అన్వేషించండి

Champions Trophy News: టీమిండియా తుదిజట్లులో కీలక మార్పులు.. పంత్ కు నిరాశేనా..? జడేజాకు చోటు డౌటే..!

Champions Trophy : అందరూ ఊహించినట్టే చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటించింది. పేసర్ సిరాజ్ ను తప్పించడం కాస్త షాక్ కు గురి చేసింది. సీనియర్ పేసర్ షమీ రావడంతోనే తప్పించినట్లు తెలుస్తోంది. 

BCCI News: బీసీసీఐ తాజాగా ప్రకటించిన ఐసీసీ చాంపియన్షిప్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో కొన్ని అనూహ్య నిర్ణయాలు ఉన్నాయి. తెలుగు పేసర్ మహ్మద్ సిరాజ్ ను జట్టు నుంచి తప్పించారు. అలాగే గాయం గురించి అవగాహన రాక ముందే స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాను జట్టులోకి ఎంపిక చేశారు. అయినా ఫిబ్రవరి 13 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశముండటంతో భారత స్క్వాడ్ పై మరోసారి స్పష్టత అప్పుడు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.  మరోవైపు కేఎల్ రాహుల్ ను వన్డేల్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు. దీంతో రిషభ్ పంత్ అతనికి సబ్ స్టిట్యూట్ గా వ్యవహరించానున్నాడు. మిడిలార్డర్ లో ఐదో నెంబర్లో రాహుల్ బ్యాటింగ చేయనున్నాడు. ఇక దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. తాజాగా జరుగుతున్న విజయ్ హాజరే వన్డే ట్రోఫీలో తను 752 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అయినా కూడా అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. 

ఓపెనర్ గా శుభమాన్ గిల్..
వన్డేల్లో రోహిత్ శర్మతోపాటు శుభమాన్ గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయమైంది. దీంతో పాటు అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. భవిష్యత్తును ఫోకస్ లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను నాలుగో స్పిన్నర్ గా జట్టులోకి తీసుకున్నారు. కులదీప్ యాదవ స్పెషలిస్టు స్పిన్నర్ గా బరిలోకి దిగుతుండగా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లతోపాటు జడేజాను కూడా స్పిన్ ఆల్ రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకున్నారు. ఇక మహ్మద్ షమీ వన్డేలలోకి పునరాగమనం చేశాడు. సొంతగడ్డపై 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఏడాదే తను అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. 

స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్లు కాదు..
ఇటీవల బీసీసీఐ రూపొందించిన పది పాయింట్ల మార్గదర్శకాలపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. భారత జట్టు అంటే స్కూల్ కాదని, ఇప్పుడీ మార్గదర్శకాలు పనిష్మెంట్లు కావాని ఉద్ఘాటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు జట్టుగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, ఈక్రమంలోనే బోర్డు మార్గదర్శకాలు ఏర్పాటు చేసిందని తెలిపాడు. ఈ గైడ్ లైన్లు ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేయలేదని గతంలోనూ ఉండేవని తెలిపాడు. టీమిండియాలో సూపర్ స్టార్లు ఉన్నారని, వారికి అన్నీ తెలుసని, మార్గదర్శకాల గురించి అవగాహన ఉందని వ్యాఖ్యానించాడు. గత కొన్నేళ్లుగా ఈ మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చిందని పేర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో తన మ్యాచ్ లను దుబాయ్ లో భారత్ ఆడుతుంది. వచ్చేనెల 20న బంగ్లాదేశ్ తో, 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో, మార్చి 2 న న్యూజిలాండ్ తో లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. 

Also Read: ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget