అన్వేషించండి

Asia Cup 2023 Date: ఆగస్టు 31 నుంచి ఆసియాకప్‌ - హైబ్రీడ్‌కు ఏసీసీ ఓకే! ఇక భారత్‌ vs పాక్‌ సందడి!

Asia Cup 2023 Date: ఆసియాకప్‌ -2023కి మార్గం సుగమమైంది! మొత్తానికి సందిగ్ధం తొలగిపోయింది. టోర్నీని హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

Asia Cup 2023 Date: 

ఆసియాకప్‌ -2023కి మార్గం సుగమమైంది! మొత్తానికి సందిగ్ధం తొలగిపోయింది. టోర్నీని హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌, శ్రీలంక సంయుక్తంగా మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు మ్యాచులు జరుగుతాయి. పూర్తి స్థాయి షెడ్యూలు ఇంకా రూపొందించలేదు. మరికొన్ని రోజుల్లోనే విడుదల చేస్తారని సమాచారం.

వాస్తవంగా ఆసియాకప్‌ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరగాలి. కానీ టీమ్‌ఇండియా దాయాది దేశంలో అడుగు పెట్టబోదని బీసీసీఐ ఖరాకండీగా చెప్పేయడంతో హైబ్రీడి మోడల్‌కు మారింది. దీనికి ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అంగీకరించింది. మొత్తం 13 మ్యాచుల్లో 4 పాకిస్థాన్‌, మిగిలినవి శ్రీలంకలో జరుగుతాయి.

మొత్తానికి 2008 తర్వాత పాకిస్థాన్‌ రెండు కన్నా ఎక్కువ దేశాలు ఆడే టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. 'ఆసియాకప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించాలన్న మా ప్రతిపాదనను ఏసీసీ అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. అంటే ఈ టోర్నీకి పీసీబీ హోస్ట్‌గా ఉంటుందన్నమాట. కొన్ని మ్యాచులు పాక్‌లో మిగిలినవి శ్రీలంకలో జరుగుతాయి. టీమ్‌ఇండియా మా దేశానికి రాలేని పరిస్థితుల్లో ఉండటమే ఇందుకు కారణం' అని పీసీబీ చీఫ్ నజమ్‌ సేథీ అన్నారు.

'పదిహేను ఏళ్లలో తొలిసారి పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడుతుందని మా అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ బీసీసీఐ పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం. పీసీబీ మాదిరిగానే వారికీ సరిహద్దులు దాటేటప్పుడు ప్రభుత్వ అనుమతి అవసరం. నిర్వహణ, లాజిస్టిక్స్‌ పరంగా మేం ఏసీసీ, శ్రీలంక క్రికెట్‌ బోర్డుతో నిరంతరం టచ్‌లో ఉంటాం. ప్లానింగ్‌, ప్రిపరేషన్‌లో భాగం అవుతాం' అని నజమ్‌ సేథీ అన్నారు.

ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి. రెండు విభాగాల్లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు కలిసి సూపర్‌ 4 స్టేజ్‌లో తలపడతాయి. అందులో టాప్‌-2లో నిలిచిన టీమ్స్‌ ఫైనల్లో తలపడతాయి. అక్టోబర్‌-నవంబర్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉండటంతో టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. కాగా అన్నీ కలిసి వస్తే భారత్‌, పాకిస్థాన్‌ మళ్లీ మూడు సార్లు తలపడే అవకాశం ఉంటుంది. లీగ్‌ దశలో ఒకసారి, సూపర్‌-4లో రెండోసారి పోటీపడతాయి. ఒకవేళ సూపర్‌-4లో టాప్‌2లో రెండు జట్లూ నిలిస్తే ఫైనల్లో ఆడతాయి.

గతేడాది యూఏఈలో నిర్వహించిన ఆసియాకప్‌ను శ్రీలంక గెలిచింది. 20 ఓవర్ల ఫార్మాట్లో ఫైనల్లో టీమ్‌ఇండియాను ఓడించింది. 2018లోనూ యూఏఈలోనే వన్డే ఫార్మాట్లో జరగ్గా ఫైనల్లో బంగ్లాదేశ్‌ను భారత్‌ ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. 

హైబ్రీడ్‌ మోడల్‌ను బీసీసీఐ మొదటి నుంచీ నిరాకరిస్తోంది. ఒకవేళ అంగీకరిస్తే వన్డే ప్రపంచకప్‌ను ఇలాగే నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతుందని అనుమానించింది. అలాగే బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ సైతం హైబ్రీడ్‌ మోడల్‌ను వ్యతిరేకించాయి. కాగా కొన్ని మ్యాచుల్ని దుబాయ్‌లో పెట్టాలని పాక్ భావించగా బంగ్లా గట్టిగా వ్యతిరేకించింది. సెప్టెంబర్లో అక్కడి వాతావరణం అనువుగా ఉండదని అభ్యంతరం చెప్పింది.

రెండు వారాల క్రితం ఏసీసీ ఉపాధ్యక్షుడు, ఒమన్‌ క్రికెట్‌ అధినేత పంకజ్‌ ఖిమిజినీ పీసీబీ చీఫ్ నజమ్‌ సేథీ కలిశారు. హైబ్రీడ్‌ మోడల్‌ గురించి చర్చించారు. రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలతో టీమ్‌ఇండియా పాక్‌కు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారని తెలిపింది. వీరిద్దరూ ఒక పరిష్కారం కోస ప్రయత్నించారని సమాచారం. 'ఇప్పటికైతే భారత్‌ లేని మ్యాచుల్ని లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తారు. పాకిస్థాన్‌ vs నేపాల్‌, బంగ్లాదేశ్‌ vs అఫ్గానిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ vs శ్రీలంక, శ్రీలంక vs బంగ్లాదేశ్ మ్యాచులు అక్కడ ఉంటాయి. భారత్‌ vs పాకిస్థాన్‌, సూపర్‌ 4 మ్యాచులన్నీ పల్లెకెలె లేదా గాలెలో ఉంటాయి' అని ఏసీసీ వర్గాలు మీడియాకు తెలిపాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget