అన్వేషించండి

IND vs ENG 2nd Test :లార్డ్స్‌లో భారత్‌ లీడ్‌.. భారీ స్కోరుపై కన్నేసిన కోహ్లీ సేన.. రికార్డులు తిరగరాసిన రోహిత్-రాహుల్ జోడీ 

లార్డ్స్‌లో కోహ్లీ సేన తొలి రోజు దుమ్మురేపింది. ఓపెనర్లు రాణించి వంద పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదే జోరు కొసాగితే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం ఉంచేలా కనిపిస్తోంది భారత్‌.

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు భారత్‌ పైచేయి సాధించింది. ఓపెనర్స్‌ ఇచ్చిన శుభారంభంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 

తొలిరోజు 90ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 276పరుగులు సాధించింది. ప్రస్తుతం రాహుల్‌ 127పరుగులతో, రహానే ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఓపెన్ రోహిత్ శర్మ 83పరుగుల చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 42పరుగులకు ఔటయ్యాడు. రెండో టెస్టులోనూ విఫలమైన పుజారా కేవలం 9పరుగులే చేసి ఔట్‌ అయ్యాడు.

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి కిక్‌స్టార్ట్ లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ ఆట నెమ్మదిగా స్టార్ట్ చేసి తర్వాత జోరు పెంచారు. మొదట వరుణుడు పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. ఒకానొక దశలో ఆట ఆగిపోతుందేమో అన్న అనుమానం కూడా కలిగింది. లంచ్‌ వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. లంచ్‌ తర్వాత వర్షం ఆగిపోవడం... భారత్‌ బ్యాట్స్‌మెన్ దూకుడు స్టార్ట్ చేశారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. స్పీడ్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడేమో అన్న ఆనందం అందరిలో కలిగింది అయితే 83పరుగుల వ్యక్తిగ స్కోరు వద్ద అండర్సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన పుజారా కేవలం 9పరుగులే చేసి అండర్సన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పుజారా ఔటైన తర్వాత వచ్చిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. రెండు వికెట్ల నష్టానికి 157పరుగులతో రెండో సెషన్ పూర్తి చేసింది భారత్. 

తర్వాత సెషన్‌లో కోహ్లీ, రాహుల్ ధాటిగా ఆడారు.. ఇద్దరూ మరో సెంచరీ పార్టనర్‌షిప్‌ నమోదు చేశారు. కోహ్లీ అండతో రాహుల్ టెస్టుల్లో తన ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్‌ కూడా అర్థ సెంచరీ చేస్తాడనుకున్న టైంలో రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు కోహ్లీ. చివరకి రహానే వచ్చి జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా చూసుకున్నాడు. 

లార్డ్స్‌లో వంద పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పిన రెండో జోడీగా రికార్డు సృష్టించింది రోహిత్, రాహుల్ జంట. ఈ ఓపెనింగ్ జోడీ 69ఏళ్ల రికార్డు బ్రేక్ చేసింది. వంద పరుగులపైగా  పార్టనర్‌షిప్‌ నెలకొల్పిన జోడీగా చరిత్ర తిరగరాసింది. 1952లో జరిగిన మ్యాచ్‌లో అప్పటి ఓపెనింగ్ జోడీ వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ కలిసి లార్డ్స్‌ గ్రౌండ్‌లో నెలకొల్పిన 106పరుగులే ఇప్పటికి అత్యధిక ఓపెనింగ్ పార్టనర్‌ షిప్‌. ఇప్పుడు దాన్ని రాహుల్, రోహిత్‌ జంట బ్రేక్ చేసింది.  126 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త చరిత్ర సృష్టించిందీ ద్వయం. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడిన రోహిత్‌ శర్మ 83పరుగులు చేసి ఔటయ్యారు. 145 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Embed widget