అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి

Background

నైరుతి రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర ఒడిశాకు అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు సౌరాష్ట్ర తీరంలోని ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడన కేంద్రం, దీసా, రైసెన్, అంబికాపూర్, ఉత్తర ఒడిశా దాని పొరుగున అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయి. వరద నీటితో గోదావరి ప్రాంతాలు చాలా వరకు నీట మునిగాయి. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి  వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాంతాలకు ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు.

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.  నేడు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

17:27 PM (IST)  •  18 Jul 2022

కామారెడ్డిలో ఘోర ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి

Kamareddy Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మద్నూర్ మండలం మెనూర్ గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ఆటో ను లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో అక్కడికక్కడే  ఆరుగురు మృతి చెందారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. లారీ కింద నుంచి ఆటోను తీసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  రోడ్డుపై నుంచి ఆటోను లారీ ఈడ్చుకుంటూ రోడ్డు పక్కకు వచ్చింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది. 

14:28 PM (IST)  •  18 Jul 2022

Guntur Ganja Smuggling: లగ్జరీ కారులో గంజాయి రవాణా

గుంటూరు జిల్లా పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణాను పట్టుకున్నారు. సుమారు ఐదు కిలోల గంజాయి దొరికిందని సమాచారం. ఇందులో బడా బాబుల పిల్లలు ఉన్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లగ్జరీ‌ స్పోర్ట్స్ కారులో ఓ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన పిల్లలు గంజాయి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

12:41 PM (IST)  •  18 Jul 2022

ABVP Bundh: రేపు ఏపీలోని అన్ని పాఠశాలలు బంద్: ఏబీవీపీ

ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బందుకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి మాట్లాడారు. డీఎస్సీ నిర్వహించి 24 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

11:26 AM (IST)  •  18 Jul 2022

MP Revanth Reddy: ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం

ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద పరిస్థితిపై చర్చించాలని కోరారు. రాష్ట్రంలోని విపరీత వరద పరిస్థితుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తీవ్రంగా నష్టపోతున్నారు.

11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ పరిస్థితి జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.2 వేల కోట్ల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి. విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి.’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

11:19 AM (IST)  •  18 Jul 2022

CI Nageswara Rao: సీఐ నాగేశ్వర్ రావును ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

హైదరాబాద్:  సీఐ నాగేశ్వర్ రావును ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన హయత్ నగర్ కోర్టు..
ఈ రోజు నుండి 22 వ తేదీ వరకు నాగేశ్వర్ రావును విచారించనున్న వనస్థలిపురం పోలీస్ లు..
అత్యాచారం జరిగిన ఘటనా స్థలంతో పాటు ఇబ్రహీంపట్నం  కార్ , ప్రమాదం స్థలంలో సీన్ రికన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు..

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget