అన్వేషించండి

ఇది 9 సార్లు వరుసగా 9 రోజులు భక్తితో పారాయణం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయి

శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉంది. అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది.

Manidweepam: మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దారిద్యాలు దూర‌మ‌వుతాయని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడం వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాద‌ని ప్ర‌తీతి. శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉంది. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న మ‌ణిద్వీపం గురించి దేవీ భాగవతంలో వర్ణించారు.

మణిద్వీపం శ్రీ లలిత త్రిపుర సుందరి నివాసం. మణిద్వీపాన్ని శ్రీపురం / శ్రీనగరం అని కూడా అంటారు. దీనిని వేద వ్యాస మ‌హ‌ర్షి సుధా సముద్రం అని పిలవబడే అమృత మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపంగా వర్ణించారు. మణిద్వీప వర్ణన మణిద్వీపాన్ని వివరించే శక్తిమంతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠించనంత మాత్ర‌మే అద్భుతాలు జ‌రుగుతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. మణిద్వీప వర్ణనలోని 32 శ్లోకాలను రోజుకు 9 సార్లు, వరుసగా 9 రోజులు భక్తితో పారాయణం చేస్తే కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని విశ్వ‌సిస్తారు. అమ్మవారి నివాస స్థానమే మణిద్వీపం. ఈ మణిద్వీప వర్ణనను శ్రద్ధతో పారాయణం చేస్తే సకల జాతక దోషాలు తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచ బాధలుండవు. గృహ ప్రవేశం చేసేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు దీనిని ఇంట్లో పారాయణం చేయ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. ఇలా చేయ‌డం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. మనుషుల్లోని అశాంతి తొలగిపోతుంది. 

వేదవేదాంత గోష్ఠులు ఒకవైపు, వేణువీణా నాదాలు మరోవైపు, మనోహరమైన నాట్యవిన్యాసాలు ఇంకోవైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. స్వర్ణమణిమయ ఖచితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో, శ్రీ చక్రం మధ్యలో, రక్తవస్త్రాలను, ఎరుపురంగులో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి, మంగళాకరమైన పర్యంకంపై భువనేశ్వరీమాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువుదీరి ఉంటుంది. ఆవిడే ఆదిశక్తి. భువనేశ్వరిగా, త్రిపుర సుందరిగా కొలువుదీరిన అమ్మవారి పర్యంకానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఈశ్వరుడు నాలుగు కోళ్లుగా ఉంటారు. సదాశివుడు పలకరూపంలో ఉంటాడు. ఆమె కటాక్ష జనితాలై విజ్ఞానం, ఆనందం అనే నదులు, నవనిధులు, అష్టసిద్ధులు ప్రవహిస్తుంటాయి. సూర్యాగ్ని చంద్రులు ఆమెకు కన్నులుగా వెలుగొందుతూ ఉంటారు. కాళి, కాత్యాయని, వారాహి, చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు. మహదహంకారాదులు, పంచభూతాలు, కాలం ఆమె తత్త్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తుండగా… చిరునవ్వుముఖంతో, కారుణ్యపూరితమైన చూపులతో దర్శనమిస్తుంటుంది ఆదిశక్తి. పాశాంకుశ వరాభయ హస్తాలతో, వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెను లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి మొదలైన కాంతులు సేవిస్తుంటాయి. 

అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయకాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది. మణిద్వీపం చుట్టూ కాంస్యం, తామ్రం, సీసం, ఇత్తడి, పంచలోహాలు, పుష్యరాగం, పద్మరాగం, గోమేధికం, వజ్రం, వైడూర్యం, ఇంద్రనీలం, మరకతం, ప్రవాళం, మాణిక్యం మొదలైన ప్రాకారాలు ఉంటాయి. చింతామణి గృహం సూర్యకాంత, చంద్రకాంత మణులతో నిరంతరం ప్రకాశిస్తుంటుంది. ఆమె సంకల్పంతో ఈ చరాచర సృష్టి జరిగింది. మొదట నిరాకార, నిర్గుణ ‘నిష్కళ’ స్థితి నుంచి సంకల్పం.. శక్తి సంకల్పాల నుంచి చైతన్యం, దాని ద్వారా మనసు, బుద్ధి శరీరాలు ఆవిర్భవించి సగుణమూర్తిగా భాసించాయి. శక్తి నుంచి శారీరక బలం, సౌభాగ్యాలు.. చైతన్యం ద్వారా తెలివి, స్ఫూర్తి, ఎరుక (ఆధ్యాత్మిక జ్ఞానం)లు వెలుగుచూశాయి. తర్వాత ఆ శుద్ధ చైతన్యమే శివశక్తులు (చైతన్యశక్తులు)గా వస్తుప్రపంచమై అనంత సృష్టి వెలుగు చూసింది. ఈ అనంతశక్తిని శరీరంలో ఉంటే కుండలినిగా, వస్తువులలో విద్యుత్తుగా, లోకాలలో ఆకాశంగా వ్యవహరిస్తాం.

నిజానికి మన దేహమే మణిద్వీపం. దేహంలోని హృదయం దహరాకాశం. కాశం అంటే వెలుగు. విశిష్టమైన వెలుగే ప్రకాశం. అజ్ఞానపు చీకటిని తొలగించే జగన్మాత మన దేహంలో సూక్ష్మంగా ప్రకాశిస్తుంటుంది. తెలుసుకోగలిగితే ఆ మంత్రరూపిణి మన మనసులోనే కొలువై ఉన్నది. లోకం అంటే మనసు. మనసును దాని పరిమితులలో నిలిపి అమితమైన చైతన్యాన్ని కలిగించేది మంత్రం. మంత్రాన్ని నియమిత అంతరాలలో మననం చేయడం వల్ల అది మనల్ని కాపాడుతుంది. 

ఈ బ్రహ్మాండాన్ని కనురెప్పపాటులో సృష్టించి, లయం చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త‌ విశ్వం ఉండటం వ‌ల్ల 32 రకాల పూలతో, పసుపు, కుంకుమలతో.. నవరత్నాలతో.. రాగి, కంచు, వెండి, బంగారము మెదలగు లోహాలతో యధాశక్తి అమ్మవారిని పూజించ‌వ‌చ్చు. 32 రకాల నైవేద్యాలతో, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు. మణిద్వీప వర్ణన, చింతామణి గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తులు విశ్వ‌సిస్తారు.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
Jack Movie Review - 'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?
'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?
Singer Abhijeet Bhattacharya : 'రెహమాన్ పద్మ అవార్డు గ్రహీతలను అవమానించారు'... ఆస్కార్ విన్నర్‌పై సింగర్ సెన్సేషనల్ కామెంట్స్
'రెహమాన్ పద్మ అవార్డు గ్రహీతలను అవమానించారు'... ఆస్కార్ విన్నర్‌పై సింగర్ సెన్సేషనల్ కామెంట్స్
Kavitha Statement On Pawan Kalyan: సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
Konaseema Latest News: జ‌న‌సేన గెలిచిన స్థానాల్లో వ‌ర్గ విభేదాలు, పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల  కొట్లాట!
జ‌న‌సేన గెలిచిన స్థానాల్లో వ‌ర్గ విభేదాలు, పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల కొట్లాట!
Embed widget