Rohit Sharma, Virat Kohli: రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. టీమిండియా సీనియర్ల ఫ్యూచర్పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం ఉందంటూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ravichandran Ashwin Blunt Verdict On Senior Players Future: ఇండియా క్రికెట్లో ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే వరల్డ్ కప్పైనే ఉంది. ఈ మెగా టోర్నమెంట్ నాటికి రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి 39 ఏళ్లు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు 40 ఏళ్లు నిండుతాయి. వయసు పెరుగుతున్నప్పటికీ, వీరిద్దరి ఫిట్నెస్, బ్యాటింగ్ ఫామ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరు నెక్స్ట్ వరల్డ్ కప్ రేసులో ఉంటారా లేదా అనే సస్పెన్స్ నడుస్తోంది. దీనిపై ఇండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓపెన్గా మాట్లాడాడు. మేనేజ్మెంట్కు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ వరల్డ్ కప్ ఆడటం పెద్ద కష్టమేమీ కాదని తేల్చి చెప్పాడు.
మేనేజ్మెంట్ సపోర్టు ముఖ్యం..
ఈ ఇష్యూపై అశ్విన్ ఈఎస్పిఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడాడు. తన ఎక్స్పీరియన్స్ ప్రకారం విషయాలు చాలా సింపుల్ గా ఉంటాయని అన్నాడు. సౌతాఫ్రికాలో జరగబోయే 50 ఓవర్ల వరల్డ్ కప్లో రోహిత్, విరాట్ ఇద్దరి సేవలు కావాలని టీమ్ మేనేజ్మెంట్ బలంగా కోరుకుంటే, అది కచ్చితంగా పాజిబుల్ అవుతుందని స్పష్టం చేశాడు. వారి ఎక్స్పీరియన్స్ను టీమ్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోవచ్చని తెలిపాడు. అయితే మేనేజ్మెంట్ ఆలోచన వేరేలా ఉంటే మాత్రం ప్లేయర్స్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంటుందని హింట్ ఇచ్చాడు.
ప్రాపర్ రిహాబ్ ప్రోగ్రాం అవసరం..
తానేమీ మెడికల్ సైంటిస్ట్ లేదా స్పెషలిస్ట్ను కాదని అశ్విన్ అన్నాడు. కానీ ప్లేయర్స్ కోసం ఒక ప్రాపర్ రిహాబ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి, వారి వర్క్లోడ్ను కరెక్ట్గా ప్లాన్ చేస్తే అనుకున్నది సాధించవచ్చని చెప్పాడు. టీమ్ నుంచి, చుట్టుపక్కల నుంచి మంచి సపోర్ట్, పాజిటివ్ వైబ్స్ లభిస్తే రోహిత్, విరాట్ ఇద్దరూ తమ బాడీని కంట్రోల్ చేసుకుంటూ 2027 మెగా ఈవెంట్ వరకు ఫిట్గా కొనసాగగలరని అశ్విన్ నమ్మకం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికైతే వీరిద్దరూ అద్భుతమైన ఎనర్జీతో రన్స్ స్కోర్ చేస్తున్నారు.
ఆప్గాన్ తో వన్డే సిరీస్ కు సెలెక్ట్..
ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 13 నుంచి జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇండియన్ స్క్వాడ్లో భాగమయ్యారు. ఈ సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ Yadav, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చోటు దక్కించుకున్నారు. వరల్డ్ కప్ బిల్డప్ ప్లాన్స్లో భాగంగా సీనియర్ల రోల్ ఏంటనేది ఈ సిరీస్ ద్వారా మరింత స్పష్టం కానుంది.
ట్రెండింగ్ వార్తలు



















