అన్వేషించండి

Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్‌..! వచ్చే ఐపీఎల్‌ను...?

ఐపీఎల్ తర్వాతి సీజన్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడాడు. భారత్‌లోనే ఐపీఎల్‌ తర్వాతి సీజన్‌ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కరోనా ఘోర దశ ముగిసిందనే భావిస్తున్నామని తెలిపాడు.

కరోనా ఘోర దశ ముగిసిందనే భావిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అంటున్నాడు. భారత్‌లోనే ఐపీఎల్‌ తర్వాతి సీజన్‌ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా క్రికెట్‌ కొనసాగుతోందని వెల్లడించాడు. తాజా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ గురించి అంతగా ఆందోళన చెందడం లేదని పేర్కొన్నాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌ను మొదట భారత్‌లోనే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సగం సీజన్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు కరోనా వైరస్‌ సోకడంతో నిరవధికంగా వాయిదా వేశారు. సెప్టెంబర్లో దుబాయ్‌లో రెండో అంచె నిర్వహించారు. ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నూ బీసీసీఐ అక్కడే నిర్వహించింది. ఈ మధ్యే స్వదేశంలో న్యూజిలాండ్‌ సిరీసుకు బీసీసీఐ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా ఘోర దశ అంతమైందనే బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

'కరోనా ఘోర దశ ముగిసిందనే అనుకుంటున్నా! వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని నమ్మకంగా ఉన్నా. ఎందుకంటే ఇది మన దేశపు టోర్నీ. ఐపీఎల్‌ ఇక్కడ ఆడుతున్నప్పుడు వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడైతే అంతర్జాతీయ క్రికెట్‌ జరుగుతోంది. మేం న్యూజిలాండ్‌ సిరీసుకు ఆతిథ్యమిచ్చాం. త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నాం. ఆ తర్వాత వెస్టిండీస్‌, శ్రీలంక సిరీసులు ఉన్నాయి. అందుకే ఘోర దశ ముగిసిందని అనుకుంటున్నా' అని దాదా అన్నాడు.

'కొవిడ్‌ ఉన్నప్పటికీ మేం ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. దుబాయ్‌లోని క్రీడా వర్గాలు అద్భుతంగా పనిచేశాయి. ఇప్పుడు మన దేశవాళీ క్రికెట్‌ మునుపటి స్థాయిలోనే కొనసాగుతోంది. మహమ్మారి వల్ల గతేడాది కాస్త విరామం ఇవ్వాల్సి వచ్చింది. దాదాపు మేం అన్ని టోర్నీలను పూర్తి చేశాం. జనవరిలో రంజీ ట్రోఫీ మొదలవుతుంది. జూనియర్‌ క్రికెట్‌ సైతం ఆరంభమైంది. ఇప్పటికైతే కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు లేవు' అని గంగూలీ తెలిపాడు.

కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం గురించి ప్రశ్నించగా ఆందోళన చెందడం లేదని సౌరవ్‌ అన్నాడు. 'మేం భయపడటం లేదు. మున్ముందు పరిస్థితులను సమీక్షించి ఏం జరుగుతుందో చూస్తాం' అని వెల్లడించాడు.

Also Read: Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!

Also Read: Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం

Also Read: Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!

Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!

Also Read: Ruturaj Gaikwad: ఎప్పుడో ఐపీఎల్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.. ఇంకా ఆపలా.. రుతురాజ్ మరో రికార్డు

Also Read: Yuvraj Singh NFT: బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చిన యువరాజ్ సింగ్.. తన విలువైన ట్రోఫీలు ఎన్‌ఎఫ్‌టీ చేస్తూ కీలక నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.