5G Services in India: జియో Vs ఎయిర్టెల్ - 5G సేవల ఆరంభానికి జోరందుకున్న పోటీ, ఏయే నగరాల్లో ఎవరు ముందు?
భారత్ 5జీ దేశంగా మారబోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ సేవలు అందించేందుకు రెడీ కాగా, ఎయిర్ టెల్ 5జీ సేవలను ప్రారంభించింది. మార్చి 2024 వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

భారత్ లో 5జీ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5G సర్వీసులను ప్రారంభించారు. రిలయన్స్ జియో, ఇతర టెలికాం కంపెనీలు 5G సేవల ప్రారంభించబోతున్నాయి. తాజాగా ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించగా.. ఎయిర్ టెల్ ఇప్పటికే 5జీ సేవలు ప్రారంభించింది. భారత్ లో 5జీ సేవలు అందించే తొలి కంపెనీగా ఎయిర్ టెల్ నిలిచింది.
Airtel, Jio, BSNL, Vodafone Idea 5Gని ఎప్పుడు విడుదల చేస్తాయి?
రాబోయే ఆరు నెలల్లో భారతదేశంలోని 200 నగరాలకు 5G యాక్సెస్ లభిస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే, భారతి ఎయిర్ టెల్ ఇప్పటికే దాదాపు 8 నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు.. మార్చి 2024 నాటికి అందరికీ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తుంది. అటు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంటే ముందు భారతదేశంలోని ప్రతి మూలకు 5Gని తీసుకువస్తామని ప్రకటించింది.
జియో 5G డిసెంబర్ 2023 నాటికి అందరికీ చేరుతుందని RIL చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు, అంటే, వచ్చే ఏడాది చివరి నాటికి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ టెలికాం ఆపరేటర్ 5Gని ఎప్పుడు విడుదల మొదలు పెడుతుంది అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా వెల్లడించడలేదు. గతంలో దీపావళి నాటికి 5G సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరి వరకు జియో 5G సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. అటు వోడాఫోన్ ఐడియా త్వరలో 5Gని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ కూడా కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అటు ప్రభుత్వ నేతృత్వంలోని BSNL, టెలికాం సంస్థ.. 2 సంవత్సరాల్లో దేశంలోని 80 నుంచి 90 శాతం మందికి 5G అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి 5G సేవలను BSNL అందజేస్తుందని ఐటీ మంత్రి వెల్లడించారు.
ఏ నగరాలు మొదట 5G సేవలను పొందుతాయి?
Airtel ప్రస్తుతం 8 నగరాల్లో 5Gని అందిస్తోంది. ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైసహా మరో రెండు నగరాల్లో 5జీ సేవను అందుబాటులోకి తెచ్చింది. పావళి నాటికి కోల్కతా, ముంబై, ఢిల్లీ మరియు చెన్నైతో సహా నాలుగు నగరాల్లో 5G అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో గతంలో తెలిపింది. వోడాఫోన్ ఐడియా, BSNL ఇంకా ఎలాంటి వివరాలను అందించలేదు.
భారతదేశంలో 5G ప్లాన్ల ధర ఎంత?
సరసమైన ధరలో 5G ప్లాన్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గతంలో, 1GB డేటా ధర సుమారు రూ. 300 ఉండగా, ఇప్పుడు అది ఒక GBకి దాదాపు రూ.10కి తగ్గింది. సగటున, భారతదేశంలో ఒక వ్యక్తి నెలకు 14GB వినియోగిస్తాడు. దీనికి నెలకు దాదాపు రూ.4200 ఖర్చు అవుతుంది. కానీ, రూ.125 నుంచి 150కే అందుతుంది. ప్రపంలోనే Jio 5G ప్లాన్లు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం, ప్రజలు అపరిమిత ప్రయోజనాల కోసం సుమారు రూ.400-600 ఖర్చు చేస్తున్నారు. 5G ప్లాన్ ధరలు అదే రేంజ్లో ఉండే అవకాశం ఉంది.
Also Read: వాట్సాప్లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!
Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!
Before You Go
Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
ట్రెండింగ్ వార్తలు





















