అన్వేషించండి

WTC Final: ప్రతిసారీ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌ అవసరం లేదు - సచిన్‌ నోట ఇలాంటి మాటా!!

WTC Final: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఓవల్‌ మైదానంలో జరుగుతుండటం టీమ్‌ఇండియాకు అనుకూలమని సచిన్‌ తెందూల్కర్‌ అంటున్నారు.

WTC Final 2023:

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఓవల్‌ మైదానంలో జరుగుతుండటం టీమ్‌ఇండియాకు అనుకూలమని సచిన్‌ తెందూల్కర్‌ అంటున్నారు. భారత్‌కు అక్కడ మధుర స్మృతులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆట సాగే కొద్దీ స్పిన్నర్లు ఈ పిచ్‌పై ప్రభావం చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. ఫైనల్‌కు ముందు ఆయన 100ఎంబీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

'కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో ఆడటం టీమ్‌ఇండియాకు ఆనందం. ఎందుకంటే మ్యాచ్ సాగేకొద్దీ ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అందుకే ఫైనల్లో వారు కీలకం అవుతారు. వికెట్లు ప్రతిసారీ టర్న్‌ అవ్వాల్సిన పన్లేదు. కొన్నిసార్లు స్పిన్నర్లు బౌన్స్‌పై ఎక్కువ ఆధారపడతారు. గాలి కూడా అనుకూలంగా మారుతుంది. వాతావరణం చల్లగా ఉంటే బంతి షైనింగ్‌ను వాడుకుంటారు' అని సచిన్‌ అన్నారు.

'డ్రిఫ్ట్‌ చేయగలిగితే స్పినర్లు బంతితో గాల్లోనే మాట్లాడిస్తారు. అప్పుడు టర్నింగ్‌ పిచ్‌తో పనేలేదు. అందుకే ఓవల్‌ టీమ్‌ఇండియాకు మరింత అడ్వాంటేజ్‌గా మారుతుంది' అని మాస్టర్‌ బ్లాస్టర్‌ అన్నారు. చివరిసారి ఓవల్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 2021లో ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మధురస్మృతులు టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ఉత్తేజం నింపుతాయని ఈ క్రికెట్‌ దిగ్గజం భావిస్తున్నారు.

'వంద శాతం నిజం. అలాంటి మధురస్మృతులు కచ్చితంగా మనకు ఉత్తేజం కలిగిస్తాయి. చివరిసారి అక్కడ ఎలా ఆడామో టీమ్‌ఇండియా మర్చిపోదు. ఆ మ్యాచ్‌ను అద్భుతంగా గెలిచారు. మెమరీస్ ఎప్పుడూ మనవెంటే ఉంటాయి' అని సచిన్‌ వెల్లడించారు. అలాగే ఓవల్‌లో ఆసీస్‌కు మెరుగైన రికార్డేమీ లేదు. 2019 యాషెస్‌ టెస్టులో కంగారూలను ఆంగ్లేయులు 135 పరుగుల తేడాతో ఓడించారు. అయితే ఆసీస్‌ను తక్కువ అంచనా వేయొద్దని మాస్టర్‌ సూచించారు.

'ఇలాంటి గాయాల నుంచి తేరుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఆస్ట్రేలియా చాలా పటిష్ఠమైన జట్టు. సమతూకంగా కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. యువ క్రికెటర్లూ వారికి తోడుగా ఉన్నారు. కంగారూ టీమ్‌ ఎప్పుడూ గట్టిపోటీనిస్తుంది. ఒక్కసారి నిలబడ్డారంటే వారిని అడ్డుకోవడం చాలా కష్టం' అని సచిన్‌ పేర్కొన్నారు.

కౌంటీ క్రికెట్‌ ఆడిన చెతేశ్వర్‌ పుజారా, మార్నస్‌ లబుషేన్‌ రెండు జట్లకూ కీలకం అవుతారని సచిన్‌  అంచనా వేశారు. 'అవును, కౌంటీ క్రికెట్‌ ఆడటం గొప్ప విలువను తీసుకొస్తుంది. పుజారా, లబుషేన్‌ రీసెంట్‌గా ఎక్కువ కౌంటీ క్రికెట్‌ ఆడారు. వారితో పోలిస్తే స్మిత్‌ కాస్త తక్కువే ఆడారు. అయితే ఇక్కడి పరిస్థితుల్లో ఆ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ బాగా ఉపయోగపడుతుంది. మిగిలిన క్రికెటర్లు టీ20 క్రికెట్‌ ఆడి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. ఏదేమైనా ప్రాక్టీస్ మ్యాచులు ఆడటాన్ని మించి మెరుగైన సన్నద్ధత ఏమీ ఉండదు' అని ఆయన అన్నారు.

భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌

ఆస్ట్రేలియా: ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, నేథన్‌ లైయన్‌, టాడ్‌ మర్ఫీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్‌ మార్ష్‌, మాథ్యూ రెన్షా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget