అన్వేషించండి

Duleep Trophy Highlights: బ్యాట్ ఝులిపించిన తిలక్ వర్మ, ప్రతమ్‌ సింగ్‌ - ఇండియా డి ముందు బిగ్ టార్గెట్

Duleep Trophy 2024 News | అనంతపురం కేంద్రంగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ లో ఇండియా ఏ బ్యాటర్లు తిలక్ వర్మ, ప్రతమ్ సింగ్ శతకాలు బాదడంతో ఇండియా డి టీమ్ కు భారీ లక్ష్యాన్ని ఇచ్చారు.

Duleep Trophy News | అనంతపురం: దులీప్‌ ట్రోఫీలో భాగంగా అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌లో జరుగుతున్న ఇండియా -ఏ, ఇండియా -డీ మ్యాచ్‌లో శనివారం ఇండియా -డీ జట్టు బ్యాటర్లు ప్రతమ్‌ సింగ్, తిలక్‌వర్మ సూపర్‌ సెంచరీలు చేశారు. దీంతో ఇండియా -ఏ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఇండియా- సీ, బీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా -బీ జట్టు బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఇండియా బీ జట్టు ఎదురీదుతోంది. ఇండియా సీ బౌలర్‌ అన్షుల్‌ 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 

 ఇండియా -డీ లక్ష్యం 380/3: 

ముడో రోజు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 115/1తో ప్రారంభించిన ఇండియా ఏ జట్టు 98 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 380 పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేసింది. జట్టులో ప్రతమ్‌ సింగ్, తిలక్‌వర్మ సెంచరీలతో అదరగొట్టారు. ప్రతమ్‌ సింగ్‌ 189 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సహాయంతో 122, తిలక్‌ వర్మ(నాటౌట్‌) 193 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 111 పరుగులు చేశారు. మరో బ్యాట్స్‌మెన్‌ శాశ్వత్‌ రావత్‌ 88 బంతుల్లో 64 (7 ఫోర్లు)అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇండియా డీ జట్టు బౌలర్లలో సౌరభ్‌కుమార్‌ రెండు, శ్రేయస్‌ అయ్యర్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ఇండియా ఏ జట్టు..ఇండియా డీ జట్టు ముందు 488 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా ఆటముగిసే సమయానికి ఇండియా డీ జట్టు 19 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 62 పరుగులు చేసింది. జట్టులో యష్‌ దుబే 15, రికీ బుయీ 44 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అతర్వ  డకౌట్‌ అయ్యాడు. ఇండియా ఏ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. 


Duleep Trophy Highlights: బ్యాట్ ఝులిపించిన తిలక్ వర్మ, ప్రతమ్‌ సింగ్‌ - ఇండియా డి ముందు బిగ్ టార్గెట్

అన్షుల్ కాంబోజ్ 5 వికెట్లు

 అభిమన్యు మెరుపు సెంచరీ: 

ఇండియా -సీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా- బీ కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన ఈశ్వరన్‌ చూడచక్కని షాట్లతో అలరించాడు. 262 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌ సహాయంతో 143 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్‌ నారాయణ్‌ జగదీషన్‌ 70 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా రాణించలేదు. ఇండియా సీ బౌలర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ 5 వికెట్లు తీసుకుని, ఇండియా బీ జట్టును కట్టడి చేశాడు. ఆటముగిసే సమయానికి ఇండియా బీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ఇండియా సీ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 525 పరుగులు చేసింది.

Also Read: Shreyas Iyer Sunglasses: సన్ గ్లాసెస్‌తో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ - ట్రోల్స్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Embed widget