Breaking News LIVE: కుటుంబం సజీవదహనం కేసులో ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ అరెస్ట్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఎట్టకేలకు సీఎం జగన్తో నేడు (జనవరి 6) భేటీకానున్నారు ఏపీ ఉద్యోగసంఘాల నేతలు. దాంతో గత కొంత కాలంగా కొనసాగుతున్న పీఆర్సీ హైడ్రామాకు తెరపడనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ పలుదఫాలు అధికారులతోనూ, మంత్రులతోనూ చర్చలు జరిపినా పీఆర్సీపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఉద్యోగసంఘాల అసహనంతో ఉన్నాయి. దీంతో ఇక సీయంతోనే తేల్చుకుంటాం అంటూ పలుమార్లు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు చివరకు తాము డిమాండ్ చేసిన క్షణానికి చేరువయ్యారు. ఈ రోజు చర్చల అనంతరం పీఆర్సీపై ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వెలువడుతుందనే ఆశలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి.
నిన్ననే సీఎం వద్దకు పీఆర్సీ చర్చల వివరాలు
ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ అయితే ఏకంగా రెండుసార్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జలతో మూడు సార్లు, ఆర్థిక మంత్రి బుగ్గనతో రెండుసార్లు, చీఫ్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అంటూ అందరితోనూ అనేక మార్లు చర్చలు జరిపాయి ఉద్యోగ సంఘాలు. అయితే తాము డిమాండ్ చేసిన 48 శాతం పీఆర్సీపై ప్రభుత్వం నుండి రెడ్ సిగ్నల్ రావడం, ఏకంగా 14. 29 శాతం వద్దే ఫిక్స్ చేస్తామంటూ చెప్పడంతో ఉద్యోగ సంఘాలు షాక్ తిన్నాయి. ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి పొందుతున్న తమకు పీఆర్సీ 14. 29 శాతం అంటే ఇప్పుడువస్తున్న జీతంలో 13 శాతం వరకూ కోతపడుతుందనీ.. పీఆర్సీ వాళ్ళ జీతం పెరగడం మాట అటుంచి తగ్గడం ఏంటంటూ వారు ఖంగుతిన్నారు. అయితే ఈ భయాలన్నీ అర్థరహితం అనీ జీతాలు తగ్గకుండానే ఆ పీఆర్సీ అమలు చేస్తామంటూ సజ్జల లాంటి వాళ్ళు హామీ ఇచ్చినా ఉద్యోగ సంఘాలు నమ్మలేదు. దాంతో గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది
కేవలం పీఆర్సీ ఒక్కటే సమస్య కాదు: ఉద్యోగ సంఘాలు
తమది కేవలం పీఆర్సీ ఒకటే సమస్య కాదనీ మొత్తం 71 డిమాండ్లు తమ వద్ద ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అలాగే మధ్యంతర భృతికి చెందిన ఎరియర్స్ ఇంకా ఉద్యోగులకు అందలేదు. అలాగే పెండింగ్ డీఏలు కూడా. వీటన్నింటికి ఇప్పటికిప్పుడు రూ.1,600 కోట్లు కావాలి. ఉద్యోగుల డిమాండ్లలో ఇదీ ముఖ్యమే. అలాగే హెచ్ఆర్ఏకి సంబంధించిన సమస్యలూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ ఆసక్తికరంగా మారింది.
ఉద్యోగులు మొదట నుండీ డిమాండ్ చేస్తున్న 55 శాతం, తర్వాత కోరిన 48 శాతం పీఆర్సీ ఇచ్చే పరిస్థితి ఆర్థికంగా ఏపీ ప్రభుత్వానికి లేదు. అలానే ప్రభుత్వం చెబుతున్న 14.29 శాతం పీఆర్సీకి ఉద్యోగులు ఒప్పుకునే అవకాశమూ లేదు . వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు అందుకుంటున్న 27 శాతం మధ్యంతర భృతికి మరికొంత కలిపి 30 శాతానికి కాస్త అటుఇటుగా పీఆర్సీ ఇవ్వనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే ఈరోజు సమావేశం పూర్తయ్యేవరకూ ఆగాల్సిందే.
వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాసిన గంటలోపే వనమా రాఘవను అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా రాఘవను కొత్తగూడెం తరలించి కేసు విషయంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
రేపు కొత్తగూడెం బంద్.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు
రేపు కొత్తగూడెం బంద్కు రాజకీయ పార్టీలు, వామపక్ష, విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని.. వనమా రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఏపీ సీఎంతో మొదలైన ఉద్యోగ సంఘాల చర్చలు
ఏపీ సీఎం జగన్తో ఉద్యోగ సంఘాల చర్చలు మొదలు అయ్యాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. వీటిలో ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్ చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా సంఘాల నేతలు సీఎంను కోరనున్నారు.
యువతిపై యాసిడ్ దాడి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం పరిధిలోని కే బి నగర్ లో యువతి పుష్పపై గుర్తుతెలియని వ్యక్తులు ఆసిడ్ తో దాడి చేశారు. గాయాలపాలైన మహిళ ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో ఏడుగురు అరెస్టు: సీపీ
డ్రగ్స్ వినియోగదారుల్లో యువకులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. డిమాండ్ను తగ్గిస్తే డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవచ్చని అన్నారు. గురువారం టాస్క్స్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సదర్భంగా నిందితులను సీపీ ఆనంద్ మీడియా మందు హాజరుపరిచారు. ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారివద్ద 99 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఏ, 17 ఎస్ఎస్డీఈ, 27 ఎక్స్టాసీ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని చెప్పారు. నైజీరియాకు చెందిన టోనీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీపీ వెల్లడించారు. ఏజెంట్లను నియమించుకుని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్నవారి జాబితా సేకరిస్తున్నామన్నారు.
విశాఖ ఏజెన్సీ పాడేరులో మన్యం బంద్
* విశాఖ ఏజెన్సీ పాడేరులో మన్యం బంద్
* తెల్లవారు జాము నుండే పోలీసులు 40 మంది ఉద్యమ కారుల అరెస్టు
* పాడేరు, హుకుంపేట పోలీసుస్టేషన్ లకు అరెస్ట్ చేసిన వారి తరలింపు
* గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు అప్పలనర్సా, బాషా వాలింటర్ల సంఘ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎక్కడికక్కడే బంద్ను అడ్డుకుంటున్న పోలీసులు
ధిల్లీ: ఛాందినీ చౌక్లోని లజ్పత్ రాయ్ మార్కెట్లో అగ్ని ప్రమాదం... మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ధిల్లీ ఛాందీనీ చౌక్లోని లజ్పత్రాయ్ మార్గెట్లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమదాం జరిగింది. 12పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Delhi: Visuals from Lajpat Rai Market in Chandni Chowk where a fire broke out early morning today pic.twitter.com/faNkAbjpWc
— ANI (@ANI) January 6, 2022
Breaking News LIVE: సూరత్లో గ్యాస్పైప్ లీక్.. ఆరుగురు మృతి.. 20 మందికి గాయాలు
గుజరాత్లోని సూరత్లో గ్యాస్ లీకేజీ కారణంగా 6 మంది మృతి చెందారు, 20 మంది గాయపడ్డారు.
సూరత్లోని సచిన్ జిఐడిసి ప్రాంతంలోని ఒక కంపెనీలో తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ 20 మంది సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఓంకార్ చౌదరి తెలిపారు.
Gujarat: Six people died and 20 others were admitted to the civil hospital after gas leakage at a company in Sachin GIDC area of Surat early morning today, says hospital's In Charge Superintendent, Dr Omkar Chaudhary pic.twitter.com/HVnH9CZHYl
— ANI (@ANI) January 6, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets