వన్డే క్రికెట్లో భారత్ తరఫున ఆడిన అత్యంత వృద్ధ (ఎక్కువ వయసు గల) క్రికెటర్గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. అతను ఈ రికార్డును 37 ఏళ్ల తర్వాత బద్దలు కొట్టబోతున్నాడు.
Rohit Sharma Record: 37 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టనున్న రోహిత్ శర్మ.. టీమిండియాలో హిట్ మ్యాన్ అరుదైన ఘనత
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. 37 ఏళ్ల నాటి రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టబోతున్నాడు.

- అఫ్ఘానిస్తాన్తో మొదటి వన్డేలో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు.
- భారత తరఫున వన్డే ఆడిన అత్యంత పెద్ద వయస్సు గల ఆటగాడిగా నిలుస్తాడు.
- మోహిందర్ అమర్నాథ్ 37 ఏళ్ల రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టనున్నాడు.
- కోహ్లీ, పాండ్యా గాయాలతో సిరీస్కు దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బ.
India vs Afghanistan | ధర్మశాల: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. 37 ఏళ్ల నాటి రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టబోతున్నాడు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ శనివారం ధర్మశాల వేదికగా జరగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ శర్మ అడుగు పెట్టగానే 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టనున్నాడు. వన్డే క్రికెట్లో భారత్ తరఫున ఆడిన అత్యంత వృద్ధ (ఎక్కువ వయసు గల) క్రికెటర్గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. ఇటీవల అతడు ఫిట్నెస్ టెస్ట్ పాసయ్యాడు. దాంతో భారత జట్టులో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ ఈ మూడు వన్డేల సిరీస్ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు భారత జట్టుకు సిరీస్కు ముందు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు అందుబాటులో లేరు. విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా సైతం గాయాలతో బాధపడుతున్నారు. దాంతో వారిద్దరూ ఈ సిరీస్కుగానూ భారత జట్టులో భాగం కాలేకపోతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన నాటికి వీరిద్దరూ భారత జట్టులోకి పునరాగమనం చేస్తారని భావిస్తున్నారు.
రోహిత్ శర్మ పేరిట అత్యధిక వయసు ట్యాగ్
ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచులో బరిలోకి దిగినప్పుడు రోహిత్ శర్మ వయసు 39 ఏళ్ల 44 రోజులు ఉంటుంది. దాంతో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యంత ఎక్కువ వయసు గల ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. 37 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇప్పటికి సరిగ్గా 37 ఏళ్ల కిందట 1983 వరల్డ్ కప్ ఛాంపియన్ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ పేరిట ఈ రికార్డు ఉండేది. మోహిందర్ అమర్నాథ్ భారత్ తరఫున తన చివరి వన్డే మ్యాచ్ను 1989లో ఆడగా.. ఆ సమయంలో మోహిందర్ అమర్నాథ్ వయసు 39 ఏళ్ల 36 రోజులు ఉంది.
IND vs AFG వన్డే సిరీస్ జట్టు
భారత్ ఆటగాళ్లు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, సిద్దిఖుల్లా అటల్, అఫ్సర్ జజాయ్, నంగ్యాలియా ఖరోటే, అబ్దుల్ మాలిక్, షరాఫుద్దీన్ అష్రఫ్, జియాయుర్ రహ్మాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ, రహ్మానుల్లా
Before You Go
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Frequently Asked Questions
రోహిత్ శర్మ ఏ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు?
భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యంత ఎక్కువ వయసు గల ఆటగాడిగా గతంలో ఎవరి రికార్డు ఉండేది?
గతంలో 1983 వరల్డ్ కప్ ఛాంపియన్ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆయన తన చివరి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు 39 ఏళ్ల 36 రోజులు.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉన్నారా?
లేదు, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేరు. వారు ఇంగ్లాండ్ పర్యటన నాటికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు




















