అన్వేషించండి

Minister Ponguleti : తెలంగాణలో కుండపోత వర్షాలు.. తొమ్మిది మంది మృ‌తి

Telangana Rains : తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్ద అవుతోంది. రాష్ట్రంలో తొమ్మిది మంది మరణించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Minister Ponguleti : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు జాతీయ రహదారులు జలమయం కాగా, కొన్ని చోట్ల వరదలు రావడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దులోని రామాపురం, చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి భారీగా వరద ప్రవాహం కిందికి ప్రవహించడంతో..  జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు నల్ల బండగూడెం వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద తగ్గిన తర్వాతే వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి భారీగా వర్షం నీరు ప్రవహించడంతో పదుల సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి.

దంచికొడుతున్న వాన 
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్ద అవుతోంది. ఈనేపథ్యంలో తాజాగా వాతావరణశాఖ వెదర్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, గద్వాల, ఖమ్మం, అసిఫాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కమ్మేసింది.

తొమ్మిది మంది మృతి
 తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలో తొమ్మిది మంది మరణించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మున్నేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు అపార్ట్‌మెంట్లలోని సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు..
 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద పాలేరు వాగులో దంపతులు గల్లంతయ్యారు. మున్నేరు వరద బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నంలో నేవీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లను ఖమ్మం నగరానికి పంపాలని కోరారు. కోదాడలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లలో చిక్కుకున్న వారిని బోట్లల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం తాళ్ళపూసపల్లి శివారులో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
Also Read: Khammam Rains: ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న ప్రకాష్ నగర్ వాసులు, ఏపీ నుంచి రంగంలోకి దిగిన 2 హెలికాప్టర్లు

సీఎం సమీక్ష
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అధికారులు సెలవు రద్దు చేసుకుని... వరద సహాయక చర్యల్లో నిమగ్నమవ్వాలన్నారు.
 

Also Read: Telangana News: తెలంగాణలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, భారీ వర్షాల్లో రెస్క్యూ ఆపరేషన్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Kavitha new party: శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
Petrol mess: పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Embed widget