అన్వేషించండి

Mahabharat: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..

ముసలం అనే మాట నిత్యం వింటూనే ఉంటాం. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ పదం నిత్యనూతనం. ఏ పార్టీలోనైనా అంతర్గత కలహాలు చోటుచేసుకుంటే ఆ పార్టీలో ముసలం పుట్టిందంటారు. ఇంతకీ ముసలం మొదట ఎక్కడ పుట్టింది..

కురుక్షేత్రం ముగిసిన తర్వాత 36 ఏళ్లలో కృష్ణుడు కూడా మరణిస్తాడని, యాదవులంతా కొట్టుకు చస్తారని గాంధారి శాపం ఇస్తుంది. ఆ తర్వాత ద్వారకకు వెళ్లిపోయిన శ్రీకృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడికి పుట్టిన కొడుకు పేరు సాంబుడు. ఓసారి సప్తరుషులు శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వెళతారు. వాళ్లు రాజవీధిలో వస్తుండడం చూసిన యాదవులకు దుర్భుద్ధి పుట్టింది. కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి స్వాముల దగ్గరకు తీసుకొచ్చి.. అయ్యా ఇది భద్రుడి భార్య..దీనికి సంతానం కలుగుతుందా అని ఆటపట్టిస్తారు. అసలు విషయం గ్రహించి ఆగ్రహించిన సప్తరుషులు..."వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు... యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వాసుదేవుడిని దర్శించుకోకుండానే వెను తిరుగుతారు. 

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఆ తర్వాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఊరుకుంటాడు. ఆ మర్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా వున్న ఒక రోకలి పుట్టింది. యాదవులంతా భయంతో పరిగెత్తుకు వెళ్ళి ఆ సంగతి వసుదేవుడికి చెప్పగా.. ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలపండని ఆజ్ఞాపిస్తాడు. యాదవులంతా ఆయన చెప్పినట్టే చేశారు కానీ.. గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి...రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణంలో చాలా మార్పులొస్తాయి. ఎన్నో ఉత్పాతాలు కనిపించాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అపవడం, పగలు మేకలు నక్కల్లా కూయడం ,  ఆవులకు గాడిదలూ, ముంగిసలకు ఎలుకలూ, కుక్కలకు పిల్లులూ పుట్టాయట. కృష్ణబలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. అప్పుడే వేడివేడిగా వండిన ఆహారపదార్థాలు కూడా పురుగులు పట్టడం మొదలుపెట్టాయి. వరుస అశుభ సూచనలు చూసిన కృష్ణుడు గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు.

Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
ఊరిలో కన్నా తీర్థం సమీపంలో చనిపోవడం మంచిదని భావించిన కృష్ణుడు యాదవులను పిలిచి.. సముద్రానికి జాతర చేయాలి అంతా బయల్దేరండని ఆజ్ఞాపిస్తాడు. రాబోతున్న ప్రమాదాన్ని ఊహించని యాదవులంతా ఆహారపదార్థాలు సమకూర్చుకుని, అందంగా అలంకరించుకుని జాతరకు వెళతారు. అంతా సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళతాడు. ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తుపానీయాలు సేవించడం, అనవసర మాటలు మాట్లాడటం, పిచ్చిపిచ్చిగా నవ్వడం చేశారు. "ప్రద్యుమ్నా! అడుగో కృతవర్మని చూశావా! నిద్రపోతున్న వాళ్ళను చంపాడు. ఏంపౌరుషంరా! ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా?" అని సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు. "అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి  చంపావు నువ్వు. అది మరిచిపోయావా? నువ్వు చేసింది రణనీతి కాబోలని" కృతవర్మ ఆక్షేపించాడు. ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగి కృతవర్మ కంఠం నరికేశాడు సాత్యకి. సముద్రతీరంలో తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిముషం  ఆ కత్తికి ఆక్రమించి ఉంది. ఆ తర్వాత కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగా వివాదం పెరిగింది. సముద్ర తీరంలో మొలిచిన తుంగ పీకి ఒకర్నొకరు కొట్టుకుని అంతా ప్రాణాలు విడుస్తారు. అప్పుడు వాళ్లు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే తుంగగా మొలిచి..అదే వాళ్ల యుద్ధ సాధనంగా మారి యాదవుల నిర్మూలనకు కారణమైంది.  

దారుకుడూ, బభ్రుడూ తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దర్నీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళినమార్గానే కృష్ణుడు వెళ్లిపోతాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణుడు అవతారం చాలిస్తాడు. 

Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Chaitra Purnima 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
చైత్ర పౌర్ణమి 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
Mahakaleshwar Temple: భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget