అన్వేషించండి

Karthika Vanabhojanam 2023: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!

Karthika Masam 2023 : కార్తీకమాసం అనగానే ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు నెలరోజులూ పండుగ వాతావరణమే. వీకెండ్ వస్తే ఆ సందడే వేరు. ఇంతకీ వనభోజనాలు కార్తీకమాసంలోనే ఎందుకు చేస్తారు. ఉసిరి

Vanabhojanam: కార్తీకమాసం రాగానే పిక్నిక్ ల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు ఎక్కడ చూసినా సమారాధనల హడావుడే. ఇప్పుడంటే పార్కుల్లో సమారాధానలు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ అప్పట్లో పెద్ద పెద్ద వనాల్లో సమారాధనలు జరిగేవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేయాలి చెబుతారు..దానివెనుక ఆంతర్యం ఏంటంటే..

అసాక్షి భోజన దోషాన్ని తొలగించుకునేందుకే
క్షమాగుణానికి ప్రతీకగా ధాత్రిచెట్టు ( ఉసిరిచెట్టు) ను చెబుతారు. ఉసిరిచెట్టు లక్ష్మీ స్వరూపం. శ్రీ మహాలక్ష్మి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తారు. ఎందుకంటే సాధారణ రోజుల్లో అసాక్షి భోజనాలు  చేస్తుంటాం. అంటే ... సమయం దాటాక తింటా, అతిథికి -బ్రహ్మచారికి పెట్టాకుండా తింటాం, ఒక్కోసారి బయటనుంచి తీసుకొచ్చి తింటాం, ఇంకోసారి నైవేద్యం లేకుండా తింటాం. ఇలా మొత్తం 9 రకాల భోజనాలు ఉన్నాయి. వాటిలో కేవలం రెండే రెండు ఆమోదయోగ్యం. ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా మనం నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా  నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటూ శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. శ్రీమహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే  ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల అదంతా స్వామివారి అమ్మవార్ల ప్రసాదం మాత్రమే కాదు..అసాక్షి భోజనం ద్వారా మన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుడిని తరిమేస్తుందని చెబుతారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం.

Also Read: ఈ రాశివారు రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేయొద్దు, నవంబరు 19 రాశిఫలాలు

ఆధ్యాత్మికత
కార్తీక మాసంలో వన భోజనాల వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్యం అనే సందేశం కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజు నైమిశారణ్యంలో మునులంతా సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీకపురాణంలో ఉంది. అప్పట్లో మహర్షులు ఆచరించిన వనభోజనాల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పైగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు.

Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!

ఆరోగ్యం
భారతీయ ఆయుర్వేదంలో వృక్షాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువును పూజించి , ఆ చెట్టుకింద వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని, అనారోగ్య తొలగిపోతుందని కార్తీక పురాణం చెబుతోంది.ఆయా  వృక్షాల మీదుగా వచ్చే గాలులు , ముఖ్యంగా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యలు చెబుతారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది.

Also Read: కార్తీకమాసంలో దీపాలు నీటిలో ఎందుకు వదులుతారు!

ఆనందం
పచ్చని చెట్లు , ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు , బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట , పాట కబుర్లకు చక్కటి వేదిక వనసమారాధన. పిల్లలు , పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు , నృత్యాలు , సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం.

Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే

నిత్య వనభోజనాలు చేసిన శ్రీ కృష్ణుడు
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసిన దేవుడెవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు- బలరాముడు. నిత్యం స్నేహితులతో వనభోజనానికి వెళ్లేవారు.  వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే...ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అయినా కానీ కృష్ణుడు ప్రత్యేకంగా స్నేహితులతో చెప్పేవాడట ...రేపు వనభోజనానికి వెళదాం అని. అంటే ఆ ప్రత్యేకత, విశిష్టత ఏంటో వాళ్లకి తెలియచేయడం కోసమే ఇదంతా.  

వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి...వృక్షాల వల్ల ఎన్ని ఉపయోగాలో భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ఉండాలి..కార్తీక వనసమారాధనల ముఖ్య ఉద్దేశం ఇదే..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlits: క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlits: క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
Gummadi Narsayya biopic: రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్  కుమార్ - షూటింగ్ ప్రారంభం
రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్ కుమార్ - షూటింగ్ ప్రారంభం
IndiGo Flights-BCCI: ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
Hanumakonda Additional Collector : ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
Embed widget