Harmanpreet Kaur Post Viral: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ కాదు.. వరల్డ్ కప్ ట్రోఫీతో హర్మన్ప్రీత్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీతో మొదటి పోస్ట్ షేర్ చేసింది. క్రికెట్ కేవలం జెంటిల్మెన్స్ గేమ్ కాదు అని రాసింది.

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ICC మహిళల వన్డే ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ సాధించిన తరువాత తన మొదటి సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ సంచలనం సృష్టించింది. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రపంచ కప్ విజేత కెప్టెన్గా నిలిచిన హర్మన్ ప్రీత్ ఈ పోస్ట్ కేవలం వేడుకలతో లేదు, ఇది అందరి దృష్టిని ఆకర్షించిన ఒక రహస్య సందేశంలా మారింది.
హర్మన్ప్రీత్ ఇన్స్టాగ్రామ్లో ట్రోఫీతో తన ఫోటోను షేర్ చేసింది. ఆమె ధరించిన టీషర్టుపై “క్రికెట్ కేవలం జెంటిల్మెన్ గేమ్ మాత్రమే కాదు” అని రాసి ఉంది. సాధారణంగా క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అని వ్యవహరిస్తారు. అయితే హర్మన్ టీషర్టుపై క్రికెట్ అందరి గేమ్ అని స్పష్టం చేసింది. అందుకోసం జెంటిల్మెన్ గేమ్ అనే పదాలను కొట్టివేస్తున్నట్లుగా ఆమె జెర్సీపై రాసి ఉంది. క్రికెట్ ఇప్పుడు కేవలం “పురుషుల ఆట” మాత్రమే కాదు, మహిళలది కూడా అని సందేశాన్ని ఇచ్చింది. మహిళా క్రికెటర్లు ఇప్పుడు క్రికెట్లో సమాన గౌరవం, గుర్తింపునకు అర్హులని హర్మన్ సందేశం స్పష్టంగా ఉంది.
మహిళా క్రికెట్ కొత్త గుర్తింపు
హర్మన్ప్రీత్ పోస్ట్ మహిళా క్రికెట్ మారుతున్న తీరును వివరిస్తుంది. చాలా సంవత్సరాలుగా క్రికెట్ను పురుషుల ఆట (జెంటిల్మెన్ గేమ్)గా చూశారు. కాని ఇప్పుడు భారత మహిళా జట్టు ఈ ఆట ఇకపై ‘పురుషుల’ది మాత్రమే కాదు, ‘మహిళల’ది కూడా అని నిరూపించేలా వన్డే వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. హర్మన్ చేసిన ఈ పోస్ట్ను లక్షలాది మంది లైక్ చేశారు. వేలాది మంది వ్యాఖ్యానించి ఆమె ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచనను ప్రశంసించారు.
View this post on Instagram
ఫైనల్లో భారత్ ఆధిపత్యం
ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా మీద భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన డే అండ్ నైట్ జరిగిన మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ 87 పరుగులు, స్మృతి మంధాన 45 పరుగులతో రాణించారు. మిడిలార్డర్ లో దీప్తి శర్మ విలువైన 58 పరుగులు, రిచా ఘోష్ 24 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. టార్గెట్ ఛేదనలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ సాధించింది. ఆ జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఐదు దశాబ్దాల వరల్డ్ కప్ కల నెరవేరడంతో మహిళల క్రికెట్లో కొత్త జోష్ కనిపిస్తోంది.
Before You Go
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు




















