అన్వేషించండి

Breaking News LIVE: కుటుంబం సజీవదహనం కేసులో ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ అరెస్ట్‌

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Breaking Live Updates for January 6 2022 Breaking News LIVE: కుటుంబం సజీవదహనం కేసులో ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ అరెస్ట్‌
Breaking_NEWS

Background

ఎట్టకేలకు సీఎం జగన్‌తో నేడు (జనవరి 6) భేటీకానున్నారు ఏపీ ఉద్యోగసంఘాల నేతలు. దాంతో గత కొంత కాలంగా కొనసాగుతున్న పీఆర్సీ హైడ్రామాకు తెరపడనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ పలుదఫాలు అధికారులతోనూ, మంత్రులతోనూ చర్చలు జరిపినా పీఆర్సీపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఉద్యోగసంఘాల అసహనంతో ఉన్నాయి. దీంతో ఇక సీయంతోనే తేల్చుకుంటాం అంటూ పలుమార్లు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు చివరకు తాము డిమాండ్ చేసిన క్షణానికి చేరువయ్యారు. ఈ రోజు చర్చల అనంతరం పీఆర్సీపై ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వెలువడుతుందనే ఆశలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. 

నిన్ననే సీఎం వద్దకు పీఆర్సీ చర్చల వివరాలు
ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ అయితే ఏకంగా రెండుసార్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జలతో మూడు సార్లు, ఆర్థిక మంత్రి బుగ్గనతో రెండుసార్లు, చీఫ్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అంటూ అందరితోనూ అనేక మార్లు చర్చలు జరిపాయి ఉద్యోగ  సంఘాలు. అయితే తాము డిమాండ్ చేసిన 48 శాతం పీఆర్సీపై ప్రభుత్వం నుండి రెడ్ సిగ్నల్ రావడం, ఏకంగా 14. 29 శాతం వద్దే ఫిక్స్ చేస్తామంటూ చెప్పడంతో ఉద్యోగ సంఘాలు షాక్ తిన్నాయి. ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి పొందుతున్న తమకు పీఆర్సీ 14. 29 శాతం అంటే ఇప్పుడువస్తున్న జీతంలో 13 శాతం వరకూ కోతపడుతుందనీ.. పీఆర్సీ వాళ్ళ జీతం పెరగడం మాట అటుంచి తగ్గడం ఏంటంటూ వారు ఖంగుతిన్నారు. అయితే ఈ భయాలన్నీ అర్థరహితం అనీ జీతాలు తగ్గకుండానే ఆ పీఆర్సీ అమలు చేస్తామంటూ సజ్జల లాంటి వాళ్ళు హామీ ఇచ్చినా ఉద్యోగ సంఘాలు నమ్మలేదు. దాంతో గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది 

కేవలం పీఆర్సీ ఒక్కటే సమస్య కాదు: ఉద్యోగ సంఘాలు
తమది కేవలం పీఆర్సీ ఒకటే సమస్య కాదనీ మొత్తం 71 డిమాండ్లు తమ వద్ద ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అలాగే మధ్యంతర భృతికి  చెందిన ఎరియర్స్ ఇంకా ఉద్యోగులకు అందలేదు. అలాగే పెండింగ్ డీఏలు కూడా. వీటన్నింటికి ఇప్పటికిప్పుడు రూ.1,600 కోట్లు కావాలి. ఉద్యోగుల డిమాండ్లలో ఇదీ ముఖ్యమే. అలాగే హెచ్ఆర్ఏకి సంబంధించిన సమస్యలూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ ఆసక్తికరంగా మారింది. 

మధ్యేమార్గంగా 30 శాతం దగ్గర పీఆర్సీ 

ఉద్యోగులు మొదట నుండీ డిమాండ్ చేస్తున్న 55 శాతం, తర్వాత కోరిన 48 శాతం పీఆర్సీ ఇచ్చే పరిస్థితి ఆర్థికంగా ఏపీ ప్రభుత్వానికి లేదు. అలానే ప్రభుత్వం చెబుతున్న 14.29 శాతం పీఆర్సీకి ఉద్యోగులు ఒప్పుకునే అవకాశమూ లేదు . వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు అందుకుంటున్న 27 శాతం మధ్యంతర భృతికి మరికొంత కలిపి 30 శాతానికి కాస్త అటుఇటుగా పీఆర్సీ ఇవ్వనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే ఈరోజు సమావేశం పూర్తయ్యేవరకూ ఆగాల్సిందే.

 

16:15 PM (IST)  •  06 Jan 2022

వనమా రాఘవను అరెస్ట్‌ చేసిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాసిన గంటలోపే వనమా రాఘవను అరెస్ట్‌ చేయడం గమనార్హం. కాగా రాఘవను కొత్తగూడెం తరలించి కేసు విషయంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.

14:23 PM (IST)  •  06 Jan 2022

రేపు కొత్తగూడెం బంద్‌.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు

రేపు కొత్తగూడెం బంద్‌కు రాజకీయ పార్టీలు, వామపక్ష, విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని.. వనమా రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బంద్‌ చేపడుతున్నట్లు వెల్లడించారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
Embed widget