అన్వేషించండి

IND vs ENG Lords Test: లార్డ్స్‌లో భారత్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు; ఎవరెవరు బాధ్యులో తెలుసా?

IND vs ENG Lords Test: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో గిల్ సహా ఆటగాళ్ల చాలా అగ్రెసివ్‌గా ఆడినా ఫలితం మారలేదు.

England Defeat India At Lord's: లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఓడిపోయింది. మూడో టెస్ట్ మ్యాచ్‌ని 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. రవీంద్ర జడేజా చివరి వరకు భారత్ తరపున పోరాడాడు. బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. జడేజా కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో కలిసి బ్యాటింగ్ చేసి భారత్ స్కోరును 71 నుంచి 170కి చేర్చాడు. కానీ చివరికి టీమ్ ఇండియా ఓడిపోయింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమికి 5 కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

Image

జైస్వాల్ ఆడలేదు
భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ లార్డ్స్ టెస్ట్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 8 బంతుల్లో 13 పరుగులు చేశాడు. జైస్వాల్ ఈ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు కొట్టాడు, కానీ వేగంగా పరుగులు చేసే క్రమంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. అదే సమయంలో, రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి ఖాతా తెరవకుండానే మరోసారి ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జైస్వాల్ అవుట్ కావడంతో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెరిగింది.

Image

నెంబర్ 3లో కరుణ్ నాయర్ సెట్ కాలేదు
కరుణ్ నాయర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో విజయవంతం కాలేకపోతున్నాడు. కరుణ్ సెట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే వికెట్ కోల్పోతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ 62 బంతుల్లో 40 పరుగులు చేశాడు, కానీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. అదే సమయంలో, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఈ ఆటగాడి నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తుండగా, కరుణ్ 14 పరుగులకే వికెట్ కోల్పోయాడు. కరుణ్ ఇప్పటివరకు మూడు టెస్టుల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు.

భారత టాప్ ఆర్డర్ ఫెయిల్
లార్డ్స్‌లో భారత్ ఓటమికి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లే కారణం. కేఎల్ రాహుల్ మినహా మరే ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేయలేదు. జైస్వాల్, కరుణ్‌లతోపాటు ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తేలిపోయాడు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. గిల్ గత రెండు టెస్టుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, కానీ ఈ మ్యాచ్‌లో గిల్ దూకుడు మాత్రమే కనిపించింది, బ్యాట్‌తో పరుగులు రాలేదు.

IND vs ENG Lords Test: లార్డ్స్‌లో భారత్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు; ఎవరెవరు బాధ్యులో తెలుసా?

నాల్గో రోజే భారత్ ఓడిపోయింది
భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ మ్యాచ్ ఐదో రోజు వరకు కొనసాగింది. కానీ లార్డ్స్‌లో భారత్ ఓటమి కథ నాల్గో రోజే ఖరారు అయిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాప్ ఆర్డర్ వికెట్లు త్వరగా పడిపోవడంతో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెరిగింది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది.

Image

లంచ్ కంటే ముందు భారత్ వికెట్లు కోల్పోతోంది
భారత్ మూడు టెస్టుల్లో ఒకే తప్పు చేస్తోంది. భారత్ లంచ్ బ్రేక్‌కు ముందు ప్రతిసారీ వికెట్లు కోల్పోయింది. ఇది ఇంగ్లండ్‌కు ఊపునిస్తోంది. అదే ఊపుతో మ్యాచ్ గెలవడానికి మరింత శక్తిని కూడగట్టుకుంటోంది.  

    • మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున లంచ్ కంటే ముందు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్ రెండో రోజున గిల్, నాయర్, పంత్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు కోల్పోయారు.
    • ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో కూడా ఇదే జరిగింది. మొదటి రోజు లంచ్ కంటే ముందు కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయాడు. అదే సమయంలో, రెండో రోజు రవీంద్ర జడేజా తన వికెట్ కోల్పోయాడు.
    • లార్డ్స్ టెస్ట్‌లో కూడా భారత్ ఇదే తప్పు చేసింది. ఈ టెస్ట్ మూడో రోజున లంచ్ కంటే ముందు రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. అదే సమయంలో, రెండో ఇన్నింగ్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి లంచ్ చేయడానికి కొద్దిసేపటి ముందు చివరి బంతికి తన వికెట్ కోల్పోయాడు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget