అన్వేషించండి

YouTube Channels Blocked: పాకిస్తాన్‌కు భారీ షాక్.. 20 యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్స్ బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఇదివరకే భారతీయుల డేటాను చోరీ చేస్తున్నట్లు భావించిన పలు వెబ్ సైట్లు, విదేశీ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తాజాగా 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

YouTube Channels Blocked: కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టెక్నాలజీ అంశాలపై సైతం ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో ఇదివరకే భారతీయుల డేటాను చోరీ చేస్తున్నట్లు భావించిన పలు వెబ్ సైట్లు, విదేశీ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం జరగడం, ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. అదే విధంగా కొన్ని వెబ్ సైట్స్‌ను సైతం బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సోమవారం నిర్ణయం తీసుకుంది. దీనిపై మంగళవారం నాడు ఆ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధికార ప్రకటన విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్స్‌ను బ్లాక్ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ మంత్రిత్వ శాఖ స్పందించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్టియన్ స్కూళ్లను ఆరెస్సెస్ నాశనం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అనుమతి ఇచ్చారని, 200 మంది భారత ఆర్మీ సిబ్బంది శ్రీనగర్‌లో ఇస్లాం మతంలోకి మారారంటూ పలు విషయాలపై దుష్ప్రచారం జరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

పాకిస్తాన్ నుంచి సమాచారం అందుకుని యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మన దేశానికి సంబంధించి సున్నితమైన అంశాలను సైతం పాక్ వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లలో యథేచ్చగా ప్రసారం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు స్పష్టం చేసింది. కాశ్మీర్, భారత ఆర్మీ, దేశంలోని మైనారిటీ వర్గాలు, అయోధ్య రామ మందిరం, చనిపోయిన సీడీఎస్ బిపిన్ రావత్ లాంటి విషయాలపై తమకు ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని గుర్తించారు. వీటి వల్ల దేశంలో భయాలు, ఆందోళనకు దారి తీసే అవకాశం ఉందని.. భారత చట్టాలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఫేక్ న్యూస్ యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేశారు.

సరిహద్దుకు సంబంధించిన అంశాలపై సైతం దుష్ప్రచారం జరుగుతోంది. నయా పాకిస్తాన్ గ్రూప్ (NPG) వర్గం భారత్‌పై విషం చిమ్మేందుకు ఈ పనులు చేయిస్తుందని గుర్తించారు. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ, ఇంటెలిజెన్స్ వర్గాలు దేశ సమగ్రతను కాపాడేందుకు, అశాంతి నెలకొనకుండా చూడటం, దేశ చట్టాల ఉల్లంఘన లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పాక్ యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లపై వేటు వేశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2021 లోని రూల్ 16 కింద కేంద్రం తక్షణమే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. 

భారత్ బ్లాక్ చేసిన 20 యూట్యూబ్ ఛానెళ్లలో.. ద పంచ్ లైన్, ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్, ఖల్సా టీవీ, ద నేక్డ్ ట్రూత్, 48 న్యూస్, ఫిక్షనల్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, పంజాబ్ వైరల్, నయా పాకిస్తాన్ గ్లోబల్, కవర్ స్టోరీ, గో గ్లోబల్ ఈకామర్స్, జునైద్ హలీమ్ అఫీషియల్, తయ్యబ్ హనీఫ్, జైన్ అలీ అఫీషియల్, మోహ్‌సిన్ రాజ్‌పుత్ అఫీషియల్, కనీజ్ ఫాతిమా, సదాఫ్ దురానీ, మై ఇమ్రాన్ అహ్మద్, నజమ్ ఉల్ హసన్ బజ్వా ఉన్నాయి. 
Also Read: YouTube New Feature: వార్నీ.. ఈ ఫీచర్ భలే ఉందిగా.. మీరు కూడా జరిపేయండి..

Also Read: YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget