Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవన్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ
మాంచెస్టర్లో జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ లో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను తిరిగా తీసుకువచ్చింది.

England Name Playing XI For Manchester T20I: ఇండియాతో శనివారం మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీమ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ లో రెండు మేజర్ చేంజెస్ అనౌన్స్ చేసింది. స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ టీమ్లోకి కంబ్యాక్ ఇవ్వగా, యంగ్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ ఈ మ్యాచ్ తో తన టీ20 ఇంటర్నేషనల్ డెబ్యూ చేయబోతున్నాడు. వర్షం వల్ల రద్దయిన ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్ లపై ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ వేటు వేసి ఈ ఇద్దరినీ లైన్ లోకి తెచ్చింది. ఆల్రెడీ టెస్టులు, వన్డేల్లో ఇంగ్లాండ్ను రిప్రెజెంట్ చేసిన జోష్ టంగ్, ఇప్పుడు ఫస్ట్ టైమ్ పొట్టి ఫార్మాట్ లో అడుగుపెడుతున్నాడు. ఆర్చర్ రీఎంట్రీతో హోస్ట్ టీమ్ ఇంగ్లాండ్ తమ పేస్ అటాక్ ను నెక్స్ట్ లెవెల్ కు స్ట్రాంగ్ చేసుకుంది. ఫైవ్-మ్యాచ్ సిరీస్ లో లీడ్ సాధించడమే టార్గెట్ గా ఇంగ్లాండ్ ఈ ప్లాన్ వేసింది.
England have their Playing XI ready for the second T20I against India, with two changes made from the last one
— the_cricket_web (@the_cricket_web) July 3, 2026
➡️ Jofra Archer & Josh Tongue are IN
⬅️ Saqib Mahmood & Luke Wood are OUT@englandcricket #HarryBrook #ENGvIND #CricketX pic.twitter.com/du6zXCuSSY
ఫస్ట్ టీ20 మ్యాచ్ వాషౌట్..
బుధవారం చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ వర్షం వల్ల కంప్లీట్గా వాషౌట్ అయింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 189/7 భారీ స్కోర్ బోర్డ్ సెట్ చేసింది. అయితే ఇండియా ఇన్నింగ్స్ ఎండ్ అయిన వెంటనే పడిన భారీ వర్షం కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కనీసం స్టార్ట్ కూడా కాలేదు. అంపైర్లు, ప్లేయర్లు కట్-ఆఫ్ టైమ్ వరకు వెయిట్ చేసి కనీసం 5-ఓవర్ల మ్యాచ్ కండక్ట్ చేయాలని చూసినా వరుణుడు అస్సలు తగ్గలేదు. దీంతో మ్యాచ్ ను ఎలాంటి రిజల్ట్ లేకుండానే రద్దు చేస్తున్నట్లు అంపైర్లు డిక్లేర్ చేశారు.
Read Also: Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై రగడ..బీసీసీఐ క్లారిటీ ఇదే!
అభిషేక్ శర్మ మైండ్ బ్లాకింగ్ రికార్డ్..
ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్లు సూపర్ పర్ఫార్మెన్స్ తో మెరిశారు. ఓపెనర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఫస్ట్ రెండు ఓవర్లలోనే అవుట్ అయి షాక్ ఇచ్చినా, అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ల అగ్రెసివ్ పార్ట్నర్షిప్ ఇండియాను కాపాడింది. అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 59 రన్స్ తో విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ కొట్టిన ఇండియన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లోనే కేవలం 785 బంతుల్లోనే టీ20 ఇంటర్నేషనల్స్ లో 100 సిక్సర్లు బాదిన వరల్డ్ ఫాస్టెస్ట్ బ్యాటర్గా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. గతంలో వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ (789 బంతులు) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 రన్స్ తో యాంకర్ ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్ గా ఫస్ట్ హాఫ్ సెంచరీ రిజిస్టర్ చేశాడు.
మాంచెస్టర్ మ్యాచ్ పైనే అందరి కళ్లు
ఇన్నింగ్స్ లాస్ట్ లో శివం దూబే కేవలం 21 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 42 రన్స్ తో నాటౌట్ గా నిలిచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. లాస్ట్ 5 ఓవర్లలో ఇండియా ఏకంగా 54 రన్స్ యాడ్ చేసి 189 రన్స్ మార్క్ అందుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మహమూద్ 3 వికెట్లతో ఇంప్రెస్ చేయగా, సామ్ కరన్ ఒక వికెట్ తీసి లాస్ట్ బాల్ లో అక్షర్ పటేల్ ను రనౌట్ చేశాడు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్ లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్ ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు



















