అన్వేషించండి

5G Services in India: జియో Vs ఎయిర్‌టెల్ - 5G సేవల ఆరంభానికి జోరందుకున్న పోటీ, ఏయే నగరాల్లో ఎవరు ముందు?

భారత్ 5జీ దేశంగా మారబోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ సేవలు అందించేందుకు రెడీ కాగా, ఎయిర్ టెల్ 5జీ సేవలను ప్రారంభించింది. మార్చి 2024 వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

భారత్ లో 5జీ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5G సర్వీసులను ప్రారంభించారు. రిలయన్స్ జియో,  ఇతర టెలికాం కంపెనీలు 5G సేవల ప్రారంభించబోతున్నాయి. తాజాగా ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించగా.. ఎయిర్ టెల్  ఇప్పటికే 5జీ సేవలు ప్రారంభించింది. భారత్ లో 5జీ సేవలు అందించే తొలి కంపెనీగా ఎయిర్ టెల్ నిలిచింది.  

Airtel, Jio, BSNL, Vodafone Idea 5Gని ఎప్పుడు విడుదల చేస్తాయి?

రాబోయే ఆరు నెలల్లో భారతదేశంలోని 200 నగరాలకు 5G యాక్సెస్ లభిస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే, భారతి ఎయిర్‌ టెల్ ఇప్పటికే దాదాపు 8 నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు..  మార్చి 2024 నాటికి అందరికీ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తుంది. అటు  రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంటే ముందు భారతదేశంలోని ప్రతి మూలకు 5Gని తీసుకువస్తామని ప్రకటించింది.

జియో 5G డిసెంబర్ 2023 నాటికి అందరికీ చేరుతుందని RIL చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు, అంటే, వచ్చే ఏడాది చివరి నాటికి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది.  అయితే, ఈ టెలికాం ఆపరేటర్ 5Gని ఎప్పుడు విడుదల మొదలు పెడుతుంది అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా వెల్లడించడలేదు. గతంలో  దీపావళి నాటికి 5G సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరి వరకు జియో 5G సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. అటు వోడాఫోన్ ఐడియా త్వరలో 5Gని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ కూడా కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అటు ప్రభుత్వ నేతృత్వంలోని BSNL, టెలికాం సంస్థ.. 2 సంవత్సరాల్లో దేశంలోని 80 నుంచి 90 శాతం మందికి 5G అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి 5G సేవలను BSNL అందజేస్తుందని ఐటీ మంత్రి వెల్లడించారు. 

నగరాలు మొదట 5G సేవలను పొందుతాయి?

Airtel ప్రస్తుతం 8 నగరాల్లో 5Gని అందిస్తోంది.  ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైసహా మరో రెండు నగరాల్లో 5జీ సేవను అందుబాటులోకి తెచ్చింది. పావళి నాటికి కోల్‌కతా, ముంబై, ఢిల్లీ మరియు చెన్నైతో సహా నాలుగు నగరాల్లో 5G అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో గతంలో తెలిపింది. వోడాఫోన్ ఐడియా, BSNL ఇంకా ఎలాంటి వివరాలను అందించలేదు.                

భారతదేశంలో 5G ప్లాన్ ధర ఎంత?

సరసమైన ధరలో 5G ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గతంలో, 1GB డేటా ధర సుమారు రూ. 300 ఉండగా, ఇప్పుడు అది ఒక GBకి దాదాపు రూ.10కి తగ్గింది. సగటున, భారతదేశంలో ఒక వ్యక్తి నెలకు 14GB వినియోగిస్తాడు. దీనికి నెలకు దాదాపు రూ.4200 ఖర్చు అవుతుంది. కానీ, రూ.125 నుంచి 150కే అందుతుంది. ప్రపంలోనే Jio 5G ప్లాన్‌లు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంబానీ ప్రకటించారు.   ప్రస్తుతం, ప్రజలు అపరిమిత ప్రయోజనాల కోసం సుమారు రూ.400-600 ఖర్చు చేస్తున్నారు.   5G ప్లాన్ ధరలు అదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!

Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget