అన్వేషించండి

Spirituality: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!

Spirituality: ఇంట్లో,ఆలయంలో ఎక్కడ చూసినా దేవుడికి నైవేద్యం పెట్టనిదే పూజ పూర్తవదు. ఇంతకీ ఎందుకు నైవేద్యం పెట్టాలి.. దేవుడేమైనా తింటాడా..తినడు అని తెలిసి కూడా ఎందుకు సమర్పిస్తారు...

Spirituality: ఏ పూజ చేసినా, భగవంతుడిని ఆరాధించినా పూజ చేసే విధానంలో ఎన్ని మార్పులున్నా చివరికి నైవేద్యం మాత్రం అందరూ సమర్పిస్తారు. ఆయా దేవతా రూపాన్ని బట్టి నివేదన మారుతుంది కానీ నైవేద్యం సమర్పించడం మాత్రం మానరు. అసలు దేవుడు తింటాడా..మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి...

తిరుమలలో శ్రీవారికి రోజంతా రకరకాల నైవేద్యాలు,పూరీ జగన్నాథుడి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు నివేదించే పాత్రలతో గర్భగుడి నిండిపోతుందేమో..ఇక మిగిలిన ఆలయాల్లోనూ స్వామి, అమ్మవార్లకు భోగం సమర్పిస్తుంటారు. ఇవన్నీ దేవుడు తింటాడా అంటే తినడు కదా..ఆ విషయం మరి సమర్పించేవారికి తెలియదా అంటే తెలుసు.. మరెందుకు

Also Read:  ఈ రాశులవారికి స్నేహితుల సలహాలు కలిసొస్తాయి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది- నవంబరు 18 రాశిఫలాలు

నైవేద్యం ఎందుకంటే
భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం.  మనిషి జీవితం త్యాగ భావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని చెబుతుంది ఈ నివేదన. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందన్నది ఆంతర్యం

ప్రసాదానికి ఎందుకంత రుచి
ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన వారి వరకూ ఎవరి శక్తికి తగ్గా నైవేద్యం వారు సమర్పించుకుంటారు. భగవంతుడికి మాత్రం అందరూ సమానులే. భక్తితో ఏమిచ్చినా తీసుకుంటాడనేందుకు భక్త శబరి, భక్త కన్నప్పలే నిదర్శనం. వాస్తవానికి భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై, శరీరంలో తేజస్సును- ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుందని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. అందుకే గమనిస్తే ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచి రాదు కానీ ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నివేదించిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది అంటుంటారు కదా.. గుడిలో పులిహోరలా లేదు, గుడిలో దద్ధ్యోజనంలా లేదని...దానికి కారణం అందే.. స్వామివారి చూపు , అక్కడున్న ప్రశాంత తరంగాలు ప్రసాదంలో ప్రసరించి ఆ రుచిని ఇస్తాయన్నది పండితుల మాట

Also Read: 'అంతా మా కర్మ', 'ప్రారబ్ధం' అంటారు కదా, ఎందుకలా అంటారు - కర్మ అంటే ఏంటి!

ఇంకా చెప్పాలంటే! 

  • ఆహారం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించినది అన్న అహంకారం లోలోపల ఉంటుంది. కానీ భగవంతునికి దాన్ని అర్పించాక తినడం వల్ల అహంకారం దశ దాటి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన వస్తుంది
  • నైవేద్యం కోసం వండే ఆహారాన్ని రుచి చూడకూడదని కూడా ఎందుకంటారంటే..వంటని కేవలం రుచి కోసం కాకుండా, ఓ పవిత్ర యజ్ఞంగా భావించమన్న సూచన. ఇలా రూపొందించిన ఆహారాన్ని సాత్వికత చేకూరుతుంది. ఆ ఆహారం తిన్నవారిలోనూ పవిత్ర భావనలు చోటు చేసుకుంటాయి.
  • మనకు లభించిన ఆహారాన్ని సాటిజీవులతో పంచుకోవాలనీ, ఇంటికి వచ్చిన అతిథల ఆకలి తీర్చాలనీ... నైవేద్యం మనకి సూచిస్తుంది.
  • మనం సంపాదించిన ప్రతి రూపాయీ నీతిగా ఉండాలని అర్థం. సంపాదన కోసం తెలియక చేసిన తప్పులని క్షమించమనీ, తెలిసి చేసిన తప్పులను మరోసారి చేయననీ... ఆ భగవంతుని వేడుకునేందుకు ఇదో విలువైన అవకాశం.
  • ఆహారాన్ని ఆ భగవంతునికి సమర్పించడంతో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న సత్యం గుర్తుకువస్తుంది. ఆ అన్నాన్ని వృధా చేయకూడదన్న విచక్షణ కలుగుతుంది
    కొంతమంది తినే అన్నం ముందు కూర్చుని ఆహారానికి ఉన్న పరమార్థం మరిచిపోయి  జిహ్వచాపల్యానికే ప్రాధాన్యతని ఇస్తారు. అదే నైవేద్యం పెట్టిన ఏ పదార్థాన్ని అయినా విమర్శించకుండా తింటారు..అంటే ఆహారానికి వంక పెట్టకూడదన్నది ఇందులో ఆంతర్యం
  • మన జీవితంలో కంటి ముందు ఉండే అగ్నిగుండం మన జీర్ణకోశమే! ఆ అగ్నిని శాంతింపచేసే ద్రవ్యం ఆహారం. అందుకే మన ఒంట్లోని అగ్నిని జఠరాగ్ని అన్నారు పెద్దలు. యజ్ఞగుండంలో తగినంత అగ్నిని వేస్తూ దానిని పవిత్రంగా చూసుకుంటామో..మన జఠరాగ్నిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. మనం అందులో వేసే ఆహారాన్ని బట్టే  మనసూ, శరీరమూ ఆరోగ్యంగా ఉంటాయి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Artificial Beach in Hyderabad: హైదరాబాద్‌ వాసులకు చిల్లింగ్ న్యూస్ - బీచ్ వచ్చేస్తోంది - జోక్ కాదు సీరియస్సే !
హైదరాబాద్‌ వాసులకు చిల్లింగ్ న్యూస్ - బీచ్ వచ్చేస్తోంది - జోక్ కాదు సీరియస్సే !
Andhra Pradesh River Water Levels: కృష్ణ గోదావరి నదులకు ప్రమాద హెచ్చరికలు జారీ-టోల్ ఫ్రీ నెంబర్‌లు విడుదల చేసిన ఏపీ అధికారులు
కృష్ణ గోదావరి నదులకు ప్రమాద హెచ్చరికలు జారీ-టోల్ ఫ్రీ నెంబర్‌లు విడుదల చేసిన ఏపీ అధికారులు
Viral News: అంత్యక్రియలకు అడ్డొచ్చిన వరద, తాడు సాయంతో ప్రాణాలకు తెగించి పూర్తి చేసిన ప్రజలు
అంత్యక్రియలకు అడ్డొచ్చిన వరద, తాడు సాయంతో ప్రాణాలకు తెగించి పూర్తి చేసిన ప్రజలు
Police Recruitment Cancel: ఒక్క తీర్పుతో 859 సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలు పోయాయి - మరి పేపర్ కొని రాస్తే ఉంచుతారా ?
ఒక్క తీర్పుతో 859 సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలు పోయాయి - మరి పేపర్ కొని రాస్తే ఉంచుతారా ?
Advertisement

