అన్వేషించండి

Keypad Phone Vs Smartphone: కీప్యాడ్ ఫోన్లవైపు మళ్లుతున్న ప్రజలు - స్మార్ట్ ఫోన్లపై పెరుగుతున్న విసుగు!

Keypad Phones Sales: ప్రజలు ఇప్పుడు మళ్లీ స్మార్ట్ ఫోన్ల బదులు కీప్యాడ్ ఫోన్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Keypad Phones: స్మార్ట్‌ఫోన్‌లు రాకముందు కీప్యాడ్ ఫోన్‌లు మాత్రమే ప్రజలకు ఆప్షన్లుగా ఉండేవి. ఇవి కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి బేసిక్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది ఆ సమయంలో ప్రజలకు చాలా సౌకర్యంగా ఉండేది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్లు వచ్చి కీప్యాడ్ ఫోన్‌లు ప్రజల చేతుల్లో కనిపించడం మానేశాయి. ముఖ్యంగా యువత కీప్యాడ్ ఫీచర్ ఫోన్‌లను కొనడం మానేసింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కాలం మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫీచర్ ఫోన్లకు మళ్లీ డిమాండ్ పెరగడం ప్రారంభం అయింది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఆ కారణాలను తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌లతో విసిగిపోతున్న ప్రజలు
స్మార్ట్‌ఫోన్‌లతో ప్రజలు విసిగిపోయారు. సోషల్ మీడియా, ఇతర నోటిఫికేషన్‌ల కారణంగా ప్రజలు రోజంతా తమ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్లను కాల్స్‌కు తక్కువగానూ, సోషల్ మీడియా కోసం ఎక్కువగానూ వినియోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో నోటిఫికేషన్ల కారణంగా ప్రజలు రోజంతా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడిని నివారించడానికి ప్రజలు మళ్లీ ఫీచర్ ఫోన్‌ల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. 

ఫీచర్ ఫోన్‌లలో ప్రైవసీ ఫుల్
స్మార్ట్‌ఫోన్‌లలో ప్రైవసీ గురించి ఆందోళన, పెరుగుతున్న సైబర్ నేరాల కేసులు ప్రజల సమస్యలను పెంచాయి. స్మార్ట్‌ఫోన్ల ద్వారా స్పైయింగ్ చేస్తారనే భయం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఫీచర్ ఫోన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి ఎక్కువ డేటాను నిల్వ చేసుకోవు. కాబట్టి అది లీక్ అయ్యే ప్రమాదం కూడా తక్కువ. స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఫీచర్ ఫోన్‌లలో ప్రైవస గురించి తక్కువ ఆందోళన ఉంది.

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

తక్కువ ధర
ఈ రోజుల్లో మంచి స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఫీచర్ ఫోన్ ధర రూ. 1,000-2,000 మధ్యలోనే ఉంది. అటువంటి పరిస్థితిలో ఎవరికైనా కాల్ చేయడానికి మాత్రమే ఫోన్ అవసరమైతే అతను స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫీచర్ ఫోన్ కొనడానికి ఇష్టపడతాడు.

లాంగ్ బ్యాటరీ లైఫ్
ఫీచర్ ఫోన్ బ్యాటరీ చాలా కాలం పాటు ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలు తమ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జింగ్ చేయడంలో విసిగిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఫీచర్ ఫోన్ బ్యాటరీ ఉపశమనం ఇస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 3-4 రోజుల వరకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది కాకుండా ఫీచర్ ఫోన్‌లు మరింత నమ్మదగినవి. వైరస్ ఇందులోకి ప్రవేశిస్తుందనే భయం కూడా లేదు.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Alert :  హైదరాబాద్ వాసులకు అలర్ట్ - పిడుగులతో కూడిన వర్షాలు - బయటకు రావొద్దని సలహాలు
హైదరాబాద్ వాసులకు అలర్ట్ - పిడుగులతో కూడిన వర్షాలు - బయటకు రావొద్దని సలహాలు
Komatireddy Venkat Reddy: లోకేష్ పిల్లవాడు - బనకచర్లను అడ్డుకుని తీరుతాం - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
లోకేష్ పిల్లవాడు - బనకచర్లను అడ్డుకుని తీరుతాం - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
APSRTC Recruitment: ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్.. పది పాసైన వారికి అవకాశం
ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్.. పది పాసైన వారికి అవకాశం
NTR: 'కాంతార' పార్ట్ 3లో ఎన్టీఆర్? - ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా
'కాంతార' పార్ట్ 3లో ఎన్టీఆర్? - ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా
Advertisement

వీడియోలు

Joe Root Compliments Siraj | సిరాజ్, పంత్ లపై జో రూట్ ప్రశంసలు | ABP Desam
Eng vs Ind Test Series Fifth Day | విజయమో..పరాజయమో...సిరీస్ అంతా పోరాడిన భారత్ | ABP Desam
Joe Root Century Tribute to Graham Thorpe | సెంచరీతో గ్రాహమ్ థోర్ప్ కి ట్రిబ్యూట్ | ABP Desam
Eng vs Ind 5thTest 4th Day Highlights | అత్యంత ఆసక్తికరంగా మారిపోయిన ఓవల్ టెస్టు | ABP Desam
India vs England 5th Test Match | భారత్ సిరీస్ ను సమం చేయగలదా ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Alert :  హైదరాబాద్ వాసులకు అలర్ట్ - పిడుగులతో కూడిన వర్షాలు - బయటకు రావొద్దని సలహాలు
హైదరాబాద్ వాసులకు అలర్ట్ - పిడుగులతో కూడిన వర్షాలు - బయటకు రావొద్దని సలహాలు
Komatireddy Venkat Reddy: లోకేష్ పిల్లవాడు - బనకచర్లను అడ్డుకుని తీరుతాం - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
లోకేష్ పిల్లవాడు - బనకచర్లను అడ్డుకుని తీరుతాం - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
APSRTC Recruitment: ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్.. పది పాసైన వారికి అవకాశం
ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్.. పది పాసైన వారికి అవకాశం
NTR: 'కాంతార' పార్ట్ 3లో ఎన్టీఆర్? - ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా
'కాంతార' పార్ట్ 3లో ఎన్టీఆర్? - ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా
రూ.30 వేల జీతం ఉన్నా Maruti Wagon R కారును కొనవచ్చు, ఈఎంఐ ఎంత కట్టాలంటే
రూ.30 వేల జీతం ఉన్నా Maruti Wagon R కారును కొనవచ్చు, ఈఎంఐ ఎంత కట్టాలంటే
Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2025.. 11,999లకే ల్యాప్​టాప్, బెస్ట్ డీల్స్ ఇవే
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2025.. 11,999లకే ల్యాప్​టాప్, బెస్ట్ డీల్స్ ఇవే
Congress Politics: జనహిత పాదయాత్రతో కాంగ్రెస్ నేతల్లో జోష్, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న మీనాక్షి నటరాజన్
జనహిత పాదయాత్రతో కాంగ్రెస్ నేతల్లో జోష్, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న మీనాక్షి నటరాజన్
Vizag to Tirupati Trains: విశాఖ నుండి తిరుపతి, చర్లపల్లి కి  స్పెషల్ ట్రైన్స్.. డేట్స్ ఎప్పుడంటే
విశాఖ నుండి తిరుపతి, చర్లపల్లి కి స్పెషల్ ట్రైన్స్.. డేట్స్ ఎప్పుడంటే
Embed widget