అన్వేషించండి

Dharmasthala : ధర్మస్థల రహస్యాలు - మంజునాథ స్వామి ఆలయం వెనుక దాగిఉన్న అద్భుతాలు, దర్శన సమయాలు!

Dharmasthala Temple: ధర్మస్థల అంటే ధర్మస్థలం అని అర్థం. ఇక్కడ కొలువయ్యాడు శ్రీ మంజునాథుడు. శివుడి అవతారాల్లో ఒకటైన మంజునాథుడి ఆలయం విశిష్టత, ప్రత్యేకతలు మీకు తెలుసా..

Sri Kshetra Dharmasthala Manjunatha Swamy Temple:  కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం 800 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దీనిని జైనులు నిర్వహిస్తారు, పూజలు మధ్వ వైష్ణవులు చేస్తారు. 

దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలో మల్లార్మడి అనే గ్రామంలో ఉన్న ఈ ప్రదేశాన్ని పురాణాల ప్రకారం కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నెల్లియడి బీడు అనే ఇంట్లో, జైన అధిపతి శ్రీ బిర్మన్న పెర్గాడే  కుటుంబం నివసించేవారు. ఓ రోజు కొంతమంది సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని నిరంతరం ఆచరించడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని అడిగారు. వారి అభ్యర్థన విని ఆశ్చర్యపోయిన ఆ జంట.. సందర్శకులను ప్రత్యేకంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. ఆ రోజు రాత్రి భగవంతుడు వారి కలలో కనిపించి ఈ ఇంటిని ధర్మపూజలకోసం అంకితం చేయాలని అడిగాడట. జైన దంపతులు ఆ కలను అనుసరించి తమ నివాసాన్ని ఇచ్చేసి మరోఇల్లు నిర్మించుకునేందుకు వెళ్లిపోయారు. 

పూజలకు అంకితం చేసిన ఆ ఇంట్లో నివసించిన జైన దంపతులకు మరో బాధ్యత అప్పగించారు ధర్మ దేవతలు.  శ్రీ కాళ రాహువు, శ్రీ కాలర్కాయి, శ్రీ కుమార స్వామి,  శ్రీ కన్యా కుమారి లకు నాలుగు ప్రత్యేక మందిరాలను ప్రాంగణం లోపల నిర్మించాలని ఆదేశించారు. ఆ మందిరాల నిర్మాణం తర్వాత బ్రాహ్మణులను పూజలు చేసేందుకు ఆహ్వానించారు జైన దంపతులు. ఈ విగ్రహాలతో పాటూ ఓ శివలింగాన్ని కూడా ప్రతిష్టిస్తే పూజలు నిర్వహిస్తామని ఆ బ్రాహ్మణులు చెప్పారు. దీంతో మంగళూరు సమీపంలో కద్రి మంజునాథ స్వామి ఆలయం నుంచి ఓ శివలింగాన్ని తీసుకొచ్చేందుకు  అన్నప్ప స్వామి అనే వ్యక్తిని నియమించారు. ధర్మస్థల ఆలయం మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయం నుంచి కిలోమీటరన్నద దూరంలో ఈ అన్నప్ప స్వామి మందిరం కూడా దర్శించుకోవచ్చు. గణేషుడి మందిరం కూడా ఉంటుంది ఇక్కడ. ఆ జైన కుటుంబ వారసుడిని వివాదాల పరిష్కారం కోసం ధర్మ అధికారిగా గౌరవిస్తారిక్కడ.  

శ్రీ మంజునాథ స్వామి దర్శన సమయాలు

శ్రీ మంజునాథ స్వామి ఆలయం వేకువజామున 4 గంటలకు తెరుచుకుంటుంది. 

శుద్ధి తర్వాత ఉదయం ఆరున్నర నుంచి 11 వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 

ఉదయం 11.30 గంటలకు శివుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నదానం ప్రారంభవుతుంది.  

మధ్యాహ్నం 12 గంటలకు మాహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఈ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు.

ఈ ప్రదక్షిణలు పూర్తయ్యాక మళ్లీ  2 గంటల 15 నిముషాల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

సాయంత్రం 5 గంటలకు తిరిచి రాత్రి 8 గంటల 30 నిముషాల వరకూ దర్శనాలు కొనసాగుతాయి. 8.30 కి మహాపూజ జరుగుతుంది. 

శ్రీ మంజునాథ స్వామి ప్రత్యేక రోజులు
 
వినాయకచవితి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఆరాధన ఉంటుంది

కార్తీకమాసం,మహాశివరాత్రి సమయంలోనూ ఆలయం భక్తులతో నిండిపోతుంది

ఉగాది ఉత్సవాలు  వైభవంగా జరుగుతాయి ఇక్కడ

వార్షిక జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుగుతుంది

ధర్మస్థల ఎలా చేరుకోవాలి?

మంగళూరు వరకు వెళితే అక్కడి నుంచి బస్సులు లేదా టాక్సీల్లో ధర్మస్థల చేరుకోవచ్చు. ఇక్కడ వసతిని ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు, అక్కడకు వెళ్లాక కూడా దొరుకుతాయి.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, పుస్తకాల్లో పొందుపరిచిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని పరిగణలోకి తీసకునేముందు సంబంధిత నిపుణుల సలహాలు స్వీకరించండి.. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Chaitra Purnima 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
చైత్ర పౌర్ణమి 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
Mahakaleshwar Temple: భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget