అన్వేషించండి

B.Tech Fee Hike: తెలంగాణలో భారీగా పెరిగిన బీటెక్ ఫీజులు.. రెగ్యులర్ కోర్సులకు రెండింతలైన రుసుము

తెలంగాణలో ప్రభుత్వ బీటెక్‌ రుసుములు భారీగా పెరిగాయి. బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల రుసుములను పెంచుతున్నట్లు కనీసం ఎలాంటి ప్రకటనా లేకుండానే వర్సిటీలు ఫీజులను పెంచాయి.

తెలంగాణలో ప్రభుత్వ బీటెక్‌ రుసుములు భారీగా పెరిగాయి. బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియా యూనివర్సిటీలు షాక్ ఇచ్చాయి. రెగ్యులర్ కోర్సులతో పాటు సెల్ఫ్ పైనాన్స్ కోర్సుల ఫీజులను ఏకంగా రెండింతలు పెంచాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదవడం భారం కానుంది. కొత్తగా పెరిగిన ఫీజులు.. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ క్యాంపస్‌తో పాటు మంథని, జగిత్యాల, సుల్తానాపూర్‌, ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న సిరిసిల్ల కాలేజీల్లోనూ అమలు కానున్నాయి. ఉస్మానియా ఇంజనీరింగ్‌ కాలేజీకి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు మాత్రం ఫీజులను పెంచలేదు. ఎలాంటి అధికారిక ప్రకటనా లేకుండానే వర్సిటీలు ఫీజులు పెంచడం గమనార్హం. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా ఆయా కాలేజీల జాబితా, కోర్సులు, ఫీజులు వంటి పలు వివరాలను సాంకేతిక విద్యా శాఖ పొందుపరిచింది. దీంతో పెరిగిన ఫీజుల విషయం వెలుగులోకి వచ్చింది.

రెగ్యులర్ కోర్సులకు రెండింతలు..
బీటెక్‌ రెగ్యులర్‌ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు పెంచారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.35 వేల నుంచి రూ.70 వేల వరకు పెరిగింది. ఇక ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సుకు ఏకంగా రూ.1.20 లక్షలు రుసుంగా నిర్ణయించారు. వృత్తి విద్యా కోర్సులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 128 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని చోట్లా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పీజీ కోర్సులే ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరే వారికీ ఈసారి ఫీజుల భారం పడనుంది.

2019 నుంచి ఇప్పటికి ఇంతనా?
2019లో యూనివర్సిటీల్లోని రెగ్యులర్‌ బీటెక్‌ ఫీజును రూ.10 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. ఇక ఇప్పుడు ఈ ఫీజును ఏకంగా రూ.35 వేలకు పెంచారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులైతే ఏకంగా రూ.70 వేలకు పెరిగాయి. ఈ కోర్సుల్లో బోధించే కాంట్రాక్టు, తాత్కాలిక లెక్చరర్ల జీతాలను నిర్దేశించడంలో భాగంగా ఫీజులను పెంచుకోవచ్చని జూలై నెలలో విద్యా శాఖ అనుమతి ఇచ్చింది. కనీస ఫీజును రూ.45 వేలుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా వర్సిటీలు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విద్యా శాఖ బీటెక్‌ కనీస ఫీజు రూ.45 వేలు ఉండాలని చెప్పగా.. వాటిని జేఎన్‌టీయూహెచ్‌ ఏకంగా రూ.70 వేలకు పెంచింది.

చుక్కలు చూపెడుతున్న ఏఐ కోర్సు ఫీజు.. 
2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కింద ఏఐ, మైనింగ్ ఇంజనీరింగ్ అనే 2 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వీటిలో సీఎస్‌ఈ ఏఐ అండ్‌ ఎంఎల్‌ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లాంగ్వేజ్‌) కోర్సు ఫీజు ఏకంగా రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఇక మైనింగ్‌ ఇంజినీరింగ్‌ ఫీజు రూ.లక్షగా ఉంది. 

Also Read: NEET 2021: ఇవాళ నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్షకు వెళ్లేముందు ఈ గైడ్ లైన్స్ ఒక్కసారి చూసుకోండి..

Also Read: Engineering Pharma Seats: తెలంగాణలో అందుబాటులోకి 94 వేల ఇంజినీరింగ్ సీట్లు... ఉన్నత విద్యామండలి ప్రకటన... నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget