Breaking News Live: పేపర్ బ్యాలెట్ ద్వారా ‘మా’ ఎన్నికలు నిర్వహించాలి.. మంచు విష్ణు డిమాండ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
జీఆర్ఎంబీ ఛైర్మన్కు తెలంగాణ లేఖ
గోదావరి బోర్డు ఛైర్మన్కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రజత్ కుమార్ లేఖరాశారు. చనాఖా- కొరటా డీపీఆర్ ఏపీకి ఇవ్వాల్సిన అవసరంలేదని తెలిపారు. చౌటుపల్లి హన్మంత్రెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి నీటిని బోర్డు కేటాయింపుల మేరకే వాడుకుంటున్నామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. రెండు ప్రాజెక్టులపై ఏపీ అభిప్రాయాలు అక్కర్లేదని రజత్ కుమార్ తెలిపారు.
పేపర్ బ్యాలెట్ ద్వారా ‘మా’ ఎన్నికలు నిర్వహించాలి.. మంచు విష్ణు డిమాండ్
ఏ ప్యానల్ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని సినీ నటుడు, మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు.. మా ప్యానల్లో చాలా మంది పేపర్ బ్యాలెట్ కావాలని అడిగారు. పేపర్ బ్యాలెట్ అయితే ఎన్నిసార్లు చెక్ చేసినా ఫలితం అలాగే వస్తుంది. ఈవీఎం వాడితే ట్యాంపరింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ఆరోపించే అవకాశం ఉంది. అందు కోసమే పేపర్ బ్యాలెట్కు వెళ్లామన్నారు. గత ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ వాడారని స్పష్టం చేశారరు. 60 ఏళ్లు పైబడిన వారికి పేపర్ బ్యాలెట్ ఇస్తారు. ఇప్పుడు మా సభ్యులలో 180 నుంచి 190 వరకు 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు





















