అన్వేషించండి

B.Tech Fee Hike: తెలంగాణలో భారీగా పెరిగిన బీటెక్ ఫీజులు.. రెగ్యులర్ కోర్సులకు రెండింతలైన రుసుము

తెలంగాణలో ప్రభుత్వ బీటెక్‌ రుసుములు భారీగా పెరిగాయి. బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల రుసుములను పెంచుతున్నట్లు కనీసం ఎలాంటి ప్రకటనా లేకుండానే వర్సిటీలు ఫీజులను పెంచాయి.

తెలంగాణలో ప్రభుత్వ బీటెక్‌ రుసుములు భారీగా పెరిగాయి. బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియా యూనివర్సిటీలు షాక్ ఇచ్చాయి. రెగ్యులర్ కోర్సులతో పాటు సెల్ఫ్ పైనాన్స్ కోర్సుల ఫీజులను ఏకంగా రెండింతలు పెంచాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదవడం భారం కానుంది. కొత్తగా పెరిగిన ఫీజులు.. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ క్యాంపస్‌తో పాటు మంథని, జగిత్యాల, సుల్తానాపూర్‌, ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న సిరిసిల్ల కాలేజీల్లోనూ అమలు కానున్నాయి. ఉస్మానియా ఇంజనీరింగ్‌ కాలేజీకి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు మాత్రం ఫీజులను పెంచలేదు. ఎలాంటి అధికారిక ప్రకటనా లేకుండానే వర్సిటీలు ఫీజులు పెంచడం గమనార్హం. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా ఆయా కాలేజీల జాబితా, కోర్సులు, ఫీజులు వంటి పలు వివరాలను సాంకేతిక విద్యా శాఖ పొందుపరిచింది. దీంతో పెరిగిన ఫీజుల విషయం వెలుగులోకి వచ్చింది.

రెగ్యులర్ కోర్సులకు రెండింతలు..
బీటెక్‌ రెగ్యులర్‌ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు పెంచారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.35 వేల నుంచి రూ.70 వేల వరకు పెరిగింది. ఇక ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సుకు ఏకంగా రూ.1.20 లక్షలు రుసుంగా నిర్ణయించారు. వృత్తి విద్యా కోర్సులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 128 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని చోట్లా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పీజీ కోర్సులే ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరే వారికీ ఈసారి ఫీజుల భారం పడనుంది.

2019 నుంచి ఇప్పటికి ఇంతనా?
2019లో యూనివర్సిటీల్లోని రెగ్యులర్‌ బీటెక్‌ ఫీజును రూ.10 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. ఇక ఇప్పుడు ఈ ఫీజును ఏకంగా రూ.35 వేలకు పెంచారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులైతే ఏకంగా రూ.70 వేలకు పెరిగాయి. ఈ కోర్సుల్లో బోధించే కాంట్రాక్టు, తాత్కాలిక లెక్చరర్ల జీతాలను నిర్దేశించడంలో భాగంగా ఫీజులను పెంచుకోవచ్చని జూలై నెలలో విద్యా శాఖ అనుమతి ఇచ్చింది. కనీస ఫీజును రూ.45 వేలుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా వర్సిటీలు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విద్యా శాఖ బీటెక్‌ కనీస ఫీజు రూ.45 వేలు ఉండాలని చెప్పగా.. వాటిని జేఎన్‌టీయూహెచ్‌ ఏకంగా రూ.70 వేలకు పెంచింది.

చుక్కలు చూపెడుతున్న ఏఐ కోర్సు ఫీజు.. 
2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కింద ఏఐ, మైనింగ్ ఇంజనీరింగ్ అనే 2 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వీటిలో సీఎస్‌ఈ ఏఐ అండ్‌ ఎంఎల్‌ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లాంగ్వేజ్‌) కోర్సు ఫీజు ఏకంగా రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఇక మైనింగ్‌ ఇంజినీరింగ్‌ ఫీజు రూ.లక్షగా ఉంది. 

Also Read: NEET 2021: ఇవాళ నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్షకు వెళ్లేముందు ఈ గైడ్ లైన్స్ ఒక్కసారి చూసుకోండి..

Also Read: Engineering Pharma Seats: తెలంగాణలో అందుబాటులోకి 94 వేల ఇంజినీరింగ్ సీట్లు... ఉన్నత విద్యామండలి ప్రకటన... నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

టాప్ హెడ్ లైన్స్

22A Land Declaration: 222A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
22A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
CM Revanth Reddy: ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget