అన్వేషించండి

Dharmasthala : ధర్మస్థల రహస్యాలు - మంజునాథ స్వామి ఆలయం వెనుక దాగిఉన్న అద్భుతాలు, దర్శన సమయాలు!

Dharmasthala Temple: ధర్మస్థల అంటే ధర్మస్థలం అని అర్థం. ఇక్కడ కొలువయ్యాడు శ్రీ మంజునాథుడు. శివుడి అవతారాల్లో ఒకటైన మంజునాథుడి ఆలయం విశిష్టత, ప్రత్యేకతలు మీకు తెలుసా..

Sri Kshetra Dharmasthala Manjunatha Swamy Temple:  కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం 800 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దీనిని జైనులు నిర్వహిస్తారు, పూజలు మధ్వ వైష్ణవులు చేస్తారు. 

దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలో మల్లార్మడి అనే గ్రామంలో ఉన్న ఈ ప్రదేశాన్ని పురాణాల ప్రకారం కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నెల్లియడి బీడు అనే ఇంట్లో, జైన అధిపతి శ్రీ బిర్మన్న పెర్గాడే  కుటుంబం నివసించేవారు. ఓ రోజు కొంతమంది సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని నిరంతరం ఆచరించడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని అడిగారు. వారి అభ్యర్థన విని ఆశ్చర్యపోయిన ఆ జంట.. సందర్శకులను ప్రత్యేకంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. ఆ రోజు రాత్రి భగవంతుడు వారి కలలో కనిపించి ఈ ఇంటిని ధర్మపూజలకోసం అంకితం చేయాలని అడిగాడట. జైన దంపతులు ఆ కలను అనుసరించి తమ నివాసాన్ని ఇచ్చేసి మరోఇల్లు నిర్మించుకునేందుకు వెళ్లిపోయారు. 

పూజలకు అంకితం చేసిన ఆ ఇంట్లో నివసించిన జైన దంపతులకు మరో బాధ్యత అప్పగించారు ధర్మ దేవతలు.  శ్రీ కాళ రాహువు, శ్రీ కాలర్కాయి, శ్రీ కుమార స్వామి,  శ్రీ కన్యా కుమారి లకు నాలుగు ప్రత్యేక మందిరాలను ప్రాంగణం లోపల నిర్మించాలని ఆదేశించారు. ఆ మందిరాల నిర్మాణం తర్వాత బ్రాహ్మణులను పూజలు చేసేందుకు ఆహ్వానించారు జైన దంపతులు. ఈ విగ్రహాలతో పాటూ ఓ శివలింగాన్ని కూడా ప్రతిష్టిస్తే పూజలు నిర్వహిస్తామని ఆ బ్రాహ్మణులు చెప్పారు. దీంతో మంగళూరు సమీపంలో కద్రి మంజునాథ స్వామి ఆలయం నుంచి ఓ శివలింగాన్ని తీసుకొచ్చేందుకు  అన్నప్ప స్వామి అనే వ్యక్తిని నియమించారు. ధర్మస్థల ఆలయం మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయం నుంచి కిలోమీటరన్నద దూరంలో ఈ అన్నప్ప స్వామి మందిరం కూడా దర్శించుకోవచ్చు. గణేషుడి మందిరం కూడా ఉంటుంది ఇక్కడ. ఆ జైన కుటుంబ వారసుడిని వివాదాల పరిష్కారం కోసం ధర్మ అధికారిగా గౌరవిస్తారిక్కడ.  

శ్రీ మంజునాథ స్వామి దర్శన సమయాలు

శ్రీ మంజునాథ స్వామి ఆలయం వేకువజామున 4 గంటలకు తెరుచుకుంటుంది. 

శుద్ధి తర్వాత ఉదయం ఆరున్నర నుంచి 11 వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 

ఉదయం 11.30 గంటలకు శివుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నదానం ప్రారంభవుతుంది.  

మధ్యాహ్నం 12 గంటలకు మాహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఈ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు.

ఈ ప్రదక్షిణలు పూర్తయ్యాక మళ్లీ  2 గంటల 15 నిముషాల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

సాయంత్రం 5 గంటలకు తిరిచి రాత్రి 8 గంటల 30 నిముషాల వరకూ దర్శనాలు కొనసాగుతాయి. 8.30 కి మహాపూజ జరుగుతుంది. 

శ్రీ మంజునాథ స్వామి ప్రత్యేక రోజులు
 
వినాయకచవితి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఆరాధన ఉంటుంది

కార్తీకమాసం,మహాశివరాత్రి సమయంలోనూ ఆలయం భక్తులతో నిండిపోతుంది

ఉగాది ఉత్సవాలు  వైభవంగా జరుగుతాయి ఇక్కడ

వార్షిక జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుగుతుంది

ధర్మస్థల ఎలా చేరుకోవాలి?

మంగళూరు వరకు వెళితే అక్కడి నుంచి బస్సులు లేదా టాక్సీల్లో ధర్మస్థల చేరుకోవచ్చు. ఇక్కడ వసతిని ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు, అక్కడకు వెళ్లాక కూడా దొరుకుతాయి.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, పుస్తకాల్లో పొందుపరిచిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని పరిగణలోకి తీసకునేముందు సంబంధిత నిపుణుల సలహాలు స్వీకరించండి.. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget