అన్వేషించండి

Breaking News Live Updates: ఇది కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర: రేవంత్ రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News Live Updates: ఇది కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర: రేవంత్ రెడ్డి

Background

ఏపీ సచివాలయంలో గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చిస్తారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది.

22:24 PM (IST)  •  28 Oct 2021

ఇది కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర: రేవంత్ రెడ్డి

కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర  జరుగుతోందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, ఏపీ మంత్రి పేర్ని నాని “సమైక్య రాష్ట్ర” ప్రతిపాదన  తేవడం, కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర అని ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! అని రేవంత్ రెడ్డి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

20:59 PM (IST)  •  28 Oct 2021

ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ కాంత్..!

సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆరోగ్యమా, లేక ఇతర కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  

20:35 PM (IST)  •  28 Oct 2021

నవంబరు 4న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

 నవంబరు 4న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నవంబ‌రు 3న వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపింది. తిరుమల శ్రీ‌వారి ఆలయంలో నవంబరు 4న దీపావళి ఆస్థానం నిర్వహించ‌నున్నారు. ఈ సందర్భంగా నవంబరు 4న వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలను టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ కారణంగా నవంబరు 3న‌ వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపింది. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో విడుదల చేసింది. 

19:19 PM (IST)  •  28 Oct 2021

కడప స్టీల్ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు జారీచేసింది. అనుమతులు రావడంతో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3591 ఎకరాల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. దీని కోసం రూ. 16,986 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుందని అంచనా. 

18:04 PM (IST)  •  28 Oct 2021

గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్ 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దంపతులు గురువారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్‌ 1న జరిగే వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం జగన్‌ గవర్నర్‌ను కోరారు. 

16:46 PM (IST)  •  28 Oct 2021

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్

ముంబయి డ్రగ్స్ కేసులో అరెస్టైన్ ఆర్యన్ ఖాన్ బెయిల్ మంజారు అయింది. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అరెస్టైన 21 రోజుల తర్వాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది. 

16:15 PM (IST)  •  28 Oct 2021

టీడీపీ గుర్తుంపు రద్దు చేయాలని సీఈసీకి వైసీపీ ఫిర్యాదు

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం గురువారం సీఈసీని కలిశారు. 

14:54 PM (IST)  •  28 Oct 2021

ముగిసిన ఏపీ కేబినేట్ భేటీ... పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్టసవరణ, 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు, కొత్తగా జైన్‌ కార్పొరేషన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

14:52 PM (IST)  •  28 Oct 2021

ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ మిస్ తెలంగాణ

హైదరాబాద్‌లో మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఇంట్లోనే ఉరి వేసుకుంటూ ఆమె సామాజిక మాధ్యమాల్లో లైవ్ వీడియో స్ట్రీమ్ చేశారు. దీన్ని గమనించిన యువతి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. తక్షణం యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు.

13:58 PM (IST)  •  28 Oct 2021

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డాక్టర్లు సరిగ్గా పట్టించుకోలేదని, దీంతో నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సీజేరియన్ చేస్తుండగా.. భాగ్యలక్ష్మి అనే మహిళ కోమాలోకి వెళ్లింది. వైద్యులు కుటుంబ సభ్యులకు తల్లి, బిడ్డ పరిస్థితి సీరియస్‎గా ఉందని చెప్పడంతో వెంటనే మహిళను భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి హైదరాబాద్‎లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తల్లి, బిడ్డ పరిస్థితి విషమించింది. పది రోజులుగా కోమాలో ఉండగా.. గురువారం తల్లి, బిడ్డ చనిపోయారు. దీంతో మహిళ బంధువులు కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ భాగ్యలక్ష్మి శవంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget