Team India T20 World Cup Disaster: హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..! టీమిండియా ఘోర పరాజయంపై సెలెక్టర్ల సీరియస్ యాక్షన్, ఉమెన్స్ క్రికెట్ లో మేజర్ రీసెట్ స్టార్ట్!!
ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ నుంచి ఇండియా టీమ్ దారుణంగా ఎలిమినేట్ అవ్వడంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫ్యూచర్ పై సెలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

India Stare At Major Reset After World Cup: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ ఎలిమినేషన్ తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ లీడర్షిప్ తీవ్రమైన విమర్శల పాలవుతోంది. టీమిండియా బిగ్గెస్ట్ రీసెట్ కు రెడీ అవుతోంది. ఆదివారం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన సిక్స్-వికెట్ పరాజయం ఇండియా సెమీఫైనల్ ఆశలను కంప్లీట్గా సమాధి చేసింది. టోర్నమెంట్ స్టార్టింగ్ లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇండియా, ఒత్తిడి సమయాల్లో ప్లానింగ్ లేక దారుణంగా ఫెయిల్ అయింది. హర్మన్ప్రీత్ కెప్టెన్సీలో ఇండియా వరుసగా రెండోసారి టి20 వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ చేరకుండానే ఇంటిదారి పట్టడం ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది. వరల్డ్ కప్ క్యాంపెయిన్ ఎండ్ అయిన తర్వాత హర్మన్ప్రీత్, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ ఇద్దరూ ‘రీథింక్’ అనే వర్డ్ యూజ్ చేయడం టీమ్ లో రాబోయే మార్పులకు హింట్ ఇస్తోంది.
హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీ అవుట్..!
వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఏడాది లోపే 37 ఏళ్ల హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీ కెరీర్ ప్రెజెంట్ క్లోజ్ అయ్యే పొజిషన్ కు వచ్చింది. ఇండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయినప్పటికీ ప్రెజెంట్ టీ20 ఫార్మాట్ లో ఆమె కెప్టెన్సీ అస్సలు వర్కౌట్ కావడం లేదు. హర్మన్ప్రీత్ బ్యాటింగ్ ఫామ్ చూస్తే 2024 వరల్డ్ కప్ నుంచి ఆడిన 24 ఇన్నింగ్స్లలో ఆమె కేవలం నాలుగు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ను దాటింది. ఆస్ట్రేలియాపై ఆడిన ఒంటరి పోరాటం మినహాయిస్తే టోర్నీలో ఆమె నుంచి ఎలాంటి సాలిడ్ కాంట్రిబ్యూషన్ లేదు. మిడిల్ ఓవర్లలో రన్స్ స్కోర్ చేయలేక టీమ్ పై ప్రెజెంట్ పెంచేసింది. కోచ్ అమోల్ ముజుందార్ మాత్రం కెప్టెన్సీ నిర్ణయం సెలెక్టర్లదేనని చెప్తూ హర్మన్ప్రీత్కు సపోర్ట్ ఇచ్చాడు.
కన్ఫ్యూజన్ కాంబినేషన్స్..
వరల్డ్ కప్ గెలవాలనే పక్కా ప్లాన్ తో వెళ్లిన ఇండియా, బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ను సెట్ చేసుకోవడంలోనే సగం టైమ్ వేస్ట్ చేసింది. పేస్ బౌలింగ్ అటాక్ లో ప్రతీ మ్యాచ్ కు చేంజెస్ చేస్తూ కన్ఫ్యూజ్ అయ్యారు. నందిని శర్మ, క్రాంతి గౌడ్ చెరో మూడు మ్యాచ్లు ఆడగా, మెయిన్ బౌలర్లు రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి కేవలం రెండు మ్యాచులకే పరిమితం అయ్యారు. అమన్జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్ ల ఇంజ్యూరీస్ టీమ్ను మరింత దెబ్బతీశాయి. అయితే టీమ్ లో మోస్ట్ ఇన్-ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అయిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి 5.85 ఎకానమీతో వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సీనియర్ బౌలర్లు ఉన్నా చరణి ఒక్కతే ఇండియాను కాపాడింది.
డిఫెన్సివ్ అప్రోచ్.. ఫీల్డింగ్ లో 10 ఈజీ క్యాచులు డ్రాప్
ఇండియా టీమ్ ఫియర్ లెస్ క్రికెట్ ఆడతామని చెప్పినా ప్రాక్టికల్ గా మాత్రం చాలా కన్జర్వేటివ్ గా ఆడింది. పవర్ప్లే తర్వాత యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్ స్లో బ్యాటింగ్ తో రన్ రేట్ ను దెబ్బతీశారు. ఆస్ట్రేలియాతో జరిగిన డూ-ఆర్-డై మ్యాచ్ లో అగ్రెసివ్ బ్యాటర్ కావాల్సిన టైమ్ లో జెమిమాను వన్ డౌన్ పంపించడం పెద్ద బ్లండర్. దీంతో రిచా ఘోష్, దీప్తి శర్మలపై లాస్ట్ లో ప్రెజర్ పెరిగింది. వీటన్నింటికీ తోడు ఇండియా టోర్నీలో ఏకంగా 10 ఈజీ క్యాచులు డ్రాప్ చేసి వరస్ట్ ఫీల్డింగ్ ప్రదర్శించింది. సౌతాఫ్రికా మ్యాచ్ లో మరిజానే కాప్ ఇచ్చిన 3 క్యాచులు వదిలేయడం వల్లే ఇండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్ మ్యాచ్ లోనూ ఫస్ట్ 5 ఓవర్లలో 4 క్యాచులు చేజార్చారు. ఈ దారుణమైన లోపాల వల్లే ఇండియా వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిందని తెలుస్తోంది.
Before You Go
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
ట్రెండింగ్ వార్తలు



















