అన్వేషించండి

Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !

Six Andhra MLCs:తమ రాజీనామాలు ఆమోదించాలని ఆరుకు ఎమ్మెల్సీలు ఏపీ శాసనమండలి ఛైర్మన్ ను కలిశారు. తాము స్వచ్చందంగా రాజీనామా చేశామని అంగీకరించాలన్నారు.

AP Legislative Council Chairman: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆరుగురు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశం అయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు.  కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం, పోతుల సునీతలు శాసనమండలి చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.  ఈ ఆరుగురు మాజీ వైసీపీ ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా హాజరై, వివరణాత్మకంగా తమ వాదనలు వినిపించారు. చైర్మన్ మోషేన్ రాజు వారిని ఒక్కొక్కరిగా పిలిచి విడివిడిగా మాట్లాడారు. రాజీనామా లేఖలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

వైసీపీ 2024 ఎన్నికల్లో చెలరేగిన పరాజయం తర్వాత, పార్టీలో అసంతృప్తి మొదలైంది. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు 2024-2025 మధ్య కాలంలోనే తమ రాజీనామాలు సమర్పించారు. పార్టీ నిర్వహణలో అసంతృప్తి, వ్యక్తిగత కారణాలు, TDP-BJP-JSP కూటమి వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో వారు రాజీనా ఇచ్చారు.  చైర్మన్ మోషేన్ రాజు  ఈ రాజీనామాలను ఆమోదించలేదు.  తమ రాజీనామాలు ఆమోదించడం లేదని.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెల్లారు. నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చైర్మన్ మోషేన్ రాజుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం అక్రమం, ఏకపక్షపాతం, ప్రక్రియల దుర్వినియోగం గా హైకోర్టు భావించింది.   మండలి చైర్మన్‌కు 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఈ ఆదేశాలతో ఆరుగురు ఎమ్మెల్సీలు సోమవారం విజయవాడలోని మండలి కార్యాలయంలో చైర్మన్‌ను కలిశారు. వారు వ్యక్తిగతంగా హాజరై, రాజీనామాలు ఆమోదించాలన్నారు.   చైర్మన్ మోషేన్ రాజు హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికి కూటమి పార్టీల్లో చేరిపోయారు. పోతుల సునీత, జకియా ఖానం బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ,  బల్లి కల్యాణ చక్రవర్తి టీడీపీలో చేరారు. 

వీరి రాజీనామాలు ఆమోదిస్తే.. ఆరు స్థానాలు ఖాళీ అవుతాయి. వాటికి ఉపఎన్నికలు వస్తే వైసీపీ ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. సభలో బలం లేదనందున అన్ని సీట్లు మళ్లీ కూటమి గెలిచే అవకాశం ఉంది. అందుకే వైసీపీకి చెందిన శానసమండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించేదుకు ఆలస్యం చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  

ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది.  అధికారం పోయిన తరవాత చాలా మంది పార్టీ మారిపోతున్నారు. వీరి రాజీనామాలు ఆమోదిస్తే .. ఆ ఖాళీలు మళ్లీ కూటమి ఖాతాలో పడిపోతాయి. అందుకే రాజీనామాలు ఆమోదం విషయంలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ ఆరుగురివి ఆమోదిస్తే.. మరికొంత మంది రాజీనామా చేస్తారని.. దీంతో మండలిలో వైసీపీ మెజార్టీ కోల్పోతుందన్న భావన తో ఆలస్యం చేస్తున్నారని భావిసత్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలతో ..  ఇప్పుడు రాజీనామాలపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Medaram Jatara: మేడారంలో వనదేవతల్ని దర్శించుకున్న న్యూజిలాండ్ గిరిజన తెగ, ఆకట్టుకున్న హాకా నృత్యం
మేడారంలో వనదేవతల్ని దర్శించుకున్న న్యూజిలాండ్ గిరిజన తెగ, ఆకట్టుకున్న హాకా నృత్యం
Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో రిపబ్లిక్ డే నాటకం - రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ ఆగ్రహం
తెలంగాణ భవన్‌లో రిపబ్లిక్ డే నాటకం - రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ ఆగ్రహం
Revanth Reddy Harvard: హార్వార్డ్ క్లాసులకు విద్యార్తిగా హాజరవుతున్న తెలంగాణ సీఎం - గడ్డకట్టే చలిలోనూ లీడర్‌షిప్ కోర్సు
హార్వార్డ్ క్లాసులకు విద్యార్తిగా హాజరవుతున్న తెలంగాణ సీఎం - గడ్డకట్టే చలిలోనూ లీడర్‌షిప్ కోర్సు
MSVPG Collections : 350 కోట్ల క్లబ్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' - ఈ జర్నీ మామూలుగా లేదు... స్పెషల్ వీడియో వైరల్
350 కోట్ల క్లబ్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' - ఈ జర్నీ మామూలుగా లేదు... స్పెషల్ వీడియో వైరల్
Advertisement

