అన్వేషించండి

Formula E race case: ఐఏఎస్ అర్వింద్ కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు - అరెస్టుల దిశగా చర్యలు ?

Formula E Race: ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.ఇది నాలుగో సారి కావడంతో అరెస్టులపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

ACB issues notice to IAS Arvind Kumar: తెలంగాణ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్ములా ఈ  రేసు కేసులో.. విదేశీ సంస్థకు అరవింద్ కుమారే నిధులు బదిలీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు బదిలీ చేయడంతో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు తాను డబ్బులు బదిలీ చేశానని చెబుతున్నారు. 

2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు, 2024లో రెండో ఎడిషన్‌కు సంబంధించి ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. ఈ రేసు నిర్వహణలో రూ.55 కోట్ల నిధులు లండన్‌కు చెందిన ఒక కంపెనీకి మళ్లించారని..   దీనికి సంబంధిత  అధికారుల ఆమోదం లేకుండా జరిగిందని  కేసులు నమోదయ్యాయి.  ఈ అక్రమాల వల్ల హెచ్ఎండీఏకు అదనంగా మరో రూ.8.06 కోట్ల అదనపు పన్ను భారం పడిందని ప్రభుత్వం గుర్తించింది.  మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం. దానా కిషోర్ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ డిసెంబర్ 18, 2024న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో కేటీఆర్‌ను ప్రధాన ఆరోపితుడిగా (A1), అరవింద్ కుమార్‌ను A2గా, బీఎల్ఎన్ రెడ్డిని A3గా పేర్కొన్నారు.                    

అరవింద్ కుమార్ 2023లో MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్నారు. ఆయన కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులను బదిలీ చేశానని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. జూన్ 25, 2025న అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది, జూలై 1, 2025న విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే, అరవింద్ కుమార్ జూన్ 30 వరకు సెలవులో ఉన్నారు. కుమార్తె గ్రాడ్యూయేషన్ కోసం యూరప్ వెళ్లారు. ఆయన తిరిగి రావడంతో నోటీసులు జారీ చేశారు. ఇంతకు ముందు జనవరి 8, 2025న అరవింద్ కుమార్ హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ సుమారు 5 గంటల పాటు జరిగింది, నిధుల బదిలీకి సంబంధించి విస్తృతంగా ప్రశ్నించారు. గ్రీన్‌కో స్పాన్సర్‌షిప్ నుండి ఎందుకు వైదొలిగారనే అంశంపై కూడా ప్రశ్నలు అడిగారు.                                        

జనవరి 7, 2025న అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. - ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ కేసులో జోక్యం చేసుకుంది. విచారణ జరుపుతోంది.  అరవింద్ కుమార్ తన వాదనలో, తాను కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులను బదిలీ చేశానని, అందులో తన వ్యక్తిగత ప్రమేయం లేదని పేర్కొంటున్నారు. - అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా తదుపరి విచారణలు జరగనున్నాయి. అరవింద్ కుమార్ విచారణ తర్వాత కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget