అన్వేషించండి

Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!

Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం 2, 3 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ సోమవారం తెలిపింది. ఈ క్రమంలో పాత దర్శనం విధానాలు అమలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

TTD Decision On Venkateswara Darshan: తిరుమలలో (Tirumala) సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ మేరకు ఇది ఎలా సాధ్యమనే విషయాలు పరిశీలిస్తే.. కంకణం విధానం తిరిగి అమల్లోకి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుని దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వీరికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వ దర్శనం వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు అత్యధికులు సామాన్య భక్తులే. వీరికి పెద్దపీట వేస్తామని టీటీడీ నూతన పాలక మండలి చెబుతోంది. అయితే, రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్‌లోనే దాదాపు 30 గంటలు స్వామి వారి దర్శనం కోసం సామాన్య భక్తులు వేచి చూాడాల్సి వస్తోంది.

స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణునివాసంలో ఆధార్ కార్డు ద్వారా భక్తులకు దర్శన సమయం కేటాయిస్తారు. దీంతో 2, 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. అయితే, ఈ టికెట్లు పరిమితంగానే ఉంటాయి. అటు, అలిపిరి, శ్రీవారి మెట్ల నుంచి కాలి నడకన వచ్చే భక్తులకు గతంలో దివ్య దర్శనం పేరుతో కొన్ని టికెట్లు కేటాయించేవారు. ఇందులో భాగంగా 2, 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేది. అయితే, గత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది.

ఆ విధానం ప్రవేశ పెడతారా.?

  • 2 దశాబ్దాల కిందట టీటీడీ ఈవోగా ఐవీ సుబ్బారావు ఉన్న సమయంలో 'కంకణం' విధానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతీ భక్తుడి చేతికి రిస్ట్ బాండ్ తరహాలో ఓ కంకణాన్ని ట్యాగ్ చేస్తారు. ఇది వాటర్ ప్రూఫ్ తరహాలో ఉంటుంది.
  • దీన్ని తిరుపతిలోని అనే కేంద్రాలతో పాటు రేణిగుంట తదితర ప్రాంతాల్లో వేసేవారు. ఈ విధానంతో మనకు కేటాయించిన సమయానికి వెళ్లి 2, 3 గంటల్లోనే స్వామి దర్శనం చేసుకుని రావొచ్చు. 
  • టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ ఈ అంశాన్ని గతంలో ప్రస్తావించారు. దీన్నే తిరిగి అమలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • కాగా, 30 ఏళ్ల క్రితం వరకూ సామాన్య భక్తుడు కూడా శ్రీవారి మూలవిరాట్‌ను అత్యంత సమీపంలో అంటే కులశేఖరపడి వరకూ వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీఐపీలు, రూ.10,500 దర్శనాలకు మాత్రమే ఇక్కడి వరకూ అనుమతిస్తున్నారు.
  • ఆ తర్వాతి కాలంలో లఘు దర్శనం ఏర్పాటు చేశారు. దీని ప్రకారం గరుడాళ్వార్ సన్నిధి నుంచి జయవిజయులను దాటి స్నపన మండపం వరకూ వెళ్లి దర్శించుకునేవారు. అనంతరం దీన్ని కూడా రద్దు చేసి గరుడాళ్వార్ సన్నిధి నుంచి దర్శనం కల్పిస్తున్నారు. దీనికి మహా లఘుదర్శనంగా పేరు పెట్టారు.
  • అయితే, భక్తులు మాత్రం లఘుదర్శనం కల్పించాలని కోరుతున్నారు. ఇలా చేస్తే దేవదేవుని సన్నిధిలో ప్రవేశించామన్న ఆనందానుభూతి కలుగుతుందని చెబుతున్నారు. దీన్ని పాలక మండలి పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

టీటీడీ నిర్ణయాలు

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తామని తెలిపారు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుందని ఛైర్మన్ చెప్పారు. 'అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు. నిత్యన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం. లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం. టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి. ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం. తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం. శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం. ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజ్ రద్దు. ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం.' చేసినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

Also Read: Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
Ashadha Gupt Navratri 2026 Date: 12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం!ఆషాఢ గుప్త నవరాత్రులు ఘటస్థాపన శుభసమయం, పూజా విధానం! 
12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం!ఆషాఢ గుప్త నవరాత్రులు ఘటస్థాపన శుభసమయం, పూజా విధానం! 
Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!
పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!
పూజ పూర్తిచేసిన తర్వాత తలుపులు వేసి ఉంచాలా? తెరిచి ఉంచాలా?
పూజ పూర్తిచేసిన తర్వాత తలుపులు వేసి ఉంచాలా? తెరిచి ఉంచాలా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget