అన్వేషించండి

Happy Ganesh Chaturthi 2024 : పూజకు మట్టి వినాయకుడే ఎందుకు..పురాణాల్లో దీనిగురించి ఏముంది!

Ganesh Chaturthi 2024: మట్టి గణపతినే పూజించండి..పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదాలు వింటుంటాం. అయితే మట్టి గణపయ్యనే ఎందుకు పూజించాలి? దీనికి సంబంధించి పురాణాల్లో ఏముంది..

Significance of Eco-Friendly Lord Ganesha Idols:  మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోండి..పర్యావరణాన్ని కలుషితం చేసే విగ్రహాలకు పూజలొద్దనే ప్రచారం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. అయితే కేవలం పర్యావరణం కోసమే కాదు..పురాణాల్లోనూ ఇది విషయం చెప్పారు.  

వినాయకుడి వైభవాన్ని చెబుతున్న సూతమహర్షిని శౌనకాది మునులు ఓ ప్రశ్న అడిగారు..

శౌనకాది మహామునులు: ఓ మహర్షీ.. వినాయక చవితి రోజు మట్టితో చేసిన ప్రతిమనే ఎందుకు పూజించాలంటారు? దానిని ఎందుకు నిమజ్జనం చేయాలి? 
సూతమహర్షి: పరమేశ్వరుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. పంచభూతాలు ఆయనలో నిక్షిప్తమైనవే. అందులో భూతత్వానికి నిదర్శనం మట్టి. అందుకే మట్టితో గణపతిని తయారు చేయమని చెప్పారు. 

Also Read: Vinayaka Chavithi Pooja Vidhi in Telugu: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!

మృత్తికయే పరబ్రహ్మ

మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం |
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||

ఓ మృత్తికా! నేను చేసిన పాపాలు, దుష్కృతాలు నశింపజేయి.. నువ్వు బ్రహ్మతో సృష్టించబడ్డావు. కశ్యప ప్రజాపతి మంత్రపూతతో పవిత్రురాలివి అయ్యావు ( కశ్యపుడు పవిత్రం చేసిన మట్టినే భూమంతా చల్లాడని పురాణాల్లో ఉంది)

పార్థివ లింగార్చనే శివయ్యకు ప్రీతకరం

ఓ సారి పార్వతీదేవి శివుడిని ప్రశ్నించింది.. బంగారం, వెండి, రాగి సహా ఎన్నో లోహాలతో అర్చనలు అందుకుంటారు ..మీకు అమితమైన ఆనందాన్నిచ్చే లింగార్చన ఏదని?..అందుకు ప్రతిగా పరమేశ్వరుడు  నాకు అన్నిటికన్నా పార్థివ లింగార్చనే ఇష్టం అని బదులిచ్చాడు.  పార్ధివ లింగం అంటే మట్టితో తయారు చేసినది అని అర్థం. మట్టితో తయారు చేసిన భగవంతుడి స్వరూపానికి ఇంకే లోహమూ సాటిరాదని ఆంతర్యం. మట్టితో తయారుచేసి భగవంతుడిని అర్చిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. 

Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

ప్రకృతి స్వరూపం మృత్తిక

  • ప్రకృతికి స్వరూపం అయిన మట్టినుంచి  సకల జీవులు ఉద్భవిస్తాయి
  • మట్టి నుంచి వచ్చే పదార్థాల ద్వారానే సకల జీవులు పోషింపబడతాయి
  • సకల జీవులు చివరకు మట్టిలోనే లయం అవుతాయి..ఇదే పరబ్రహ్మతత్వం
  • ఈ సత్యాన్ని చెప్పేందుకే  పరమశివుడు స్థూలరూపం అయిన భూమినుంచి మట్టిని తీసి విగ్రహం తయారుచేసి ప్రాణం పోశాడు (  వినాయక రూపాన్ని శివుడు మట్టితో తయారు చేశాడని లింగపురాణంలో ఉంది)
  • ముత్తికయే పరబ్రహ్మ స్వరూపం కనుక..మట్టి వినాయకుడినే పూజించాలి
  • ధనిక బీదా, రాజు పేదా అనే భేదం లేకుండా మట్టి అందరకీ దొరుకుతుంది..సర్వసమానత్వానికి ఏకైక నిదర్శనం భూమి/మట్టి.

సర్వ మానవత్వానికి ప్రతీక మట్టి వినాయకుడు..అందుకే మట్టి విగ్రహాన్నే పూజించాలని చెప్పాడు సూతమహర్షి..

lso Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!

వినాయకచవితిరోజు కేవలం మట్టి విగ్రహమే...

వినాయక చవితి రోజు కేవలం మట్టితో చేసిన గణేషుడినే పూజించాలని చెబుతోంది ముద్గల పురాణం. ఎందుకంటే ఈ తిథిరోజు ఇంట్లోకి వచ్చే గణపతిని ఆకర్షించే శక్తిని మట్టికి మాత్రమే ఉంది. భగవంతుడిని దేనిలోకి ఆవాహనం చేస్తామో అది పవిత్రంగా ఉండాలి...అంటే మట్టిని మించిన పవిత్రత దేనికుంది?...అందుకే మృత్తికా గణపతిని ఆరాధించాలి.

Also Read: వినాయకచవితి పూజకి ఎలాంటి విగ్రహం కొని తెచ్చుకోవాలి!

మట్టివిగ్రహం నీటిలో వెంటనే కరిగిపోతుంది..ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగదు పైగా పర్యావరణానికి మరింత అనర్థం. 21 రకాల పత్రిని మట్టి ప్రతిమను నీటిలో కలవడంతో వాటిలో ఉండే  ఔషధ గుణాలు నీళ్లలోకి కలసి ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపచేస్తాయి. పైగా ఆక్సిజన్ శాతం పెరుగుతుంది...అందుకే మట్టి గణపతే మహాగణపతి అంటారు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget