అన్వేషించండి

Vasantha Panchami 2024: పరశురాముడు నిర్మించిన సరస్వతీ ఆలయం - ఇక్కడ అక్షరాభ్యాసం 2 రకాలు!

Vasantha Panchami 2024 :చదువుల తల్లికి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి కేరళలో ఉన్న ఆవనంకోడ్ దేవాలయం. వసంత పంచమి సందర్భంగా ఈ ఆలయం విశిష్టత తెలుసుకుందాం...

Avanamcode Saraswathi Temple

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవందినీ 
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ
భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా

పిల్లల్ని స్కూల్ కి పంపించే ముందు సరస్వతీ కటాక్షం సిద్ధించాలంటూ అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే కేరళలో ఉన్న ఆవనంకోడ్ సరస్వతీదేవి ఆలయంలో మాత్రం పెద్దవారికి కూడా అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకునే వారికి చదువుతోపాటూ వాక్కునూ అందించే శక్తిస్వరూపిణిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. ఈ ఆలయంలో అమ్మవారితోపాటూ జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తినీ ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆవనంకోడ్‌ సరస్వతీ దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయం విశిష్టతలేంటంటే...

Also Read: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!

పరశురాముడు ప్రతిష్టించిన విగ్రహం

ఒకప్పుడు ఈ ఊరివాళ్లు గడ్డికోసేందుకు వెళ్లినప్పుడు ఓ రాయికి కొడవలి తగిలి నెత్తురోడిందట. అది చూసిన పరశురాముడు అక్కడికి వచ్చి ఆ శిలలో సరస్వతీదేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని కథనం. అలా పరశురాముడు నిర్మించిన 108 దుర్గాలయాల్లో ఆవనంకోడ్‌ సరస్వతీదేవి సన్నిధానం కూడా ఒకటని చెబుతారు

శంకరాచార్యుల అక్షరాభ్యాసం జరిగిన ప్రదేశం

అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురువు ఆదిశంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అక్షరాభ్యాసం జరగలేదట. కొన్నాళ్లకు శంకరాచార్యుల తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించారని చెబుతారు.

Also Read: పిబ్రవరి 14 వసంతపంచమి - ఈ రోజు విశిష్టత ఇదే!

ఇక్కడ అక్షరాభ్యాసం 2 రకాలు
1 . విద్యారంభం - చదువు ప్రారంభించనున్న పిల్లలకు జరిపించే అక్షరాభ్యాసం
2. విద్యావాగీశ్వరి - ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునేవారు చేయించుకునే అక్షరాభ్యాసం

ఈ ఆలయంలో ఏడాది మొత్తం అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రక్రియ కూడా కొంత భిన్నంగా ఉంటుంది..
ఆలయంలోని ప్రధానార్చకుడు అమ్మవారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి అందులో ‘ఓం హరి శ్రీ గణపతయే నమః’ అని పిల్లల చేత రాయిస్తారు. తర్వాత అదే నామాన్ని వాళ్ల నాలుకపైనా రాస్తారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చేసి అమ్మవారిని అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు. అక్షరాభ్యాసం చేయించాలనుకునేవారు నావ్‌, మణి, నరయంగా పిలిచే నాలుక, గంట, కలం, ఆకారాలను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునేవారు కెరీర్లో ఉన్నత స్థానంలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలో ఇసుకపైన కూడా అక్షరాలు రాస్తుంటారు భక్తులు...

Also Read:  ఎవరీ రతీ మన్మధులు - వీరి ప్రేమకథ ఎందుకంత ప్రత్యేకం!

పాస్ పోర్ట్ అమ్మవారు

తెలంగాణ రాష్ట్రం చిలుకూరు బాలాజీలా... ఆవనంకోడ్‌ సరస్వతీ దేవి ఆలయంలోనూ ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారంతా ఇక్కడ ముందుగా పాస్ పోర్టులు పెట్టి పూజిస్తారు. విమానంలో ఎగిరిపోయే ముందు పాస్ పోర్టులు అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తే వెళ్లిన పని వందశాతం సక్సెస్ అవుతుందని విశ్వసిస్తారు. అందుకే ఈ సన్నిధానానికి పాస్‌పోర్ట్‌ ఆలయమనే పేరూ ఉంది. కళాకారులూ, రచయితలూ సైతం తమ పుస్తకాలనూ, సంగీత వాయిద్యాలనూ అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తారు. 

Also Read: రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమకథ!

పశ్చిమ ముఖంగా అమ్మవారు

స్వయంభువుగా వెలసిన సరస్వతీ దేవి ఈ ఆలయంలో పశ్చిమ ముఖంగా దర్శనమిస్తుంది. నిత్యం అక్షరాభ్యాసాలతో కళకళలాడే ఈ ఆలయంలో దసరా, వసంత పంచమి సహా ఏడాదికోసారి మార్చిలో వచ్చే పూరమ్ పేరుతో పది రోజుల పాటూ వైభవంగా ఉత్సవాలు జరిపిస్తారు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget