అన్వేషించండి

KL Rahul Leaving PBKS: షాకింగ్‌ న్యూస్‌! పంజాబ్‌ను వదిలేయనున్న కేఎల్‌ రాహుల్‌.. ఆర్‌సీబీ కన్ను పడిందా?

పంజాబ్‌ కింగ్స్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌ విడిపోతున్నాడని తెలిసింది. వచ్చే సీజన్‌కు అతడు వేలంలోకి రావాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మూడు, నాలుగు ఫ్రాంచైజీలు సైతం అతడితో చర్చలు జరిపాయని సమాచారం.

టీమ్‌ఇండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.  పంజాబ్‌ కింగ్స్‌ నుంచి విడిపోతున్నాడని తెలిసింది. వచ్చే సీజన్‌కు అతడు వేలంలోకి రావాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మూడు, నాలుగు ఫ్రాంచైజీలు సైతం అతడితో చర్చలు జరిపాయని సమాచారం.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో రాహుల్‌కు అద్భుతమైన రికార్డుంది. ఇప్పటి వరకు 94 మ్యాచులు ఆడిన అతడు 47.43 సగటు, 136.37 స్ట్రైక్‌రేట్‌తో 3,273 పరుగులు చేశాడు. 2018 నుంచి అతడు 600కు తక్కువ కాకుండా పరుగులు చేశాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌కు ఎంపికైనప్పటి నుంచి వీరోచితంగా ఆడుతున్నాడు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు. కెప్టెన్‌గానూ అలరిస్తున్నాడు. చివరి నాలుగు సీజన్లలో అతడు వరుసగా 659, 593, 670, 626 పరుగులు చేశాడు.

Also Read: అయ్యో ఆర్సీబీ.. ‘ఈ సాల’ కూడా కప్పు మిస్.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం!

పంజాబ్‌ కింగ్స్‌లో అతడికి తిరుగులేదు. ఇబ్బందులూ లేవు. కానీ అతడు ఆ జట్టుతో బంధం తెంచుకోవాలని భావిస్తున్నాడని తెలిసింది. వచ్చే సీజన్‌కు మరో రెండు కొత్త జట్లు రానున్నాయి. మంచి క్రికెటర్లకు ఎక్కువ ధర పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే రెండు, మూడు ఫ్రాంచైజీలు అతడితో చర్చలు జరిపాయనీ అంటున్నారు. ఒకవేళ గనక రాహుల్‌ వేలంలోకి వస్తే అందరికన్నా ఎక్కువ ధర పలుకుతాడని, రికార్డులు బద్దలు కొడతాడని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోంది.. బీసీసీఐ మాటే నెగ్గుతుంది: ఇమ్రాన్ ఖాన్

కేఎల్‌ రాహుల్‌ స్వస్థలం బెంగళూరు. దేశవాళీ క్రికెట్లో అతడు కర్ణాటకకు ఆడతాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఇప్పటి వరకు ఆ జట్టు ట్రోఫీ గెలిచిందే లేదు. పైగా ఇప్పుడు కోహ్లీ కెప్టెన్‌గా దిగిపోతున్నాడు. అతడితో రాహుల్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా స్థానికుడు కావడంతో ఆర్‌సీబీ అతడిని దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తోందని ఆయా వర్గాల ద్వారా తెలిసింది.

Also Read: ధోని నామస్మరణతో షేక్ అయిన సోషల్‌మీడియా.. స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోయిన వేళ!

వచ్చే సీజన్‌ కోసం బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. అందరు ఆటగాళ్లు వేలం పరిధిలోకి రావాల్సిందే. అట్టిపెట్టుకొనే విషయంపై ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఆర్‌టీఎం ఉపయోగించుకొనే అవకాశం ఇచ్చినా రాహుల్‌ మాత్రం పక్కకు వెళ్లిపోతాడనే అంటున్నారు. మరి అతడిని ఆర్‌సీబీ దక్కించుకుంటుందా? కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకుంటాయా? మరే ఇతర జట్టుకైనా వెళ్తాడా? చూడాలి మరి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.