అన్వేషించండి

Adilabad: రిమ్స్ మెడికల్ కాలేజీ ఘటనలో డాక్టర్‌పై వేటు! కొనసాగుతున్న వైద్య విద్యార్థుల ఆందోళన

Adilabad RIMS: రిమ్స్ మెడికల్ కాలేజ్ ను సందర్శించి కలెక్టర్ విచారణ ప్రారంభించారు. ఈ మేరకు రిమ్స్ సిబ్బందితో పాటు బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలను సేకరించారు.

Adilabad RIMS News: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థుల దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి గురువారం రిమ్స్ మెడికల్ కాలేజ్ ను సందర్శించి విచారణను ప్రారంభించారు. ఈ మేరకు రిమ్స్ సిబ్బందితో పాటు బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిటీ నివేదికను కలెక్టర్ కు అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ అన్నారు. దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతిని టర్మినేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. రిమ్స్ లో సెక్యూరిటీని పెంచుతామన్నారు. 

మెడికల్ విద్యార్థులపై దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతి కుమార్ ఎ1గా పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బయట వ్యక్తులు దాడి చేస్తున్న క్రమంలో తమను తాము రక్షించుకునే సమయంలో దాడికి దిగిన వ్యక్తిపై మెడికో విద్యార్థులు కూడా ప్రతి దాడులు చేయడంతో ప్రస్తుతం శివకుమార్ అనే వ్యక్తి చేతి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయనపై కూడా ఏ2 గా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరితోపాటు రిమ్స్ డైరెక్టర్ మరియు, దాడిలో పాల్గొన్న బయట వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రిమ్స్ వైద్య కళాశాలలోకి బయట వ్యక్తులు వైద్య విద్యార్థులపై దాడులకు పాల్పడడంతో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల అవరణలో మధ్యాహ్నం మూడు గంటల నుండి కూర్చొని నిరసన చేపట్టారు. బయట వ్యక్తులు రిమ్స్ కళాశాలలోకి చొరబడుతున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, రిమ్స్ డైరెక్టర్ ను మార్చాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నిరసన సాయంత్రం 5:00 గంటల వరకు చేపట్టడంతో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులతో మాట్లాడారు. 

వైద్య విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునవృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వైద్య కళాశాల ఆవరణలో సెక్యూరిటీని పెంచుతామని డైరెక్టర్ చెప్పడంతో విద్యార్థులు మాత్రం తమ నిరసనను ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నారు. అసలు ఈ వైద్య కళాశాలలో డైరెక్టర్ ను మార్చితేనే అన్ని బాగుంటాయని అందరికీ సరైన న్యాయం జరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. రిమ్స్ డైరెక్టర్ మాకొద్దు డైరెక్టర్ ను మార్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని, రేపటి నుండి వీధులకు హాజరుకామని రేపటినుండి యధావిధిగా ఈ నిరసనను కొనసాగిస్తామన్నారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RCB VS DC Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా?  కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Crime News: ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య, వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికేశారు!
ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య, వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికేశారు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs LSG Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 54పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం | ABP DesamDC vs RCB Match Preview IPL 2025 | ఈరోజు డీసీ, ఆర్సీబీ జట్ల మధ్య హోరా హోరీ పోరు | ABP DesamMI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RCB VS DC Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా?  కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Crime News: ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య, వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికేశారు!
ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య, వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికేశారు!
IPL 2025 MI VS LSG Resutl Update: ముంబై సిక్స‌ర్,  MI వ‌రుస‌గా ఐదో విక్ట‌రీ.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, బుమ్రా, ల‌క్నో ఘోర ప‌రాజ‌యం
ముంబై సిక్స‌ర్, MI వ‌రుస‌గా ఐదో విక్ట‌రీ.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, బుమ్రా, ల‌క్నో ఘోర ప‌రాజ‌యం
Mahesh Babu: ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
Pahalgam Terror Attack: వారికి జైలుశిక్ష, జరిమానా - పాక్ జాతీయులకు భారత్ మరో బిగ్ షాక్
వారికి జైలుశిక్ష, జరిమానా - పాక్ జాతీయులకు భారత్ మరో బిగ్ షాక్
KCR Speech At BRS Meeting: ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
Embed widget