అన్వేషించండి

Mahabharat: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..

ముసలం అనే మాట నిత్యం వింటూనే ఉంటాం. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ పదం నిత్యనూతనం. ఏ పార్టీలోనైనా అంతర్గత కలహాలు చోటుచేసుకుంటే ఆ పార్టీలో ముసలం పుట్టిందంటారు. ఇంతకీ ముసలం మొదట ఎక్కడ పుట్టింది..

కురుక్షేత్రం ముగిసిన తర్వాత 36 ఏళ్లలో కృష్ణుడు కూడా మరణిస్తాడని, యాదవులంతా కొట్టుకు చస్తారని గాంధారి శాపం ఇస్తుంది. ఆ తర్వాత ద్వారకకు వెళ్లిపోయిన శ్రీకృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడికి పుట్టిన కొడుకు పేరు సాంబుడు. ఓసారి సప్తరుషులు శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వెళతారు. వాళ్లు రాజవీధిలో వస్తుండడం చూసిన యాదవులకు దుర్భుద్ధి పుట్టింది. కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి స్వాముల దగ్గరకు తీసుకొచ్చి.. అయ్యా ఇది భద్రుడి భార్య..దీనికి సంతానం కలుగుతుందా అని ఆటపట్టిస్తారు. అసలు విషయం గ్రహించి ఆగ్రహించిన సప్తరుషులు..."వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు... యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వాసుదేవుడిని దర్శించుకోకుండానే వెను తిరుగుతారు. 

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఆ తర్వాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఊరుకుంటాడు. ఆ మర్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా వున్న ఒక రోకలి పుట్టింది. యాదవులంతా భయంతో పరిగెత్తుకు వెళ్ళి ఆ సంగతి వసుదేవుడికి చెప్పగా.. ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలపండని ఆజ్ఞాపిస్తాడు. యాదవులంతా ఆయన చెప్పినట్టే చేశారు కానీ.. గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి...రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణంలో చాలా మార్పులొస్తాయి. ఎన్నో ఉత్పాతాలు కనిపించాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అపవడం, పగలు మేకలు నక్కల్లా కూయడం ,  ఆవులకు గాడిదలూ, ముంగిసలకు ఎలుకలూ, కుక్కలకు పిల్లులూ పుట్టాయట. కృష్ణబలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. అప్పుడే వేడివేడిగా వండిన ఆహారపదార్థాలు కూడా పురుగులు పట్టడం మొదలుపెట్టాయి. వరుస అశుభ సూచనలు చూసిన కృష్ణుడు గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు.

Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
ఊరిలో కన్నా తీర్థం సమీపంలో చనిపోవడం మంచిదని భావించిన కృష్ణుడు యాదవులను పిలిచి.. సముద్రానికి జాతర చేయాలి అంతా బయల్దేరండని ఆజ్ఞాపిస్తాడు. రాబోతున్న ప్రమాదాన్ని ఊహించని యాదవులంతా ఆహారపదార్థాలు సమకూర్చుకుని, అందంగా అలంకరించుకుని జాతరకు వెళతారు. అంతా సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళతాడు. ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తుపానీయాలు సేవించడం, అనవసర మాటలు మాట్లాడటం, పిచ్చిపిచ్చిగా నవ్వడం చేశారు. "ప్రద్యుమ్నా! అడుగో కృతవర్మని చూశావా! నిద్రపోతున్న వాళ్ళను చంపాడు. ఏంపౌరుషంరా! ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా?" అని సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు. "అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి  చంపావు నువ్వు. అది మరిచిపోయావా? నువ్వు చేసింది రణనీతి కాబోలని" కృతవర్మ ఆక్షేపించాడు. ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగి కృతవర్మ కంఠం నరికేశాడు సాత్యకి. సముద్రతీరంలో తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిముషం  ఆ కత్తికి ఆక్రమించి ఉంది. ఆ తర్వాత కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగా వివాదం పెరిగింది. సముద్ర తీరంలో మొలిచిన తుంగ పీకి ఒకర్నొకరు కొట్టుకుని అంతా ప్రాణాలు విడుస్తారు. అప్పుడు వాళ్లు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే తుంగగా మొలిచి..అదే వాళ్ల యుద్ధ సాధనంగా మారి యాదవుల నిర్మూలనకు కారణమైంది.  

దారుకుడూ, బభ్రుడూ తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దర్నీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళినమార్గానే కృష్ణుడు వెళ్లిపోతాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణుడు అవతారం చాలిస్తాడు. 

Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
Embed widget