News
News
X

Ind-W vs Pak-W T20 WC: సెల్ఫీలు, ముచ్చట్లు, జోకులు- భారత్- పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల స్నేహం చూశారా!

Ind-W vs Pak-W T20 WC: మైదానంలో ఆట కోసం మాత్రమే తాము పోటీ పడతామని.. ఒక్కసారి మ్యాచ్ పూర్తయి బయటకొస్తే తామంతా స్నేహితుల్లా సన్నిహితంగా ఉంటామని నిరూపిస్తున్నారు భారత్- పాక్ మహిళా క్రికెటర్లు.

FOLLOW US: 
Share:

 Ind-W vs Pak-W T20 WC:  భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే మైదానంలోనే కాదు బయటా ఉత్కంఠ, ఉద్వేగం హై పిచ్ లో ఉంటాయి. అది పురుషుల మ్యాచ్ అయినా.. మహిళల మ్యాచ్ అయినా గ్రౌండ్ లో క్రికెటర్లు విజయం కోసం పోరాడతాయి. అయితే తమ మధ్య పోటీ మైదానంలో మాత్రమే.. బయట మేమంతా స్నేహితులం అని తరచూ ఆటగాళ్లు చెప్తూ ఉంటారు. మరోసారి అది నిజమే అని భారత్- పాక్ మహిళా క్రికెటర్లు నిరూపించారు. 

మైదానంలో ఆట కోసం మాత్రమే తాము పోటీ పడతామని.. ఒక్కసారి మ్యాచ్ పూర్తయి బయటకొస్తే తామంతా స్నేహితుల్లా సన్నిహితంగా ఉంటామని నిరూపిస్తున్నారు భారత్- పాక్ మహిళా క్రికెటర్లు. నిన్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా దాయాదుల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పాకిస్థాన్ 149 పరుగులు చేయగా.. 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే మ్యాచ్ అనంతరం ఇరు దేశాల క్రికెటర్ల మధ్య జరిగిన సంభాషణలు, సెల్ఫీలు, ముచ్చట్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. 

సెల్ఫీలు, జోకులు

మ్యాచ్ అనంతరం భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల మధ్య కనిపించిన స్నేహపూర్వక వాతావరణం అందరినీ ఆకట్టుకుంటోంది. మ్యాచ్ పూర్తయ్యాక ఇరు దేశాల ఆటగాళ్లు కొందరు సెల్ఫీలు దిగుతూ కనిపించారు. మరికొందరు ముచ్చట్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. మైదానంలో ఈ రెండు దేశాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ బయట వారు ఒకరి కంపెనీని మరొకరు ఆస్వాదిస్తూ కనిపించడం వారి మధ్య బంధాన్ని సూచిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను పాక్ క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ లో పంచుకుంది. మరింకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి. 

పాకిస్థాన్ మహిళల తుది జట్టు

జవేరియా ఖాన్, మునీబా అలీ(వికెట్ కీపర్), బిస్మాహ్ మరూఫ్(కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమాన్ అన్వర్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్

భారత మహిళల తుది జట్టు

షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.

ఒక ఓవర్లో 7 బంతులు

భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టీ20లో ఒక పొరపాటు జరిగింది. భారత ఛేదనలో ఏడో ఓవర్లో పాక్ బౌలర్ నిదాదర్‌ 7 బంతులు వేసింది. అందులో ఒక్కటి కూడా వైడ్‌, నోబాల్‌ లాంటి ఎక్స్‌ట్రాల్లేవు. అయినప్పటికీ అదనంగా మరో బంతి వేయడం చర్చనీయాంశం అయింది. ఓవర్లో బౌలర్‌ వేసిన బంతులను అంపైర్‌ సరిగ్గా లెక్క పెట్టకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ ఎక్స్ ట్రా బంతికి జెమీమీ రోడ్రిగ్స్ ఫోర్ కొట్టింది.

Published at : 13 Feb 2023 01:23 PM (IST) Tags: INDW Vs PAKW Womens T20 WC 2023 INDW vs PAKW wc 2023 Indian Womens Cricket Team Pakistan Womens Cricket team

సంబంధిత కథనాలు

సిక్స్‌ బాదితే బ్యాట్‌తో కొడతానని సచిన్ వార్నింగ్ ఇచ్చాడు- వీరూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సిక్స్‌ బాదితే బ్యాట్‌తో కొడతానని సచిన్ వార్నింగ్ ఇచ్చాడు- వీరూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Asia Cup: మోడీ గారూ, టీమిండియాను పాకిస్థాన్ పంపించండి అని అడుగుతా : అఫ్రిది

Asia Cup: మోడీ గారూ, టీమిండియాను పాకిస్థాన్ పంపించండి అని అడుగుతా : అఫ్రిది

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!

MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!

MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

టాప్ స్టోరీస్

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్