అన్వేషించండి

Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !

Six Andhra MLCs:తమ రాజీనామాలు ఆమోదించాలని ఆరుకు ఎమ్మెల్సీలు ఏపీ శాసనమండలి ఛైర్మన్ ను కలిశారు. తాము స్వచ్చందంగా రాజీనామా చేశామని అంగీకరించాలన్నారు.

AP Legislative Council Chairman: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆరుగురు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశం అయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు.  కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం, పోతుల సునీతలు శాసనమండలి చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.  ఈ ఆరుగురు మాజీ వైసీపీ ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా హాజరై, వివరణాత్మకంగా తమ వాదనలు వినిపించారు. చైర్మన్ మోషేన్ రాజు వారిని ఒక్కొక్కరిగా పిలిచి విడివిడిగా మాట్లాడారు. రాజీనామా లేఖలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

వైసీపీ 2024 ఎన్నికల్లో చెలరేగిన పరాజయం తర్వాత, పార్టీలో అసంతృప్తి మొదలైంది. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు 2024-2025 మధ్య కాలంలోనే తమ రాజీనామాలు సమర్పించారు. పార్టీ నిర్వహణలో అసంతృప్తి, వ్యక్తిగత కారణాలు, TDP-BJP-JSP కూటమి వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో వారు రాజీనా ఇచ్చారు.  చైర్మన్ మోషేన్ రాజు  ఈ రాజీనామాలను ఆమోదించలేదు.  తమ రాజీనామాలు ఆమోదించడం లేదని.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెల్లారు. నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చైర్మన్ మోషేన్ రాజుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం అక్రమం, ఏకపక్షపాతం, ప్రక్రియల దుర్వినియోగం గా హైకోర్టు భావించింది.   మండలి చైర్మన్‌కు 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఈ ఆదేశాలతో ఆరుగురు ఎమ్మెల్సీలు సోమవారం విజయవాడలోని మండలి కార్యాలయంలో చైర్మన్‌ను కలిశారు. వారు వ్యక్తిగతంగా హాజరై, రాజీనామాలు ఆమోదించాలన్నారు.   చైర్మన్ మోషేన్ రాజు హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికి కూటమి పార్టీల్లో చేరిపోయారు. పోతుల సునీత, జకియా ఖానం బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ,  బల్లి కల్యాణ చక్రవర్తి టీడీపీలో చేరారు. 

వీరి రాజీనామాలు ఆమోదిస్తే.. ఆరు స్థానాలు ఖాళీ అవుతాయి. వాటికి ఉపఎన్నికలు వస్తే వైసీపీ ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. సభలో బలం లేదనందున అన్ని సీట్లు మళ్లీ కూటమి గెలిచే అవకాశం ఉంది. అందుకే వైసీపీకి చెందిన శానసమండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించేదుకు ఆలస్యం చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  

ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది.  అధికారం పోయిన తరవాత చాలా మంది పార్టీ మారిపోతున్నారు. వీరి రాజీనామాలు ఆమోదిస్తే .. ఆ ఖాళీలు మళ్లీ కూటమి ఖాతాలో పడిపోతాయి. అందుకే రాజీనామాలు ఆమోదం విషయంలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ ఆరుగురివి ఆమోదిస్తే.. మరికొంత మంది రాజీనామా చేస్తారని.. దీంతో మండలిలో వైసీపీ మెజార్టీ కోల్పోతుందన్న భావన తో ఆలస్యం చేస్తున్నారని భావిసత్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలతో ..  ఇప్పుడు రాజీనామాలపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
Advertisement

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
Embed widget