అన్వేషించండి

గత మూడేళ్లలో భారత కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ నుంచి ఎన్ని వేలకోట్లు కొల్లగొట్టారో తెలుసా!

YouTube Content Creators: గత సంవత్సరం 100 మిలియన్లకు పైగా భారతీయ ఛానెళ్ళు యూట్యూబ్ లో కంటెంట్ అప్లోడ్ చేశాయి. 15,000 కంటే ఎక్కువ ఛానెళ్ళకు 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.

YouTube CEO Neal Mohan: భారత్‌లో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు మామూలుగా కాదు. పెద్ద మొత్తంలోనే సంపాదిస్తున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (Youtube) భారతీయ ‘కంటెంట్’ క్రియేటర్స్, ఆర్టిస్టులు, మీడియా సంస్థల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కంటెంట్ క్రియేటర్లపై ఏకంగారూ.850 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యూట్యూబ్ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ (YouTube CEO Neal Mohan) గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత 3 సంవత్సరాలలో యూట్యూబ్ భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లకు, ఆర్టిస్టులు, మీడియా సంస్థలకు దాదాపు రూ.21,000 కోట్లకు పైగా చెల్లించినట్లు ఆయన తెలిపారు.

భారత్‌లో ₹850 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న యూట్యూబ్

గత ఏడాది భారతదేశంలో క్రియేట్ చేసిన వీడియో కంటెంట్‌ను విదేశాలలో ఉన్న యూజర్లు ఏకంగా ఆ వీడియోలను 45 బిలియన్ గంటల పాటు చూశారు. ఇక్కడ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా నీల్ మోహన్ మాట్లాడారు. ‘వచ్చే 2 సంవత్సరాలలో భారత్ కు చెందిన యూట్యూబ్ క్రియేటర్లు,  కళాకారులు, మీడియా సంస్థల అభివృద్ధిలో భాగంగా ఏకంగా ₹850 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

10 కోట్లకు పైగా కంటెంట్ అప్‌లోడ్

భారత్‌కు చెందిన ‘కంటెంట్ క్రియేటర్లు’ దేశ ప్రత్యేకతను తమ క్రియేషన్ ద్వారా చూపిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారితో అయినా మన చరిత్ర, సంస్కృతిని, టాలెంట్ షేర్ చేసుకునే ప్లాట్‌ఫాం యూబ్యూబ్ కల్పిస్తోందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టిగల నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు ఒక సాధనంగా డిజిటల్ ఫ్లాట్‌ఫాం మారింది. డిజిటల్ ఇండియాతో భారత్ ను మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు.

‘ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్‌లో 2.5 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోని ఏ నేతకు లేని స్థాయిలో యూట్యూబ్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారని నీల్ మోహన్ అన్నారు. ఆయన భారతదేశాన్ని క్రియేటివ్ పరంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ఏడాది దేశంలోని 10 కోట్లకు పైగా చానెళ్ళు యూట్యూబ్‌లో ‘కంటెంట్ అప్‌లోడ్’ చేశాయని, అందులో 15,000 కంటే ఎక్కువ చానళ్లకు 10 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

విజయవంతమైన వ్యాపారాలకు హెల్ప్ అయింది- నీల్ మోహన్ 

కొన్ని నెలల కింద ఉన్న 11,000 చానెళ్ళ కంటే ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్లు తమ టాలెంట్ ప్రదర్శిస్తూ మరింత ఎదగాలని, అందుకు యూట్యూబ్ వేదిక కావాలని నీల్ మోహన్ ఆకాంక్షించారు. విజయవంతంగా ఎన్నో వ్యాపారాలను నిర్వహించడంలో సహాయపడుతోందని అన్నారు.

గత 3 సంవత్సరాలలో భారత్‌లోని కంటెంట్ క్రియేటర్లు, నటీనటులు, మీడియా సంస్థలకు ₹21,000 కోట్లకు పైగా చెల్లించామని.. ఇది పెద్ద మార్కెట్ అన్నారు. ఏ ప్రదేశంలోని కంటెంట్ క్రియేటర్ అయినా ప్రపంచవ్యాప్తంగా తమకు ఫాలోయర్లు సంపాదించుకుంటారు. యూట్యూబ్‌ను ఒక శక్తివంతమైన ఇంజిన్‌గా మార్చడంతో కొన్ని దేశాలు మాత్రమే భారతదేశంలాగ ఫలితాలు పొందుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా చేయనున్న ఇన్వెస్టి‌మెంట్ ద్వారా దేశంలో కంటెంట్ క్రియేటర్లు మరింత మార్కెట్ చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
Podharillu Serial Today April 7th:మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?
Smartwatch Buying Tips : స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
Simsa Mata Temple: జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Embed widget