వీడియోలు

RANABAALI Decode | Vijay Deverakonda Rashmika తో Rahul Sankrityan పీరియాడికల్ డ్రామా | ABP Desam
India vs New Zealand 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Ind vs NZ 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Abhishek Sharma Records Ind vs NZ T20 | అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్
Sanju Samson Ind vs NZ T20 | వరుసగా విఫలమవుతున్న సంజు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medaram Jatara: మేడారంలో వనదేవతల్ని దర్శించుకున్న న్యూజిలాండ్ గిరిజన తెగ, ఆకట్టుకున్న హాకా నృత్యం
మేడారంలో వనదేవతల్ని దర్శించుకున్న న్యూజిలాండ్ గిరిజన తెగ, ఆకట్టుకున్న హాకా నృత్యం
Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో రిపబ్లిక్ డే నాటకం - రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ ఆగ్రహం
తెలంగాణ భవన్‌లో రిపబ్లిక్ డే నాటకం - రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ ఆగ్రహం
Revanth Reddy Harvard: హార్వార్డ్ క్లాసులకు విద్యార్తిగా హాజరవుతున్న తెలంగాణ సీఎం - గడ్డకట్టే చలిలోనూ లీడర్‌షిప్ కోర్సు
హార్వార్డ్ క్లాసులకు విద్యార్తిగా హాజరవుతున్న తెలంగాణ సీఎం - గడ్డకట్టే చలిలోనూ లీడర్‌షిప్ కోర్సు
MSVPG Collections : 350 కోట్ల క్లబ్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' - ఈ జర్నీ మామూలుగా లేదు... స్పెషల్ వీడియో వైరల్
350 కోట్ల క్లబ్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' - ఈ జర్నీ మామూలుగా లేదు... స్పెషల్ వీడియో వైరల్
Tina Dabi: జాతీయ జెండాకు రివర్స్ లో వందనం - సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన టీనా దాబి !
జాతీయ జెండాకు రివర్స్ లో వందనం - సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన టీనా దాబి !
T20 World Cup 2026 కోసం 15 మందితో జట్టును ప్రకటించిన వెస్టిండీస్, బిగ్ హిట్టర్స్‌కు ఛాన్స్
T20 World Cup 2026 కోసం 15 మందితో జట్టును ప్రకటించిన వెస్టిండీస్, బిగ్ హిట్టర్స్‌కు ఛాన్స్
Hyderabad Crime News: చైనా మాంజా మెడకు చుట్టుకుని బాలిక మృతి, హైదరాబాద్‌లో విషాదం
చైనా మాంజా మెడకు చుట్టుకుని బాలిక మృతి, హైదరాబాద్‌లో విషాదం
AIS Couple: ఆలిండియా సర్వీస్ అధికారుల ఆదర్శ వివాహం - సంతకాలతో సింపుల్‌గా ఒక్కటయ్యారు!
ఆలిండియా సర్వీస్ అధికారుల ఆదర్శ వివాహం - సంతకాలతో సింపుల్‌గా ఒక్కటయ్యారు!
Embed widget