వీడియోలు

America vs India Tariff war | మళ్లీ ఇండియాపై పడి ఏడుస్తున్న అమెరికా | ABP Desam
Romario Shepherd 22 Runs in One Ball | ఒక్క బాల్ కి 22 పరుగులు చేసిన RCB ప్లేయర్
Mohammed Shami about Retirement | రిటైర్మెంట్ పై స్పందించిన షమీ
Pocharam Dam Over Flowing | ప్రమాదపుటంచుల్లో పోచారం డ్యామ్..తీవ్ర స్థాయిలో వరద | ABP Desam
Indian Army Rescue Operation in Punjab | ఉత్తర భారత్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Artificial Beach in Hyderabad: హైదరాబాద్‌ వాసులకు చిల్లింగ్ న్యూస్ - బీచ్ వచ్చేస్తోంది - జోక్ కాదు సీరియస్సే !
హైదరాబాద్‌ వాసులకు చిల్లింగ్ న్యూస్ - బీచ్ వచ్చేస్తోంది - జోక్ కాదు సీరియస్సే !
Andhra Pradesh River Water Levels: కృష్ణ గోదావరి నదులకు ప్రమాద హెచ్చరికలు జారీ-టోల్ ఫ్రీ నెంబర్‌లు విడుదల చేసిన ఏపీ అధికారులు
కృష్ణ గోదావరి నదులకు ప్రమాద హెచ్చరికలు జారీ-టోల్ ఫ్రీ నెంబర్‌లు విడుదల చేసిన ఏపీ అధికారులు
Viral News: అంత్యక్రియలకు అడ్డొచ్చిన వరద, తాడు సాయంతో ప్రాణాలకు తెగించి పూర్తి చేసిన ప్రజలు
అంత్యక్రియలకు అడ్డొచ్చిన వరద, తాడు సాయంతో ప్రాణాలకు తెగించి పూర్తి చేసిన ప్రజలు
Police Recruitment Cancel: ఒక్క తీర్పుతో 859 సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలు పోయాయి - మరి పేపర్ కొని రాస్తే ఉంచుతారా ?
ఒక్క తీర్పుతో 859 సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలు పోయాయి - మరి పేపర్ కొని రాస్తే ఉంచుతారా ?
Bandi Sanjay real hero: ఆర్మీహెలికాఫ్టర్లను పిలిపించి ఐదుగురికి ప్రాణదానం - బండి సంజయ్ రియల్ హీరో - గ్రామస్తుల ప్రశంసలు
ఆర్మీహెలికాఫ్టర్లను పిలిపించి ఐదుగురికి ప్రాణదానం - బండి సంజయ్ రియల్ హీరో - గ్రామస్తుల ప్రశంసలు
Senani With Sena in Visakhapatnam: విశాఖలో సేనతో సమావేశాలు ప్రారంభించిన జనసనాని - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కీలక చర్చలు
విశాఖలో సేనతో సమావేశాలు ప్రారంభించిన జనసనాని - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కీలక చర్చలు
Paradha Collections: 'పరదా'కు పండగ బూస్ట్... వినాయక చవితి బతికించింది... కోటి దాటిన కలెక్షన్లు... టోటల్ ఎంతంటే?
'పరదా'కు పండగ బూస్ట్... వినాయక చవితి బతికించింది... కోటి దాటిన కలెక్షన్లు... టోటల్ ఎంతంటే?
PM Modi China Tour: మోదీ చైనా పర్యటనకు అంతా సిద్ధం- ఏడేళ్ల తర్వాత డ్రాగన్ దేశంలో టూర్‌
మోదీ చైనా పర్యటనకు అంతా సిద్ధం- ఏడేళ్ల తర్వాత డ్రాగన్ దేశంలో టూర్‌
Embed widget