అన్వేషించండి

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి

Mobile Recharge Plan Hike:త్వరలో Jio, Airtel తమ మొబైల్ టారిఫ్‌లను 12 నుంచి 15 శాతం వరకు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మీడియా నివేదిక ప్రకారం, మొబైల్ రీచార్జ్ ధరలు పెరగొచ్చు.
  • వచ్చే 3-4 నెలల్లో 12-15 శాతం పెంపు అంచనా వేస్తున్నారు.
  • నెట్‌వర్క్ విస్తరణ, 5G, ARPU వృద్ధికి కంపెనీల లక్ష్యం.
  • భారత టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్ ఆధిపత్యం కొనసాగుతోంది.

Mobile Recharge Price Hike: దేశంలోని 2 పెద్ద టెలికాం కంపెనీలు Airtel, Reliance Jio మరోసారి ప్రజలకు షాకివ్వడానికి సిద్ధమవుతున్నాయి. అవును, ఒక రిపోర్ట్ ప్రకారం త్వరలోనే మొబైల్ రీచార్జ్ ధరలు సుమారు 15 శాతం వరకు పెరగవచ్చు.  ఇటీవల Airtel తన కొన్ని తక్కువ ధర ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ నిలిపివేసింది. దాంతో వినియోగదారులు ఇప్పుడు ఖరీదైన రీచార్జ్‌లు చేయించుకోవాల్సి వస్తోంది. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మళ్లీ రీచార్జ్ ధరలు పెరగనుండటం ప్రజలకు చాలా భారంగా మారవచ్చు. అందుకు సంస్థలు ఏం కారణాలు చెబుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

3-4 నెలల్లో రీచార్జ్ ధరలు పెరగొచ్చు

మీడియా రిపోర్ట్ ప్రకారం Jio మరియు Airtel తమ మొబైల్ టారిఫ్‌లను 12 నుంచి 15 శాతం వరకు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఇప్పటికి కేవలం ఒక మార్కెట్ ఫోర్‌కాస్ట్ మాత్రమే. రెండు కంపెనీల నుంచి ఇలాంటి ధర పెంపుపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఈ అంచనా నిజమైతే, దాని ప్రభావం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ 2 రకాల వినియోగదారులపై కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి మొబైల్ రీచార్జ్ చేసుకునే వినియోగదారులు ఇప్పుడు రీచార్జ్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

టారిఫ్‌లు ఎందుకు పెరగొచ్చు?

టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడూ తమ టారిఫ్‌లలో మార్పులు చేస్తుంటాయి. దీని వెనుక నెట్‌వర్క్ విస్తరణ, 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పెక్ట్రం ఖర్చులు, అలాగే ప్రతి కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం అంటే ARPU పెంచడం లాంటి కారణాలు ఉంటాయి. కంపెనీలు ధరలు పెంచితే తక్కువ ధర ప్లాన్‌లు మరింత ఖరీదు అవుతాయి. అంటే, ఇప్పటికే ప్రైమరీ ప్లాన్ రీఛార్జ్ చేస్తున్న వినియోగదారులు కొంచెం ఎక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది.

Jio, Airtel లాభాలపై ప్రశ్నలు

మొబైల్ రీచార్జ్ మరింత ఖరీదు అవుతుందన్న చర్చ వైరల్ అవుతోంది. Ji, Airtel రెండూ గత సంవత్సరం 30,000 కోట్లకు పైగా నెట్ ప్రాఫిట్ నమోదు చేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులకు కంపెనీలు ఇంత లాభం ఆర్జిస్తున్నప్పుడు మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని భావించారు. మళ్లీ ఎందుకు ఎందుకు పెంచుతున్నార్న ప్రశ్న మొదలైంది.

వినియోగదారులపై ప్రభావం 

వైరల్ అవుతున్న సమాచారం మేరకు 12 నుంచి 15 శాతం రీచార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు, ఒక రీచార్జ్ ప్లాన్ ధర 500 రూపాయలు ఉంటే, అది 12 శాతం పెరిగితే అదే ప్లాన్ కోసం 560 రూపాయలు చెల్లించాలి. అదే 15 శాతం పెరిగితే కస్టమర్ 575 రూపాయలు చెల్లించాల్సి రావచ్చు.

టెలికాం రంగంలో పెరుగుతున్న Duopoly

వాస్తవానికి, భారత్ టెలికాం మార్కెట్‌లో Jio, Airtel ఆధిపత్యం కొనసాగుతోంది. మరోవైపు Vodafone Idea, BSNL వంటి ఇతర ఆపరేటర్లు కూడా ఉన్నప్పటికీ, ప్రైవేట్ మొబైల్ మార్కెట్‌లో Jio, Airtel స్థానం పటిష్టంగా ఉంది. టెలికాం రంగంలో Duopoly గురించి చర్చ కొనసాగుతూనే ఉంటుంది. డుయోపోలీ అంటే ఒక రంగంలో ప్రధానంగా 2 కంపెనీల ఆధిపత్యం ఉండే మార్కెట్ కండీషన్. ఇలాంటి మార్కెట్‌లో 2 కంపెనీలు తమ టారిఫ్‌లు పెంచితే, వినియోగదారుల వద్ద సేవల కోసం మరో ఆప్షన్ ఉండదు.

Frequently Asked Questions

మొబైల్ రీచార్జ్ ధరలు ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది మరియు ఎంత శాతం?

త్వరలో 3 నుంచి 4 నెలల్లో మొబైల్ రీచార్జ్ ధరలు 12-15 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఇప్పటికి అధికారిక ప్రకటన కాదు.

రీచార్జ్ ధరలు పెంచడానికి టెలికాం కంపెనీలు చెప్పే కారణాలు ఏమిటి?

నెట్‌వర్క్ విస్తరణ, 5G మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం ఖర్చులు, మరియు ప్రతి కస్టమర్ నుండి వచ్చే ఆదాయం (ARPU) పెంచడం వంటి కారణాలను కంపెనీలు చెబుతున్నాయి.

రీచార్జ్ ధరల పెంపు వినియోగదారులపై ఎలా ప్రభావం చూపుతుంది?

ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇప్పుడు రీచార్జ్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు, 500 రూపాయల ప్లాన్ 12-15% పెంపుతో 560-575 రూపాయలు కావచ్చు.

కంపెనీలు లాభాలు ఆర్జించినప్పటికీ, రీచార్జ్ ధరల పెంపుపై ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు?

Jio మరియు Airtel గత సంవత్సరం 30,000 కోట్లకు పైగా నికర లాభాలు నమోదు చేసినందున, మొబైల్ రీచార్జ్ ధరలు పెంచాల్సిన అవసరం లేదని చాలా మంది వినియోగదారులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget