అన్వేషించండి

Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !

Six Andhra MLCs:తమ రాజీనామాలు ఆమోదించాలని ఆరుకు ఎమ్మెల్సీలు ఏపీ శాసనమండలి ఛైర్మన్ ను కలిశారు. తాము స్వచ్చందంగా రాజీనామా చేశామని అంగీకరించాలన్నారు.

AP Legislative Council Chairman: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆరుగురు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశం అయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు.  కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం, పోతుల సునీతలు శాసనమండలి చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.  ఈ ఆరుగురు మాజీ వైసీపీ ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా హాజరై, వివరణాత్మకంగా తమ వాదనలు వినిపించారు. చైర్మన్ మోషేన్ రాజు వారిని ఒక్కొక్కరిగా పిలిచి విడివిడిగా మాట్లాడారు. రాజీనామా లేఖలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

వైసీపీ 2024 ఎన్నికల్లో చెలరేగిన పరాజయం తర్వాత, పార్టీలో అసంతృప్తి మొదలైంది. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు 2024-2025 మధ్య కాలంలోనే తమ రాజీనామాలు సమర్పించారు. పార్టీ నిర్వహణలో అసంతృప్తి, వ్యక్తిగత కారణాలు, TDP-BJP-JSP కూటమి వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో వారు రాజీనా ఇచ్చారు.  చైర్మన్ మోషేన్ రాజు  ఈ రాజీనామాలను ఆమోదించలేదు.  తమ రాజీనామాలు ఆమోదించడం లేదని.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెల్లారు. నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చైర్మన్ మోషేన్ రాజుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం అక్రమం, ఏకపక్షపాతం, ప్రక్రియల దుర్వినియోగం గా హైకోర్టు భావించింది.   మండలి చైర్మన్‌కు 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఈ ఆదేశాలతో ఆరుగురు ఎమ్మెల్సీలు సోమవారం విజయవాడలోని మండలి కార్యాలయంలో చైర్మన్‌ను కలిశారు. వారు వ్యక్తిగతంగా హాజరై, రాజీనామాలు ఆమోదించాలన్నారు.   చైర్మన్ మోషేన్ రాజు హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికి కూటమి పార్టీల్లో చేరిపోయారు. పోతుల సునీత, జకియా ఖానం బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ,  బల్లి కల్యాణ చక్రవర్తి టీడీపీలో చేరారు. 

వీరి రాజీనామాలు ఆమోదిస్తే.. ఆరు స్థానాలు ఖాళీ అవుతాయి. వాటికి ఉపఎన్నికలు వస్తే వైసీపీ ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. సభలో బలం లేదనందున అన్ని సీట్లు మళ్లీ కూటమి గెలిచే అవకాశం ఉంది. అందుకే వైసీపీకి చెందిన శానసమండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించేదుకు ఆలస్యం చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  

ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది.  అధికారం పోయిన తరవాత చాలా మంది పార్టీ మారిపోతున్నారు. వీరి రాజీనామాలు ఆమోదిస్తే .. ఆ ఖాళీలు మళ్లీ కూటమి ఖాతాలో పడిపోతాయి. అందుకే రాజీనామాలు ఆమోదం విషయంలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ ఆరుగురివి ఆమోదిస్తే.. మరికొంత మంది రాజీనామా చేస్తారని.. దీంతో మండలిలో వైసీపీ మెజార్టీ కోల్పోతుందన్న భావన తో ఆలస్యం చేస్తున్నారని భావిసత్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలతో ..  ఇప్పుడు రాజీనామాలపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project Name: పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుకు జనసేన పట్టు - టీడీపీ, బీజేపీ ఏమనుకుంటున్నాయి?
పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుకు జనసేన పట్టు - టీడీపీ, బీజేపీ ఏమనుకుంటున్నాయి?
Aadhaar PAN Linking Deadline: నేటితో ముగియనున్న డెడ్‌లైన్.. ఆధార్, PAN లింక్ చేయకపోతే ఈ ఇబ్బందులు తప్పవు
నేటితో ముగియనున్న డెడ్‌లైన్.. ఆధార్, PAN లింక్ చేయకపోతే ఈ ఇబ్బందులు తప్పవు
Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Advertisement

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project Name: పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుకు జనసేన పట్టు - టీడీపీ, బీజేపీ ఏమనుకుంటున్నాయి?
పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుకు జనసేన పట్టు - టీడీపీ, బీజేపీ ఏమనుకుంటున్నాయి?
Aadhaar PAN Linking Deadline: నేటితో ముగియనున్న డెడ్‌లైన్.. ఆధార్, PAN లింక్ చేయకపోతే ఈ ఇబ్బందులు తప్పవు
నేటితో ముగియనున్న డెడ్‌లైన్.. ఆధార్, PAN లింక్ చేయకపోతే ఈ ఇబ్బందులు తప్పవు
Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Toll free travel: విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Mega Victory Mass Song Lyrics : మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
Embed widget