అన్వేషించండి

Praja Sangrama Yatra: కేసీఆర్ పాలనలో పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితులున్నాయ్ - బండి సంజయ్

Praja Sangrama Yatra: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లాలోని లింబా గ్రామానికి చేరుకుంది. ముందుగా ఆయన అక్కడి బడికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.

Praja Sangrama Yatra: నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా గ్రామంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడ నెలకొన్న పలు సమస్యల గురించి పాఠశాల ఉపాధ్యాయులు బండి సంజయ్ కు వివరించారు. చిన్నారి విద్యార్థులను మీరేమీ అవుదాం అనుకుంటున్నారు అని అడగ్గా... ఒకరు కలెక్టర్, మరొకరు డాక్టర్ అవుతానని చెప్పారు. చిన్నారుల సమాధానం విన్న బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. ప్రైవేటు స్కూల్లకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో... కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 

శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్ లను కట్టడంలోనూ కేసీఆర్ సర్కార్ విఫలం అంయిందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక, పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 'సీపీఎస్' రద్దు కి సంబంధించి పాఠశాల ఉపాధ్యాయులు బండి సంజయ్ కి వినతి పత్రం అందించారు. లింబా (బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం లింబా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భైంసాలో బహిరంగ సభను విజయవంతం చేసుకున్నామని, ఆ సభకు ప్రజలు ఏ సంఖ్యలో తరలివచ్చారో మీరు కూడా చూశారన్నారు. కాలాలకతీతంగా సంవత్సర కాలంగా పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేదోళ్ల రాజ్యం కోసమే అని తెలిపారు. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు బయటికి వస్తారని అన్నారు. 

లింబా(బి) గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ముంపు గ్రామ ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వాళ్లకు కొద్దోగొప్పో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పట్టుకుంటే పడిపోయేటట్టు ఉన్నాయని ఆరోపించారు. సొంత జాగా ఉన్న వాళ్లకి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి... ఇప్పుడు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని మాట తప్పారని అన్నారు. కేసీఆర్ అంటే... ఖాసీం చంద్రశేఖర్ రజ్వి అని అన్ారు. తెలంగాణలో రజాకారుల పాలనను కేసీఆర్ చూపిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ... జైళ్ళలో పెట్టిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు పెట్టే టెన్షన్ కు... ప్రస్తుతం కేసీఆర్ ఫుల్ బాటిల్ ఎత్తుతుండుంటూ ఎద్దేవా చేశారు. 

ఈ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయా?

నీళ్లు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు, ఉద్యోగాలు లేవని అన్నారు. 79 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండడం ఏంటన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని అననారు. సీఎం కేసీఆర్ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడని, పుట్టబోయే బిడ్డ నెత్తిపై కూడా లక్ష రూపాయలు అప్పు పెట్టిండని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పెళ్లి చేసుకుందామన్న భయపడే పరిస్థితిలు ఉన్నాయన్నారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఏర్పడితేనే... మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓబీసీ ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అన్ని స్కామ్లలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే అని కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. 

పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న బండి సంజయ్ కు... ప్రజలు ఘన స్వాగతం పులుకున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓల గ్రామంలోకి బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించింది. రైతన్నలు తీసుకొచ్చిన ఎడ్ల బండిని ఎక్కి.. కాసేపు నడిపారు. అనంతరం పాదయాత్రగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణ వెదర్.. నేటి నుంచి ఉరుములతో వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు!
ఏపీ, తెలంగాణ వెదర్.. నేటి నుంచి ఉరుములతో వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget