలో కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికీ నల్లాల ద్వారా నీరు సరఫరా చేశాం. ఇవాళ మళ్లీ నడిరోడ్డుపై బిందెలతో నీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథను నడిపే తెలివి వీళ్లకు లేదు.' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

10 వేల మందితో ధర్నా

కాంగ్రెస్ హయాంలో మళ్లీ చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ మండిపడ్డారు. 'బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా వంటి వాటితో వారికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాం. ఒకప్పుడు భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒకేసారి చనిపోయారు. అప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి సీఎంగా ఉన్నారు. ఆ కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా అడిగితే ఇవ్వలేదు. అప్పుడు రూ.7.5 లక్షలు సేకరించి బాధిత కుటుంబాలకు అందించాం. చేనేత కార్మికులు వారి సమస్యలపై శనివారం 10 వేల మందితో ధర్నా తలపెట్టారు. ఈ ఆందోళనకు మా పార్టీ నాయకులు హాజరవుతారు. వాళ్లకు అండగా ఉంటాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read: Harish Rao: 'అది జరిగితేనే కాంగ్రెస్ కు ఓటెయ్యండి' - సీఎం రేవంత్ రెడ్డి వలసలపై దృష్టి పెట్టారని హరీష్ రావు తీవ్ర ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
High Tension in Shamshabad: పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget