అన్వేషించండి

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

MS Dhoni is doing duty in elections: ఐపీఎల్ ముగియగానే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో సీఎస్కే నిలిచింది. ఐపీఎల్ ముగియగానే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల విధులలో భారత మాజీ కెప్టెన్ ధోని నిమగ్నమై ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ ముగిసింది, ఎలక్షన్ డ్యూటీలో ధోనీ భాయ్ బిజీ బిజీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

వైరల్ అయిన ఫొటో.. వాస్తవం ఇదే
ఝార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఐపీఎల్ లో సీఎస్కే ఇంటిదారి పట్టడంతో ధోనీ రాంచీకి వెళ్లిపోయాడు. ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నాడని ప్రచారం జరిగింది. కానీ వైరల్ ఫొటోలో ఉన్నది ధోనీ కాదు.  ఆ ఎలక్షన్ ఆఫీసర్ పేరు వివేక్ కుమార్, ఆయన సీసీఎల్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వివేక్ కుమార్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఎన్నికలు జరుగుతున్నది కూడా ఝార్ఖండ్ అవడంతో వివేక్ కుమార్‌ను ధోనీగా భావించి నెటిజన్లు స్పందించారు. ఐపీఎల్ అయిపోయింది, ఇక ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీ అని కామెంట్లు చేశారు. కానీ ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి వివేక్ కుమార్ అని తెలిసింది.

ఐపీఎల్ 2022లో ధోనీ స్కోర్..
ఎంఎస్ ధోనీ సీజన్ మధ్యలో సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు మరోసారి అందుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఎంఎస్ ధోని 14 మ్యాచ్‌ల్లో 33.14 సగటుతో 232 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 1 హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రతి సీజన్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డ్ ధోనీ సొంతమైంది. 

ఐపీఎల్ 2023లో ఆడనున్న ధోనీ 
ఐపీఎల్ 2022లో లీగ్ చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓడి, ఓటమితో సీజన్ ముగించింది. అయితే ఇది తన చివరి ఐపీఎల్ మ్యాచ్ కాదని ధోనీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ సీజన్ 16లోనూ తనను చూడవచ్చునని, మరింత స్ట్రాంగ్‌గా సీఎస్కే తిరిగి వస్తుందని ధోనీ పేర్కొన్నాడు. చెన్నైలో మ్యాచ్‌లు ఆడకపోవడం తనకు నచ్చలేదన్నాడు. వచ్చే ఏడాది చెన్నై వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతామని ఆకాంక్షించాడు. 

Also Read: RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

Also Read: IPL 2022 Title Winner: ఐపీఎల్ 2022 విన్నర్‌గా నిలిచేందుకు ఆ 2 జట్లకే ఛాన్స్ ఎక్కువ, అందుకు ప్రూఫ్ ఇదిగో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget