అన్వేషించండి

Vaishno Devi Darshan: వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే ఇబ్బంది పడతారు!

అవాంతరాలు లేని వైష్ణోదేవి సందర్శనకు కొంత ముందస్తు ప్రణాళిక, కొద్దిపాటి ప్రిపరేషన్ చిట్కాలు అవసరమవుతాయి. అవేంటో చూసేయండి మరి.

ఈ సారి నవరాత్రికి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలని అనుకుంటున్నారా? మరి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ యాత్రకు సిద్దమవుతున్నపుడు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. కొన్ని తప్పక గుర్తుంచుకోవాలి. కొన్ని బుకింగ్స్ ముందుగానే చేసుకోవాలి. ఎలాంటి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? టైమింగ్స్ ఏమిటి? వంటి సమాచారం తెలుసుకుని పెట్టుకోవాలి. వీటన్నింటిని అనుసరించి ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలి.

నవరాత్రి తొమ్మిది రోజుల పాటు జరిగే పండుగ. నవరాత్రుల్లో వైష్ణోదేవి దర్శనం చేసుకోవాలని చాలా మంది ఆశపడతారు. అలాంటి ఆశ, ఉద్దేశం ఉన్నవారికి పనికొచ్చే ముఖ్య సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా తెలుసుకోవాల్సిందేమిటంటే ఇక్కడికి వెళ్లాలంటే ముందు యాత్రికులుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక వేళ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా జమ్ములోని యాత్రా కార్డ్ కలెక్షన్ పాయింట్ దగ్గరకి వెళ్లి ఫోన్ నెంబర్, వయసు వంటి వివరాలను అందిస్తే మీకు అక్కడ మీ ఫోటో తీసుకుని ఐడి కార్డ్ ఒకటి అందిస్తారు. యాత్ర పూర్తయిన తర్వాత మీరు మీ కార్డును వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. యాత్రికులు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. IRCTC కూడా నవరాత్రి ప్రత్యేక రైలును నడుపుతుంది.

  • రిజిస్టర్డ్ యూజర్ తన యూజర్ ఐడీ పాస్వర్డ్ తో వెబ్ సైట్ లోకి ఎంటర్ కావచ్చు. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్ సైట్ వివరాలు maavaishnodevi.org
  • యాత్ర రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి యాత్ర వివరాలను నమోదు చేసుకోవాలి. జనరేట్ యాత్రా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి.

వైష్ణోదేవి టైమింగ్స్

వేసవిలో లైవ్ ఆర్తి ఉదయం 6.20 గంటల నుంచి 8.00 గంటల వరకు, సాయంత్రం 7.20 గంటల నుంచి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. శీతాకాలంలో లైవ్ అత్కాఆర్తి.. ఉదయం 6.20 గంటల నుంచి 8.00 గంటల వరకు సాయంత్రం 6.20 గంటల నుంచి 8.00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో భక్తులను సందర్శనకు అనుమతించరు.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రీపెయిడ్ సిమ్ కార్డు ఫోన్లను జమ్ములోకి అనుమతించరు. కనుక కనెక్టివిటి కోసం జమ్ముకు వెళ్లినపుడు తప్పనిసరిగా పోస్ట్ పెయిడ్ సిమ్ వెంట తీసుకువెళ్లాలి. ఒకవేళ మరిచిపోతే అక్కడి చిన్న దుకాణాల్లో సైతం యాత్రి సిమ్ 350/- కి అందుబాటులో ఉంటాయి. ఈ సిమ్ నెల పాటు పనిచేస్తుంది. రోజుకు 1.5 డెటా, ఒక నెల పాటు అపరిమిత కాల్స్ లభిస్తాయి.

వైష్ణోదేవి యాత్ర – హెలీకాప్టర్, ఎలక్ట్రిక్ వెహికిల్ బుకింగ్

వైష్ణోదేవి యాత్ర ప్రారంభమయ్యేది బాన్ గంగా నుంచి.. ఇక్కడికి చేరుకోవడానికి ఆటోలో కూడా వెళ్లవచ్చు. బాన్ గంగా చేరుకున్న తర్వాత అక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఘోడే(పోనీ) లేదా పాల్కీ కూడా మనం వినియోగించుకోవచ్చు. ఆడ్కువారి నుంచి ఆలయం వరకు మనం ప్రయాణం చెయ్యడానికి 4 రకాల సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ వ్యాన్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీని కోసం ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మరచిపోతే మాత్రం ఆఫ్ లైన్ బుకింగ్ అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. 5-6 గంటల వెయిటింగ్ తప్పకుండా ఉంటుంది. అలాగే హెలీకాప్టర్ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

బైరోబాబాను దర్శనం చేసుకోవడానికి రోప్ వే ద్వారా వెళ్ల వచ్చు. వైష్ణోదేవి రోప్ వే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. టికెట్లు ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవాలి. ఒకొక్కరికి రూ.100. ఇది చాలా మందికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

www.maavaishnodevi.org లో మాత్రమే శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డ్ వారి అధికారిక వెబ్ సైట్. ఇదికాక మరే వెబ్ సైట్ అయినా నకిలీదే అని గుర్తుంచుకోవాలి. SMVDSB కత్రా తరపున ఆన్‌లైన్ టిక్కెట్‌ను బుక్ చేయడానికి  ఏ ట్రావెల్ ఏజెంట్‌కు అనుమతి లేదు. కనుక అలాంటి బుకింగులు చెల్లవు. ఇక్కడ చెప్పిన అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే బుకింగ్ వివరాలు ఉన్నాయి. ఇది కాకుండా "MATA VAISHNODEVI APP" అనే అధికారిక మొబైల్ ఆప్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో కూడా బుకింగ్, ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా సందేహ నివృత్తికి, ఇతర సమాచారం కోసం 01991-234804 నంబర్ తో 24x7 కాల్ సెంటర్‌ను, వాట్సప్ నెంబర్ 9906019494 లో సంప్రదించవచ్చు.

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!

టాప్ హెడ్ లైన్స్

Varahi Navaratri Dates2026: వారాహి నవరాత్రుల పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
వారాహి నవరాత్రులు 2026 తేదీలు, పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
Unique Traditions: ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
Dakshinayanam 2026: ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget