అన్వేషించండి

Ram Mandir Ayodhya: రామ మందిరానికి ఇప్పటివరకు అత్యధికంగా ఎవరు విరాళం ఇచ్చారు? దాతల పూర్తి జాబితా ఇదిగో!

Ram Mandir : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం రామ మందిరానికి వచ్చిన మొత్తం విరాళాలెంత? ఎవరెంత ఇచ్చారు? దాతల పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిరం శిఖరంపై ప్రధాని నరేంద్ర మోదీ  ధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ రాముడు,  సీతమ్మ వివాహం జరిగిన పంచమి అభిజిత్ ముహూర్తంలో ఈ ధ్వజారోహణం జరుగుతుంది. ఈ ధ్వజారోహణాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేస్తూ రామ మందిరానికి చేరుకున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు మోహన్ భాగవత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ , ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా వేలాది మంది పాల్గొన్నారు. రామ మందిరంలో ఎగురవేసే ధ్వజం రామ మందిరం పని పూర్తయిందని సూచిస్తుంది. రామ మందిరం పై ఎగురవేసే ధ్వజం 22 అడుగుల పొడవు   11 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ధ్వజాన్ని ఎగురవేయడానికి  మధ్యాహ్నం 11:58 నుండి 12:30 ముహూర్తం నిర్ణయించారు..ఈ ముహూర్తంలోనే ప్రధాని మోదీ ధ్వజాన్ని ఎగురవేశారు. 

సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన సమయంలో జనవరి 22, 2024న ప్రారంభమైంది. అదే సమయంలో రామ మందిరం కోసం చాలామంది విరాళాలు అందించారు. అయితే రామ మందిరానికి ఎక్కువ డబ్బులు ఎవరు విరాళంగా ఇచ్చారో తెలుసుకుందాం.

రామ మందిరానికి ఎవరు ఎక్కువ విరాళం ఇచ్చారు?

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ఆధ్యాత్మిక గురువు మోరారి బాపు రామ మందిర నిర్మాణానికి 11.3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇది రామ మందిరానికి వచ్చిన అతిపెద్ద విరాళం.

మోరారి బాపుతో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్‌లలోని ఆయన అనుచరులు 8 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విధంగా మోరారి బాపు మొత్తం విరాళం 18.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. రామ మందిరానికి ఇప్పటివరకు 5,500 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయి. రామ మందిర ట్రస్ట్ ప్రకారం, జనవరి 2024లో రామ భక్తులు కేవలం రెండు రోజుల్లోనే 3.17 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి 101 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు

సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లక్ష్మి ,ఆయన కుటుంబం రామ మందిరం కోసం 101 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. మార్కెట్ రేటు ప్రకారం ఈ బంగారం విలువ 68 కోట్ల రూపాయలు. వజ్రాల వ్యాపారి విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ఆలయ ద్వారాలు, గర్భగుడి, త్రిశూలం, డమరుకం, స్తంభాల అలంకరణలో ఉపయోగించారు.

అంబానీ కుటుంబం కూడా విరాళం ఇచ్చింది

రామ మందిర ప్రతిష్టాపనలో పాల్గొన్న ముఖేష్ అంబానీ ఆలయ ట్రస్ట్‌కు 2.51 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆయన కుటుంబం కూడా వ్యక్తిగతంగా వివిధ సేవలలో సహకరించింది.

మరికొందరు ప్రముఖ వ్యాపారులు కూడా విరాళాలు ఇచ్చారు

రామ మందిరానికి దేశంలోని చాలా మంది ప్రముఖ వ్యాపారులు, సంస్థలు కూడా విరాళాలు ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన గోవింద్ భాయ్ ధోకాలియా 11 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ కూడా రామ మందిరానికి 11 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

పాట్నా మహావీర్ మందిరం కూడా రామ మందిరం కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది.

గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ కంపెనీకి చెందిన ముఖేష్ పటేల్ కూడా రామ మందిరంలో 11 కోట్ల రూపాయల విలువైన డైమండ్ క్రౌన్ విరాళంగా ఇచ్చారు.

మహేష్ కబూతర్‌వాలా కూడా రామ మందిరానికి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

రామ మందిర ట్రస్ట్ ప్రకారం... 2022లో నిధుల సేకరణ ప్రారంభమైన తర్వాత, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు రామ మందిరం కోసం పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఈ నిధుల సేకరణ ప్రారంభమైన మొదటి రోజునే దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఆలయ నిర్మాణానికి 3 కోట్ల రూపాయలకు పైగా విరాళంగా ఇచ్చారు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget