అన్వేషించండి

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 

Tirumala Stampede News: తిరుమల తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని టీటీడీ బోర్డు మెంబర్‌ ఎంఎస్‌రాజు అనుమాన పడ్డారు. జరిగిన పరిణామాలు చూస్తే వైసీపీ ఇందులో ఉందని డౌట్‌ వ్యక్తం చేశారు.

Tirumala News: తిరుపతిలో జరిగిన దురదృష్ట ఘటన ఎంతో బాధాకరమని మడకశిర ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందని వెల్లడించాడు. "ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామి భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా దేవుడిని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. ఈ కార్యక్రమం కోసం తిరుపతి వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేసింది. 90 కౌంటర్లలో టోకెన్లను భక్తులకు అందించేందుకు సిద్ధమైంది. ఈ టోకన్లు తీసుకునే సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించటం బాధాకరం. " అని అన్నారు. 

తిరుమల తొక్కిసలాట ఘటనలో వైసీపీ పాత్ర: ఎంఎస్ రాజు 

ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనను కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వైసీపీని ఉద్దేశించి టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న టైంలో కొందరు అస్వస్థకు గురియ్యారని  తెలిపారు. అక్కడ ఉన్న సిబ్బంది వారిని బయటకి తీసుకొచ్చేటప్పుడు తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ టైంలో వెనుకున్న వాళ్లు అరుపులు కేకలతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని చెప్పుకొచ్చారు. ఇది కావాలనే కుట్రపూరితంగా ఎవరైనా చేశారా అన్న కోణంలో విచారణ జరుపుతామని చెప్పారు. 
తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందన్న ఎంఎస్ రాజు చేసిన ఆరోపణలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వీడియోలు ఫోటోలు ముందుగా వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రత్యక్షం అయ్యాయని ఆయన అన్నారు. దీని బట్టి చూస్తుంటే శవ రాజకీయాలు చేసే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వారి పార్టీ నేతలు కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు రాజు. 

Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు - అధికారులపై తీవ్ర ఆగ్రహం

ప్రభుత్వ యంత్రాంగమంతా తిరుమలలోనే: ఎంఎస్‌రాజు

జరిగిన ఘటన ఎంతో బాధాకరమన్న రాజు... ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అధికార యంత్రాంగం తిరుపతిలో పని చేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే పనిలో ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీ మాత్రం విష ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేయడానికి కంకణం కట్టుకుందని మండిపడ్డారు. వీలైతే చనిపోయిన వ్యక్తులకు పార్టీ తరపున సహాయం చేయండి లేకుంటే సైలెంట్‌గా ఉండండి అంటూ వైసిపి నేతలకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చురకలంటించారు. భక్తులు ఎవరూ కూడా వైసీపీ చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దని రాజు సూచించారు. యథావిధిగా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు అని చెప్పారు. టిటిడి అన్ని భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేసిందని వివరించారు. 

Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అసలు తప్పెవరిది? - సీఎం చంద్రబాబుకు నివేదిక, ఏ సమయంలో ఏం జరిగిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget