అన్వేషించండి

Ind vs Eng 4th Test: ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్న ఆ నలుగురు.. మాంచెస్టర్ టెస్టులో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన టీమిండియా

Manchester match draw | భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మాంచెస్టర్ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఓడిపోయే పరిస్థితి నుంచి భారత బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్, అజేయ శతకాలతో డ్రాగా ముగించారు.

IND vs ENG Manchester Test Result: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెండు రోజుల ముందు భారత జట్టు ఓటమి ఖాయమనిపించింది. సిరీస్ 3-1 అవుతుందని మ్యాచ్ చేజారిపోతున్నట్లు కనిపించింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్  అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అంతా అనుకున్నట్లుగానే చాలా కాలం కిందటి నాటింగ్ హాట్ టెస్టు స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించారు. దాంతో ఓడిపోయే మ్యాచ్‌ను టీమ్ ఇండియా డ్రాగా ముగించింది. నాలుగో టెస్టులో భారత్ ఓటమి గండం గట్టెక్కి సగర్వంగా నిలిచిందంటే ఆ నలుగురే కారణం. వారు ఈ మ్యాచ్‌ను ఎలా మార్చారో తెలుసుకుందాం.

1- భారత్ 358 పరుగులకు ఆలౌట్

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ అర్ధ సెంచరీలతో 358 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ కూడా 46 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్ కాస్త పోరాడటంతో భారత్ 300 స్కోర్ చేయగలిగింది.

2- ఇంగ్లండ్ భారీ లక్ష్యం

ఓపెనింగ్ బ్యాటర్లు బెన్ డకెట్ 94 పరుగులు, జాక్ క్రాలీ 84 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత జో రూట్ 150 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ 141 పరుగులతో శతకాలు చేయడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ అవసరమా అనే స్థితికి చేరుకుంది. ఇంగ్లాండ్ మూడో రోజు, నాలుగోరోజు ఆటలో 669 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ సాధించింది.

3- భారత్ ఓటమి దాదాపు ఖాయం

నాలుగో రోజు ఆటలో భారత్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. టీమిండియా ఒక్క పరుగు కూడా చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఖాతా తెరవకుండానే క్రిస్ వోక్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ అవుట్ కావడంతో భారత్ 311 పరుగుల స్కోరు చేస్తుందా అనిపించింది. ఒకవేళ ఈ స్కోర్ చేసినా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ చేయడానికి స్కోరు కూడా లేదు. 

4- గిల్-రాహుల్ క్లాస్ బ్యాటింగ్

జైస్వాల్, సాయి సుదర్శన్ అవుటయ్యాక కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా అడ్డు గోడలా నిలబడ్డారు. మరోవైపు పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ నిలబెట్టారు. నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఆధిక్యం కేవలం 137 పరుగులకు పరిమితం చేశారు. ఇంగ్లండ్ గెలవాలంటే చివరి రోజు 8 వికెట్లు తీయాలి. వాస్తవానికి అది పెద్ద విషయం కాదు. కానీ గిల్ సెంచరీ, రాహుల్ 90 స్కోరుతో భారత్ కొంచెం పటిష్టంగా కనిపించింది. అదే ఊపుతో వికెట్లు ఇవ్వకుండా మ్యాచ్ ను డ్రా చేసే దిశగా బ్యాటింగ్ చేశారు. .

5- జడేజా- సుందర్ విలువైన భాగస్వామ్యం

మ్యాచ్ ఐదవ రోజున కెఎల్ రాహుల్ 90 పరుగులకు అవుట్ అయ్యాడు. తర్వాత సెంచరీ హీరో గిల్ 103 పరుగుల వద్ద ఔటయ్యాడు. గాయంతో ఉన్న పంత్ బదులుగా వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. రవీంద్ర జడేజా, సుందర్ ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ కొనసాగించారు. రవీంద్ర జడేజా 107 పరుగులు, సుందర్ 101 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఓడిపోయే మ్యాచ్ డ్రా చేశారు. మూడో టెస్టులో విజయానికి చేరువైన సమయంలో భారత్ ఆలౌటైంది. ఈసారి అలాంటి తప్పిదాలు చేయకుండా వికెట్లు కాపాడుకుంటూ పరుగులు సాధించారు. వీరి సెంచరీలు అడ్డుకునేందుకు చివర్లో బెన్ స్టోక్స్ షేక్ హ్యాండ్ ఇచ్చినా డ్రా చేసుకోవడానికి జడేజా, సుందర్ నిరాకరించారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి టెస్టు మ్యాచ్ ను వీక్షించేలా చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget